కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు
జగ్గంపేట: కాపు జాతిపై కక్ష కట్టిన చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుదామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చారు. తామేదో ఆయన ఆస్తుల కోసం ఉద్యమిస్తున్నట్లు పోలీసులతో కేసులు పెట్టించి అణచివేతకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో తన నివాసంలో మంగళవారం నిరసన అనంతరం భారీగా తరలివచ్చిన అభిమానులు, మహిళలను ఉద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే వరకూ నిరసనలు కొనసాగించాలన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో తన నివాసంలో మంగళవారం నిరసన అనంతరం భారీగా తరలివచ్చిన అభిమానులు, మహిళలను ఉద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే వరకూ నిరసనలు కొనసాగించాలన్నారు.