'ఇద్దరూ మోసం చేస్తున్నారు' | Jairam ramesh takes on chandrababu and venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఇద్దరూ మోసం చేస్తున్నారు'

Apr 3 2015 2:12 PM | Updated on Mar 18 2019 7:55 PM

'ఇద్దరూ మోసం చేస్తున్నారు' - Sakshi

'ఇద్దరూ మోసం చేస్తున్నారు'

ఓ నాయుడు పోలవరంపై మోసం చేస్తే... మరో నాయుడు ప్రత్యేక హోదాపై మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్...

హైదరాబాద్ : ఓ నాయుడు పోలవరంపై మోసం చేస్తే... మరో నాయుడు ప్రత్యేక హోదాపై మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్...  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులను ఉద్దేశించి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్లో ఎన్నిసార్లు భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టిన అన్ని సార్లు తాము వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతికేరించాలని టీడీపీ, టీఆర్ఎస్లకు ఆయన సూచించారు.

గతంలతో బీజేపీ మద్దతు ఇచ్చిన యూపీఏ భూ సేకరణ బిల్లుకే మద్దతు ఇవ్వాలని ఆయన మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కావాలని బీజేపీ సహా అన్ని పార్టీలు కోరాయని జైరాం రమేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎన్డీసీ అనుమతి లేకుండానే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాటి ప్రధాని వాజపేయి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారని... ఇలాంటి విషయాలు గుర్తు పెట్టుకోవాంటూ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడుకి సూచించారు.

రాజధాని రైతులకు ఆశించినంతగా పరిహరం ఇవ్వడం లేదన్నారు. దేశంలో ఏ రాజధానికి ఇంతగా భూ సేకరణ జరగలేదని జైరాంరమేష్ అశ్చర్యం వక్యం చేశారు. విభజన చట్టంలోని వాటికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement