⇒ టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దురుద్దేశ ప్రచారం
⇒ పార్టీ వీడుతున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎక్కడైనా చెప్పారా?
⇒ హామీలను నెరవేర్చలేని టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది
⇒ ప్రభుత్వ వైఫల్యాలపై జనవరి 21, 22 తేదీల్లో తణుకులో జగన్ దీక్ష
⇒ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అధికారపక్షం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తెలుగుదేశం పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా, కొన్ని పత్రికలు దురుద్దేశంతో పనిగట్టుకుని మరీ వైఎస్సార్ కాంగ్రెస్ ఖాళీ అవుతోందనీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి పోతున్నారనీ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు.
ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని.. అన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెళ్లిపోతున్నారని వార్తలు రాస్తున్నారంటూ.. నిజానికి తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడైనా చెప్పారా? చంద్రబాబు పాలన బాగుందన్నారా? లేక బీజేపీలో చేరుతున్నానని చెప్పారా? అని ప్రశ్నించారు. ‘‘అసలు ఎవరైనా ఏం చూసి టీడీపీలోకి వెళతారు? గత ఆరు నెలలుగా ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న ఆ పార్టీలోకి ఎవరైనా ఎందుకు వెళతారు?’’ అని పార్థసారథి విస్మయం వ్యక్తం చేశారు.
‘‘టీడీపీ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా రుణ మాఫీ సరిగ్గా అమలు జరగడం లేదన్నారు. రెవెన్యూ మంత్రినైనా తనకు తెలియకుండానే రాజధాని ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమం చేపడుతూ ఉండటంపై ఆ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని గత ఆరు నెలల్లో ప్రజలకు ఏమీ చేయలేక పోయామని బాహాటంగానే విమర్శలు చేశారు.
ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చంద్రబాబు మంత్రులను మాత్రమే దోషులుగా నిలిపే యత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న టీడీపీలోకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు వెళ్లాలనుకుం టారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, మహిళలు, నిరుద్యోగుల పక్షాన పోరాడ్డానికి ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారన్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జనవరి 21, 22 తేదీల్లో తణుకులో దీక్ష చేయబోతున్నారని ఆయన ప్రకటించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దుష్ర్పచారం
Published Mon, Dec 29 2014 2:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
SRH: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..
అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
తప్పక చదవండి
- ట్విటర్ రీ బ్రాండింగ్పై మస్క్ ట్వీట్
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement