కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలి

Published Sat, May 4 2024 4:10 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలి

వర్ధన్నపేట : పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే మాదిగల లక్ష్యమని ఎంఎస్‌పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌ అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్సీల వర్గీకరణపై అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద శనివారం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు మహేందర్‌, మాసాని గోపాల్‌, ధర్మయ్య, సుధాకర్‌, రాపాక వినోద్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement