హైదరాబాద్: గుంటూరు - విజయవాడల మధ్యే రాష్ట్ర రాజధాని నిర్మిస్తామనరి తాము అనలేదని ఏపి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తరువాత నారాయణ విలేకరులతో మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిటీ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ ఆలోచనలు చెప్పినట్లు తెలిపారు. గుంటూరు - కృష్ణా - పశ్చిమగోదావరి జిల్లాల ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉందని ఆయన వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించిందని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ రాజధానులను కమిటీ పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇస్లామాబాద్, పుత్రజయ, షాంఘై, మలేషియాలను ఉత్తమ రాజధానులుగా కమిటీ సూచించినట్లు చెప్పారు.
రైలు, రోడ్డు, వాయు రవాణా ఉండేవిధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. రాజ్భవన్, సచివాలయం నిర్మించేందుకు అనువైన ప్రదేశాల్లోనే రాజధాని నిర్మాణం ఉంటుదని తెలిపారు. మండలి, అసెంబ్లీ, కమిషనరేట్లు అన్నీ నిర్మించేందుకు అనువైన ప్రదేశంలోనే రాజధాని నిర్మాణం అని చెప్పారు. కర్నూలుకు ట్రిపుల్ ఐటీ, అనంతపురంకు ఎన్ఐటీ, తిరుపతికి ఐఐటీ కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఇంకా 5 జిల్లాల్లో పర్యటించవలసి ఉందని తెలిపారు. వచ్చే నెల 20తేదీలోగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఈ కమిటీ త్వరలో నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు.
గుంటూరు - విజయవాడల మధ్యే అని అనలేదు: మంత్రి నారాయణ
Published Sat, Jul 26 2014 5:42 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement