కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Published Sat, May 4 2024 4:15 AM

-

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: అభ్యర్థి సుధీర్‌కుమార్‌

వరంగల్‌: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్‌ హల్‌లో వేలేరు, ధర్మసాగర్‌ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్‌పూర్‌కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్‌ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.

కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్‌ కబ్జాదారుడని విమర్శించారు.

కడియం శ్రీహరి, అరూరి రమేశ్‌ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్‌ సభ్యురాలు జుబేదా లాల్‌, కార్పొరేటర్‌ ఆవాల రాధిక రెడ్డి, వైస్‌ ఎంపీపీ సంపత్‌, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్‌ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement