-
గంట గంటకూ.. పెరిగిన పోలింగ్ (రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం)
నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు 9 11 1 3 4 6 8 గంటలకు గంటలకు గంటలకు గంటలకు గంటలకు గంటలకు ఆ తర్వాత అనకాపల్లి 2,13,714 1,68,754 11.60 28.54 46.10 60.80 65.40 74.71 78.96 చోడవరం 2,17,484 1,66,809 07.92 22.67 39.48 52.76 57.10 71.40 76.70 మాడుగుల 1,88,989 1,39,166 11.07 21.00 35.00 56.00 65.00 67.30 73.64 నర్సీపట్నం 2,12,046 1,37,691 06.68 21.32 40.80 58.12 59.15 59.61 64.93 పాయకరావుపేట 2,50,744 1,68,072 06.97 11.61 32.22 46.79 50.61 62.75 67.03 యలమంచిలి 2,06,394 1,26,844 06.59 14.69 34.18 47.54 53.44 54.96 61.46 -
ఆర్వోపై నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి హెచ్.వి.జయరాం ఏమి పీకుతున్నారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. మున్సిపాలిటీ గచ్చపు వీధి బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న అయ్యన్నపాత్రుడు రిటర్నింగ్ అధికారిపై నోరు పారేసుకున్నారు. ఓటేసేందుకు వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆర్డీవో ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు ఆదేశించినా కింది స్థాయిలో నర్సీపట్నం ఆర్డీవో పర్యవేక్షణ అసలు బాగోలేదన్నారు. జిల్లా కలెక్టర్కు ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే రివ్యూ మీటింగ్లో ఉన్నారని సీసీ చెబుతున్నారు తప్ప కలెక్టర్ స్పందించలేదన్నారు. -
దూరాభారం.. ఓటుపై మమకారం
యలమంచిలి రూరల్: ఎన్నికల వేళ దూరాభారాన్ని అధిగమించి ఓటు వేసేందుకు జనం రావడం విశేషం. ఊరిలో ఉండి సైతం ఓటు వేసేందుకు పోలింగ్స్టేషన్కు రాకుండా నిర్లక్ష్యం చేసే ఈ రోజుల్లో ఒడిశా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఏపీలో ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. స్వగ్రామాలకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాష్ట్రం పూరి, పారాదీప్ ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వందల సంఖ్యలో ఓటర్లు సోమవారం యలమంచిలి రైల్వేస్టేషన్లో దిగి వారి స్వగ్రామాలకు ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చామని వారంతా చెప్పారు. ఇక తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, వివిధ కోచింగ్ సెంటర్లలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్న యువకులు శ్రమించి యలమంచిలి చేరుకుని సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూరీ, పారదీప్ల నుంచి వచ్చిన మత్స్యకారులు అధిక శాతం పాయకరావుపేట నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. మత్స్యకార గ్రామాలైన రేవుపోలవరం, బంగారమ్మపాలెం యలమంచిలి నియోజకవర్గం పూడిమడక, కొత్తపట్నం గ్రామాల ఓటర్లు ఎక్కువమంది చేపలవేట నిమిత్తం ఒడిశాకు తరలి వెళ్లారు. వారంతా సోమవారం అధిక సంఖ్యలో రైళ్లపై ఇక్కడకు చేరుకుని ఓటేశారు. ● ఇతర రాష్ట్రాల నుంచి ఓటేసేందుకు తరలివచ్చిన మత్స్యకారులు -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
● నలుగురు టీడీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదుమాకవరపాలెం : వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దిపాలెం పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు బంధువుతో ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రానికి హాజరయ్యాడు. తనకు కనిపించదని, అందుకే సహాయకుడిగా తన అన్న కొడుకుతో వచ్చినట్టు చెప్పాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఒక్కరే వెళ్లాలని, వెనుక ఎవరినీ వెళ్లనివ్వద్దని అభ్యంతరం తెలిపారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన పోతల రాజునాయుడుపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వంటాకుల శ్రీరామ్మూర్తి, పోతల సన్యాసినాయుడు, వంటాకుల చంద్రశేఖర్, ఏకా గణేష్ దాడికి పాల్పడ్డారు. నలుగురిలో ఒక్కడైన సన్యాసినాయుడు సిల్వర్ బకెట్తో దాడి చేసి గాయపరిచినట్టు రాజునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు. -
● ఉదయం నుంచి రాత్రి వరకూ సడలని సంకల్పం ● ఉత్సాహంగా ఓటేసిన మహిళలు, వృద్ధులు ● గంటల తరబడి లైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగం ● సమయం మించిపోయినా కదలని ఓటరు ● జోరువానలోనూ అదే జోరు ● పలు చోట్ల ఆలస్యంగా సాగిన ఓటింగ్
ఓటింగ్ శాతం ఇలా.. (తుది సమాచారం అందేసరికి..) ప్రాంతం శాతం విశాఖ పార్లమెంటు 68.13 అనకాపల్లి జిల్లా 70.37అల్లూరి జిల్లా 63.09 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓటు పోటెత్తింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓట్ల ప్రవాహం.. రాత్రి 10 గంటల వరకూ అదే జోరుతో సాగింది. గంటల తరబడి ఓటర్లు క్యూల్లో వేచి ఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి వేళలో కొన్ని ప్రాంతాల్లో జోరువానలోనూ ఓటు సంకల్పం సడలలేదు. యువతరం ఉత్సాహాన్ని మించేలా.. వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఓటర్లు వెల్లువలా తరలివచ్చారు. తమ తలరాతను మార్చే రథసారథులను ఎన్నుకోవడంలో ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ప్రతీ బూత్.. ఓటర్లతో సందడి వాతావరణం కనిపించింది. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో కొత్త ఉత్సాహం కనిపించింది. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగు పడేందుకు.. నిరంతరం ప్రజలతో మమేకమవుతున్న నాయకత్వానికే మరోసారి పట్టం కట్టేందుకు మొగ్గు చూపినట్లు ట్రెండ్ కనిపించింది. పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నా.. పెద్దా పోటీపడ్డారు. పలు బూత్ల వద్ద ఎన్నికల సంఘం సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. మొత్తంగా, విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో 68.13 శాతం, అనకాపల్లిలో 70.37 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.09 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి కొనసాగిందిలా.. ప్రతీ ఎన్నికల్లో ఉదయం, సాయంత్రం పోలింగ్ శాతం అధికంగా నమోదవుతుంది. మధ్యాహ్నం సమయంలో మందకొడిగా సాగుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం మధ్యాహ్నం కూడా ఎక్కడా ఓటింగ్ శాతం తగ్గిపోలేదు. మండుటెండలోనూ ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోవడం కనిపించింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటలకు 10.24 శాతం, 11 గంటలకు 20.47, ఒంటి గంటకు 34.75, 3 గంటలకు 47.66 శాతం నమోదైంది. అంటే మధ్యాహ్న సమయంలో సుమారు 13 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఇక 5 గంటల సమయానికి 59.39 శాతానికి పెరిగింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 68.13 శాతం నమోదైంది. అల్లూరి జిల్లాలో ఉదయం 9 గంటలకు 6.73 శాతంతో మందకొండిగా మొదలై 11 గంటలకు 18.07 శాతానికి చేరుకుంది. ఒంటి గంటకు 32.75 శాతం, 3 గంటలకు 48.67 శాతం... సాయంత్రం 4 గంటలకు 53.62 శాతంగా నమోదైంది. అప్పటికీ ఇంకా ఓటర్లు క్యూల్లో ఉండటంతో ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. అనకాపల్లి జిల్లాలో ఉదయం 9 గంటలకు 8.47 శాతం పోలింగ్తో నెమ్మదిగా నమోదై.. 11 గంటలకు 19.97 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మారింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా సగానికిపైగా పోలింగ్ పూర్తయి 53.45 శాతం నమోదైంది. తర్వాత 3 గంటలకు 58.11 శాతం, సాయంత్రం 5 గంటలకు 69.3 శాతానికి చేరి.. మొత్తంగా 70.37 శాతం పోలింగ్ నమోదైంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే, అప్పటికే ఓటింగ్ కోసం లైన్లో ఉన్న వారందరికీ అవకాశం ఉండటంతో రాత్రి వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం సైతం ఓటర్ల సంకల్పాన్ని భగ్నం చేయలేకపోయింది. ఒకవైపు వర్షంతో కరెంట్ సరఫరా నిలిచిపోయి.. ఓటింగ్కు ఆలస్యమవుతుందని తెలిసినప్పటికీ.. వేచి ఉండి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు వెనుదిరగకుండా క్యూలో ఉండి మరీ ఓటు వేశారు. అడుగడుగునా ఉల్లంఘనలు పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా బరిలో దిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. దౌర్జన్యాలకు దిగి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అనకాపల్లి జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి పోలింగ్ సిబ్బందితో సెల్ఫీలు దిగుతూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఓటమి భయంతో అధికారులపై మాటల దాడికి దిగారు. అనేక నియోజకవర్గాల్లో ఓటరు స్లిప్పులతోపాటు సూపర్ సిక్స్ హామీలతో కూడిన పత్రాలను పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది మంది పోలింగ్ సిబ్బంది కళ్లు కనపడని వారి ఓట్లను తమకిష్టమైన వారికి వేసేందుకు యత్నించారు. విశాఖ ఉత్తరలో బీజేపీ అభ్యర్థి పార్టీ జెండాను పోలింగ్ కేంద్రం సమీపంలో కట్టారు. విశాఖ దక్షిణలో కొద్దిమంది రౌడీ యువకులు ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఏజెన్సీలో ప్రశాంతంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు బలగాలను మోహరించారు. కొన్ని చోట్ల వర్షం కురిసినా ఓటు వేసేందుకు గెడ్డలు దాటి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మన్యంలో మునుపెన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. మారేడుమిల్లి మండలం గుర్తేడు ప్రాంతంలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను హెలికాప్టర్లో రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. గూడెంకొత్తవీధి మండలం కప్పకొండ గ్రామస్తులు గుర్రాలపై దుప్పలవాడ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కుంకుపూడిలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. బుంగాపుట్టు పంచాయతీ పరిధిలో 19 గ్రామాలకు చెందిన 1,313 మంది ఓటర్లకు లక్ష్మీపురం పోలింగ్ కేంద్రంలో అవకాశం కల్పించారు. వీరందరినీ నాలుగు జీపుల్లో అధికారులు పోలింగ్ కేంద్రానికి తరలించారు. స్ఫూర్తివంతం.. వృద్ధులు, దివ్యాంగుల చైతన్యం -
ఓటెత్తిన యువత
● తొలి‘చుక్క’ పొడిచింది ● తొలిసారిగా ఓటు వేసిన వారిలో హర్షాతిరేకం ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక వేడుక. కొత్తగా హక్కు పొందినవారు మొదటిసారిగా ఓటు వేయడానికి పోటెత్తారు. యలమంచిలి నియోజకవర్గంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత సామాజిక బాధ్యత గుర్తెరిగి సమర్థవంతమై పాలన అందించే నాయకత్వం వైపే మొగ్గు చూపింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిజాయితీగా ఓటు వేయడం గర్వంగా ఉంటుందని చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వినియోగించుకున్నామని పలువురు పేర్కొన్నారు. తొలిసారి ఓటేసిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే... -
ఓటెత్తారు
ఓటు పోటెత్తిందిలా.. (తుది సమాచారం అందేసరికి) భీమిలి 60.67 విశాఖ తూర్పు 60.53 విశాఖ దక్షిణ 53.31 విశాఖ ఉత్తర 54.00 విశాఖ పశ్చిమ 56.49 గాజువాక 58.23 పెందుర్తి 56.50 ఎస్.కోట 73.19 చోడవరం 76.70 మాడుగుల 73.64 అనకాపల్లి 78.96 యలమంచిలి 61.46 పాయకరావుపేట 67.03 నర్సీపట్నం 64.93 అరకు 55.85 పాడేరు 45.78 రంపచోడవరం 59.25 -
ఓటు వేసేందుకు వెళ్తుండగా అపశృతి
అనంతగిరి: మండలంలోని కుడియ సమీపంలో సోమవారం వాహనం బోల్తాపడి 21 మందికి స్వల్ప గాయాలవగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు. పెదకోట పంచాయతీ పాటిపల్లి, టాంకోట, వేలమామిడి గ్రామాలకు చెందిన 25 మంది ఓటర్లువాహనంలో పెదకోట పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. కుడియ సమీపంలోని మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలోని పాటిపల్లి గ్రామానికి చెందిన జన్ని కొండమ్మ, ఎస్.నాగులు, బి.కొండబాబు, జె.శుక్రన్న, వి.ఎర్రన్న, బి.చిన్నలమ్మ, పి.ఈశ్వరరావు, పి.పుష్పవతి, టాంకోటకు చెందిన పి.రాములమ్మ, వేలమామిడికి చెందిన పి.వరహాలమ్మ, పి.పెద్దమ్మ,పి.అప్పన్న, ఎస్.రాజు, వి.రత్నయ్య, కె.కొండబాబు, పి.చిన్నలక్ష్మి, పి.అప్పలస్వామి, ఎం.ప్రసాద్, డ్రైవర్ బి.బాలురాజు, హెల్పర్ బి.జగదీష్లు స్వల్పంగా గాయపడ్డారు. పాటిపల్లికి చెందిన బోయిన చిన్న, ఉల్లి ఎండమ్మ, పి.రాములమ్మ, కె.తవుడమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికి పినకోట పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాద విషయాన్ని ఐటీడీఏ పీవో అభిషేక్ దృష్టికి వైస్ ఎంపీపీ ఉర్మ శకుంతల సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన ఆయన అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. వాహనం బోల్తా పడి 27 మందికి గాయాలు నలుగురి పరిస్థితి విషమం -
పలు రైళ్ల రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవలసిన పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున విశాఖపట్నం, శ్రీకాకుళం స్టేషన్ల నుంచి పలు రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ● విశాఖలో సోమవారం రాత్రి 7.10 గంటలకు బయల్దేరవలసినవిశాఖపట్నం–తిరుపతి (08 5 83) స్పెషల్ ఎక్స్ప్రెస్ సుమారు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11.20 గంటలకు బయల్దేరింది. ● శ్రీకాకుళం రోడ్లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరవలసిన శ్రీకాకుళం రోడ్–తిరుపతి(07441) స్పెషల్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా మంగళవారం ఉదయం 5.30 గంటలకు బయల్దేరింది. ● విశాఖలో సోమవారం రాత్రి 11.20 గంటలకు బయల్దేరవలసిన విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్ప్రెస్ సుమారు గంట ఆలస్యంగా మధ్య రాత్రి 12.30 గంటలకు బయల్దేరింది. -
ఆకర్షణీయంగా పింక్ పోలింగ్ కేంద్రం
మునగపాక: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లోని 171 పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ స్టేషన్గా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కేంద్రం పరిధిలో 1208 మంది ఓటర్లు ఉండగా వీరిలో 759 మంది మహిళలు ఉన్నారు. ఈ కేంద్రానికి సంబంధించి ఒక పీవో, ఐదుగురు ఏపీవోలు మహిళలే కావడంతో పింక్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. పోలింగ్ కేంద్రానికి ఎదురుగా ముగ్గులతో అలంకరించడంతో పాటు బెలూన్ల ఏర్పాటు చేసి ఆకట్టుకునేలా తయారు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు ఈ కేంద్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. పింక్ పోలింగ్ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో బీఎల్వోలు శ్రావణ్కుమార్,హిమబిందులు ప్రత్యేకంగా కృషి చేశారు. -
ప్రయాణికుల కోసం ఎన్నికల స్పెషల్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ ఎన్నికల కోసం వచ్చిన ప్రయాణికుల కోసం విశాఖపట్నం–బ్రహ్మపూర్– విశాఖపట్నం మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్ ఫాస్ట్ పాసింజర్ సోమవారం ఉదయం 8.30గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 1గంటకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపూర్–విశాఖపట్నం ఫాస్ట్ పాసింజర్ బ్రహ్మపూర్లో సాయంత్రం 6.30గంటలకు బయల్దేరి రాత్రి 11.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్ ఆదివారం రాత్రి 11.20గంటలకు విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం– లోకమాన్యతిలక్ టెర్మినస్(18519) ఎక్స్ప్రెస్ పెయిరింగ్ రైలు ఆలస్యం కారణంగా సుమారు 8గంటలు ఆలస్యంగా సోమవారం ఉదయం 7.20గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు మార్పులను గమనించాలని కోరారు. -
18న మార్షల్ ఆర్ట్స్పై ఇంటర్నేషనల్ సెమినార్
తగరపువలస : జపాన్కు చెందిన 10వ డాన్ బ్లాక్బెల్ట్ గ్రహీత తకాషి మసూయమి ఆధ్వర్యంలో అక్కడి మార్షల్ ఆర్ట్స్ షోలీ టైటిల్కు సంబంధించి ఈ నెల 18న విశాఖ పోర్ట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు ఆదర్శనగర్లోని పీఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణ శిబిరంలో ఆల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ చీఫ్ ఎగ్జామినర్ అండ్ కోచ్ పి.నరసింహారావు ఆదివారం తెలిపారు. బ్రౌన్, బ్లాక్ బెల్టులు కలిగిన 150 మందికి ఈ సెమినార్లో ప్రవేశం ఉంటుందన్నారు. 19న అక్కడే నేషనల్ కరాటే చాంఫియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 35 ఏళ్లుగా వేసవి శిక్షణ శిబిరం పీఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున విశాఖ, విజయనగరం, భీమిలి, పోలిపల్లి, ఎలమంచిలి తదితర ప్రాంతాల్లో ఏటా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తగరపువలసలో బ్లాక్ బెల్ట్ గ్రహీత బంగారు పరదేశి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరానికి 35 ఏళ్లు నిండాయన్నారు. 45 రోజులపాటు జరిగే ఈ ఉచిత శిక్షణకు పరదేశి సొంతంగా చిన్నారులకు పాలు, గుడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కోచ్లు బంగారు గౌతమ్, కర్రి చిట్టిబాబు పాల్గొన్నారు. -
No Headline
సాక్షి, అనకాపల్లి: రాష్ట్ర భవిష్యత్ను నిర్దేశించే సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో తీర్పునిచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. నేతల తలరాతలను మార్చే ఓటు హక్కే వారి చేతిలోని వజ్రాయుధం. రాష్ట్ర విభజన తరువాత మూడోసారి జరుగుతున్న ఎన్నికలివి. ఓటర్లు రెండుసార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకటి పార్లమెంటు అభ్యర్థికి.. మరొకటి అసెంబ్లీ అభ్యర్థికి.. అనకాపల్లి లోక్సభ స్థానానికి 32 మంది పోటీలో నిలవగా.. ఆ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 176 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలో అత్యధికంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి 12 మంది పోటీలో నిలవగా.. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్కు ఆరుగురు బరిలో నిలిచారు. 15,96,916 మంది ఓటర్లు వారి తలరాతను నిర్ణయించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పార్లమెంట్ పరిధిలో 1,828 పోలింగ్ కేంద్రాల్లో 2,237 బీయూ(బ్యాలెట్ యూనిట్లు), 1,850 సీయూ (కమిషనింగ్ యూనిట్లు), 2,437 వీవీ ప్యాట్లు ఉపయోగిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరిధిలో 1529 పోలింగ్ కేంద్రాల్లో 1854 బ్యాలెట్ యూనిట్లు, 1850 కమిషనింగ్ యూనిట్లు, 1,993 వీవీ ప్యాట్లు ఉపయోగిస్తున్నారు. వీటిలో 101 బీయూ, 127 సీయూ, 139 వీవీ ప్యాట్లు రిజర్వుగా ఉపయోగిస్తున్నారు. 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,189 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ విధులకు 251 బస్సులు జిల్లాలో పోలింగ్ సామగ్రిని, సిబ్బందిని తరలించేందుకు 251 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 140 బస్సులు విశాఖ నుంచి వచ్చాయి. అనకాపల్లి జిల్లా నుంచి పాడేరు, అరకు నియోజకవర్గాలకు 39 ఆర్టీసీ బస్సులను పంపించారు. ఈ బస్సులు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరాయి. 14వ తేదీ ఉదయం 9 గంటలకు యథావిధిగా తమ డిపోలకు చేరుకుంటాయి. మహిళా ఓటర్లే అధికం జిల్లాలో గల 6 నియోజకవర్గాల్లో 12,89,371 మంది ఓటర్లు ఉండగా..వారిలో 6,62,202 మంది మహిహిళా ఓటర్లు, 6,27,321 మంది పురుషులు ఉన్నారు. పురుషులు కన్నా మహిళలలే అధికంగా ఉన్నారు. అత్యధికంగా చోడవరం నియోజకవర్గంలో 1,11,863మంది ఉండగా..అత్యల్పంగా మాడుగుల నియోజకవర్గంలో 96,886 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్తగా నమోదైన 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువ ఓటర్లు 34,112 మంది, దివ్యాంగులు 21,598 మంది ఓటర్లు ఉన్నారు. 10,538 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 10,538 మంది సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 380 మంది మైక్రో అబ్జర్వర్లు, 1,529 మంది వెబ్కాస్టింగ్ సిబ్బంది, 1666 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. 55 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 వీడియో వీవీంగ్ టీంలు, 7 అకౌంటింగ్ టీంలు, 7 అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ టీంలు, 157 సెక్టోరల్ అధికారులు, 145 రూట్ అధికారులు విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు.. ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల వద్ద షామియానా, కుర్చీలకు రూ.3 వేలు మంజూరు చేసింది. అంతేకాకుండా పోలింగ్ సిబ్బంది టీ, టిఫిన్, భోజనం ఖర్చులకు రూ.5 వేల వరకు మంజూరు చేసింది. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలకు కోటి 22 లక్షల 32 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. వృద్ధ, దివ్యాంగ ఓటర్లకు సహాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లో ర్యాంపు సహాయకులను, వీల్చైర్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీవీప్యాట్ను తనిఖీ చేసుకుంటున్న ఎన్నికల అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే చర్యలు జిల్లావ్యాప్తంగా ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఫోన్ నంబర్ 08924226599 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1950 లేదా దగ్గరలోని సంబంధిత పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఫొటోస్, వీడియోస్తో కూడిన ఫిర్యాదులు 9440904229 నంబరుకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద.. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ స్టేషన్ల వద్దకు మంచినీళ్ల బాటిల్స్, ఇంకు సీసాలు, బాల్ పెన్లు తీసుకురావడం పూర్తిగా నిషేధం. మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదు. పోలింగ్ ఏజెంట్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల లోపల వరకు ఎటువంటి వాహనాలను అనుమతించరు. పోలింగ్ బూత్ నుంచి 200 మీటర్ల అవతల మాత్రమే ఓటరు స్లిప్పులకు అనుమతి పోలింగ్ బూత్కు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్లి ఓటు వేసుకోవచ్చు. -
No Headline
నేడే ఓట్ల పండగ పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలో ఉన్నది అనకాపల్లి లోక్సభ స్థానానికి 32 మంది 7 అసెంబ్లీ స్థానాలకు 176 మంది ● పోలింగ్కు సర్వసన్నద్ధం ● మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లు ● వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు -
ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
● ఓటేసేందుకు స్వగ్రామాలకు పయనంఅనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో నర్సీపట్నం బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని చైన్నె, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, వంటి దూర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దాంతో ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ స్వగ్రామాలకు వెళ్తున్నామని పలువురు ఓటర్లు ఉత్సాహంగా చెప్పారు. ఎన్నికల విధులకు బస్సులు పంపిన నేపథ్యంలో వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలకు అదనపు నగదు చెల్లించి స్వగ్రామాలకు చేరుకున్నారు. అనకాపల్లి డిపో నుంచి 70 బస్సులు ఎన్నికల విధులకు వెళ్లడంతో మిగిలిన 30 బస్సులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నడిపామని డిపో మేనేజర్ ఎన్.సుజాత తెలిపారు. -
18 వేల మందిపై బైండోవర్ కేసులు
అనకాపల్లి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్గున్ని తెలిపారు. స్థానిక జీవీఎంసీ పెద్ద హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, రేంజ్ పరిధిలో కేంద్ర బలగాలు, లోకల్ పోలీసుల పర్యవేక్షణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రేంజ్ పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు, తమ సిబ్బంది ప్రత్యేక దృష్టి సాధించామని తెలిపారు. 16 కేజీల వెండి, 6.4 గ్రాముల బంగారం, రూ.4.5 కోట్లు నగదును 5 జిల్లాలో సీజ్ చేసినట్టు చెప్పారు. 18 వేల మందిపై రౌడీషీటర్, అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై బైండోవర్ కేసులు, 1,150 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలతో చర్చించి సరిహద్దుల చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంచింగ్పుట్, రంపచోడవరం, ఎటపాక మండలాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.వి.మురళీకృష్ణ, డీఎస్పీ అప్పలరాజు పాల్గొన్నారు. రూ.4.5 కోట్లు స్వాధీనం 16 కేజీల వెండి, 6.4 గ్రాముల బంగారం స్వాధీనం 1150 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు డీఐజీ విశాల్ గున్ని వెల్లడి -
తరలిన విద్యార్థులు..వర్సిటీ నిర్మానుష్యం
నిర్మానుష్యంగా ఏయూ పరిపాలనభవనానికి వెళ్లే మార్గం ఏయూ క్యాంపస్: ఓటు వేసేందుకు విద్యార్థులు తమ స్వగ్రామాలకు తరలిపోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం బోసిపోయింది. వర్సిటీ రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నార్త్ క్యాంపస్ను పూర్తిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు వినియోగిస్తున్నారు. సౌత్ క్యాంపస్ మాత్రం విద్యార్థులు లేక బోసిపోయింది. దీనికి తోడు రెండో శనివారం, ఆదివారం కలసి రావడంతో వర్సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. వర్సిటీ ఉద్యోగులు సైతం ఎన్నికల విధులకు వెళ్లిపోయారు. -
ఊరు మారిపోయింది..
● అందమైన కలలా ఉంది ● ప్రగతికి చిరునామాగా నిలిచింది ● ఒక్కటే కోరిక మిగిలింది.. ● ఈ ఆనందం శాశ్వతం కావాలని ఉంది అప్పుడప్పుడూ పీడ కలలా ఆ చీకటి రోజులు గుర్తుకొస్తుంటాయి.. జన్మభూమి కమిటీల అరాచకాలు, దౌర్జన్యాలు, మోసపూరిత వాగ్దానాలు, లంచాలు, అవినీతి జ్ఞాపకాలు ముల్లులా గుండెను గుచ్చుతుంటాయి. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం బారులు తీరడం, ఆదుకునే దిక్కులేక అప్పుల పాలవ్వడం.. ఇలాంటి ఎన్నో చేదు గుర్తులు వెంటాడుతుంటాయి. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించిన అంకితభావం.. రాబోయే తరాలు బాగుపడేలా అభివృద్ధికి పునాదులు వేసే దార్శనికత.. వృద్ధుల్ని సొంత బిడ్డల్లా చూసుకునే వలంటీర్లు.. లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే సచివాలయ వ్యవస్థ, పారిశ్రామిక ప్రగతి శాశ్వతం కావాలంటే.. ప్రతి రోజూ పండగ కావాలంటే నేడే సరైన నిర్ణయం తీసుకోవాలి. – చోడవరం, అచ్యుతాపురం ఆ సమయంలో కాస్త గుబులుగా ఉంటుంది.. మోసగాళ్ల మాయలో పడి మన సోదరులు మళ్లీ బోల్తా పడతారేమో.. ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మి తప్పటడుగులు వేస్తారేమో.. అంతా అయ్యాక నిండా మునిగాక లబోదిబోమంటే ప్రయోజనం ఏముంటుంది.. బడుల్లో బాలల కిలకిలారావాలు.. ఆస్పత్రుల్లో స్వస్థత చేకూరిన రోగులు.. రైతుకు భరోసా కల్పించే కేంద్రాలు.. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం.. ఇది మా ఊరేనా అనిపించేలా అనేకానేక మంచి మార్పులు.. ఎక్కడ చూసినా సంతోషం, సానుకూలత.. ఇది అందమైన కల కాదు.. అంది వచ్చిన అదృష్టం.. ఇప్పుడు అందరి మదిలో మెదిలే భావన ఒకటే.. ఈ ఆనందం శాశ్వతం కావాలి. -
వైభవంగా త్యాగరాజ స్వామి జయంత్యుత్సవం
మద్దిలపాలెం(విశాఖ) : త్యాగరాజ స్వామి జయంత్యుత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఐవీఎస్ శాసీ్త్ర సంగీత సమితి ఆధ్వర్యంలో ఆకొండి వెంకటరావు శిష్య బృందం ఆలపించిన శ్రీరామ గానామృతం హృద్యంగా సాగింది. ఈ వేడుకలను త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి విమోక్షానంద మహారాజ్ ప్రారంభించారు. అనంతరం ఆకొండి వెంకటరావు రూపకల్పన చేసిన భజనమంజరి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రాంబాబు పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబిక ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చి, పిల్లపాపలతో బాలాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు తమ ఇళ్ల వద్ద శనివారం రాత్రంతా అమ్మవారి పాట నిర్వహించి, కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో వంటలు చేసుకుని, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూకాంప్లెక్స్లన్నీ నిండిపోవడంతో ఆలయ రహదారిపై భక్తులు బారులుతీరారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వృద్ధులు, గర్భిణులకు ఆలయ ఈవో బండారు ప్రసాద్ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.శంకరరావు, పైడపునాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఆగని టీడీపీ అరాచకాలు
గోపాలపట్నం: టీడీపీ నాయకుల అరాచకాలు పోలింగ్ రోజు కూడా కొనసాగాయి. దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు సాగించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. అడ్డుకున్న వైఎసార్ సీపీనేతలపై దౌర్జన్యానికి దిగారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో టీడీపీ వ్యక్తి బూత్ లోపలికి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తుండడాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీకి చెందిన కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇదంతా చూసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పా ఆ వ్యక్తిని బయటకు పంపించలేదని విమర్శిస్తున్నారు. ఇదే విధంగా లక్ష్మీనగర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వెళ్తున్నానని చెప్పి ఓటు వేయకుండా లోపల క్యూలైన్లో ఉన్న వారిని ప్రలోభాలకు గురి చేసిన టీడీపీ కార్యకర్తను పోలీసుల సాయంతో బయటకు పంపించారు. బుచ్చిరాజుపాలెంలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థి గణబాబు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఫొటోలు ఉన్న స్లిప్లు ఓటర్లకు ఇచ్చారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. అధికారులు వెళ్లి పోయిన తర్వాత తిరిగి వాటిని తీసుకు వచ్చి ప్రభావితం చేసేందుకు యత్నించారు. స్థానిక వైఎసార్ సీపీ నాయకులు దీన్ని అడ్డుకున్నారు. గతంలో మాదిరిగా దొంగ ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు గొడవలకు దిగారు. -
ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లు
ఓటమి భయం కూటమి నేతల కుతంత్రాలకు తెరతీసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అడుగడుగునా ఎన్నికల కోడ్ను అతిక్రమించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ధన, అనుచర బలంతో పేట్రేగిపోయారు. డబ్బులు వెదజల్లి సీటు దక్కించుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ గత నెల రోజుల నుంచీ చేస్తున్న అరాచకాలను పోలింగ్ రోజైన సోమవారం మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. పోలింగ్ ప్రారంభానికి ముందే మొదలైన ఈ దారుణాలను పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగించారు. పోలీసులు, అధికారులు కూడా భయపడ్డ పరిస్థితి. సాక్షి, అనకాపల్లి: ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని కూటమి నేతలు తమ అరాచకాలతో పలు చోట్ల ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. పోలింగ్ బూత్ల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో పోలింగ్ బూత్ల్లోకి నేరుగా సెల్ఫోన్లతో ప్రవేశించిచారు. టీడీపీ ఏజెంట్లతో ఫోటోలు దిగారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులపై దూషణలకు పాల్పడ్డారు. పార్టీ కండువాలతో పోలింగ్ బూత్ల్లో ప్రవేశించి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట్లు వేశారు. ఓటర్ స్లిప్లతో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడిచారు. సీఎం రమేష్ ఓవరాక్షన్ బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే కాకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ప్రచార కేంద్రంగా మార్చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కాశీపురం ప్రభుత్వ హైసూ్కల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన వెళ్లారు. క్యూ లైన్లో ఉన్న ఓటర్లను కలిసి బీజేపీకి ఓటేయాలంటూ ప్రలోభాలకు గురిచేశారు. పోలింగ్ బూత్లో ఉన్న టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్కు దిగారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కల్గిస్తున్న ఆయన్ని లోపలికి రానించడంతోపాటు, ఎన్నికల సిబ్బంది సకల గౌరవ మర్యాదలు చేయడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం గమనార్హం. అనంతరం దేవరాపల్లి హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించారు. వారి అనుచరులతో పోలింగ్ బూత్లోకి చొరబడి ఓటింగ్ ప్రక్రియకు ఆటకం కలిగించారు.బూతుల అయ్యన్న ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల ఛీత్కాలు ఎదుర్కొనే మాజీ మంత్రి, టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్నపాత్రుడు పోలింగ్ రోజూ తన నోటి దురుసును ప్రదర్శించారు. నర్సీపట్నం టౌన్ గరŠల్స్ హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులను బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. రాయడానికి వీళ్లేని తిట్లందుకున్నారు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఆ బూతులు విని ఓటర్లు అయ్యన్నను అసహ్యించుకున్నారు. ఓటేసేందుకు లైన్లలో నిరీక్షిస్తున్న మహిళల ముందే ఈయన ఈ బూతుల్ని అందుకున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టి, రిటర్నింగ్ అధికారి హెచ్వీ జయరాంలను దూషించి మాట్లాడాడు. ఓటరు స్లిప్పుల పేరిట మేనిఫెస్టో కాపీలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో టీడీపీ నేతలు మరింతగా దిగజారారు. ఓటర్ స్లిప్లతో పాటు టీడీపీ మేనిఫెస్టోను పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో మూలకుద్దు, మధురవాడ, సంతపేట అంబేడ్కర్ హైసూ్కల్, పెద»ొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్, రామారావుపేట, శివపురం తదితర ప్రాంతాల్లో ఓటరు స్లిప్తో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేశారు. బంగారుమెట్ట మీద దుర్గాలమ్మ ఆలయం వద్ద సూపర్ సిక్స్ ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేశారు. పెద»ొడ్డేపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు నిలదీయడంతో పోలీసులు స్లిప్పులు స్వా«దీనం చేసుకున్నారు. రామారావుపేటలో మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మోహన్ స్వయంగా వచ్చి స్లిప్పులు స్వా«దీనం చేసుకుని టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది.పార్టీ కండువాతో ఓటింగ్కు పంచకర్ల పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కూడా నిబంధనల ఉల్లంఘనలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. సుజాతనగర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటేసేందుకు ఉదయం 10 గంటల సమయంలో ఆయన వచ్చారు. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన అతన్ని అధికారులు ఏ మాత్రం అడ్డుకోకపోవపోడం గమనార్హం.ఓటర్ల చైతన్యం.. అధికారిపై చర్యలు ఓటర్లలో చైతన్యం పెరిగింది. వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారికి బుద్ధి చెప్పేలా చేశారు. సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు పోలింగ్ బూత్లో కళ్లు సరిగా కనిపించని వృద్ధుల ఓట్లను అక్కడి పోలింగ్ అధికారి టీడీపీకి వేయించాడు. ప్రశ్నించిన ఏజెంట్పై దురుసుగా ప్రవర్తించాడు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లిలోని పోలింగ్ బూత్ నెం.173లో వృద్ధురాలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరగా, పోలింగ్ అధికారి కమలం పువ్వు గుర్తుకు ఓటేశారు. దీన్ని గుర్తించిన 70 ఏళ్ల వృద్ధురాలు నిలదీయడంతో ఏజెంట్లు ప్రశ్నించారు. విషయం ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కు తెలియడంతో ఆయన అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి వేరే వారిని నియమించారు.టీడీపీ కండువాతో గంటా హల్చల్తగరపువలస: భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోలింగ్ రోజున కూడా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్తో కలిసి సోమవారం టీడీపీ కండువా వేసుకుని ఆనందపురం మండలంలోని పలు పోలింగ్ బూత్ల్లో ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించిన ఎన్నికల సిబ్బంది.. గంటా పచ్చ కుండువాతో పోలింగ్ బూత్ల్లోకి ప్రవేశించినా అడ్డు చెప్పలేదు. పైగా బూత్ల్లో, బయట ప్రచారం నిర్వహించిన గంటా సైకిల్కు ఓటు వేయాలని అభ్యరి్థంచారు. దీనికి తోడు గుంపుగా బూత్ల్లో ప్రవేశించినా.. పోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అడ్డుకోలేదు. గంటాతో పాటు అతనికి సహకరించిన పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్లో..పద్మనాభం: రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద సోమవారం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి గంటా పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కండువాతో వెళ్లడానికి వీల్లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సుమారు 20 నిమిషాల పాటు గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద ఉండిపోయారు. చివరకు గంటా కండువా తీసి ఒక్కరే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లారు. -
పదవి ఏదైనా ప్రజలతోనే..
మాడుగుల : ఎందరో ఉండగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడినే వైఎస్సార్సీపీ ఎంపిక చేయడానికి కారణం.. ఆయన చిత్తశుద్ధి.. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నైజం.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించే సహనం వంటి సుగుణాలే. అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా తారువ క్యాంపు కార్యాలయంలోని వేప చెట్టు కిందే గడిపేస్తారు ఆయన. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాక్షి ఇంటర్వ్యూలో ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారో ఆయన వివరించారు. అనేక విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ’గడప గడప’తో మంచి గుర్తింపు.. ప్రజా సమస్యలు కూలంకషంగా తెలుసుకోవడానికి సీఎం జగన్మోహన్రెడ్డి రూపొందించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి మన్ననలు పొందాను. ఎమ్మెల్యేగా రెండుసార్లు పని చేసిన అనుభవంతో పాటు ప్రభుత్వం అందజేసే ప్రతి రూపాయి అభివృద్ధికి.. పేదల ఉన్నతికి ఖర్చు చేయడంతో పార్టీ నన్ను గుర్తించింది. అందుకే సీఎం జగన్మోహన్రెడ్డి నాపై పెద్ద బాధ్యత పెట్టారు. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. కొత్త జిల్లా అనే సమస్యను అధిగమిస్తా.. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడం వలన నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం.. ఉద్యోగులు, అధికారులతో సమన్వయం వంటి కొన్ని ప్రాథమిక సమస్యలుంటాయి. వాటిని నేర్పుతో అధిగమిస్తాను. అనకాపల్లి సమస్యలు పార్లమెంటులో వినిపించి ఒక ప్రణాళిక ప్రకారం ఐదేళ్లలో మాడుగుల అభివృద్ధికి ఎలా కృషి చేశానో అలా కృషి చేస్తాను. అందరినీ కలుపుకుని ముందుకెళ్తా.. అనకాపల్లి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలున్నాయి. ప్రతి నెల నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. అక్కడి నాయకులను కలుపుకుని అభివృద్ధికి కృషి చేస్తాను. నిధుల విడుదలకు ప్రయత్నిస్తాను. వర్గాలు లేకుండా అంతా ఒకే తాటిపైకి వచ్చేలా ముందుకెళ్తాను. నూతన జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తాను.. కొత్త జిల్లా అభివృద్ధికి సర్వశక్తులు ఒడ్డుతాను. అసెంబ్లీ సమావేశాల సమయంలో అమరావతి, లేదంటే తారువ క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడిని. ఇకపై అనకాపల్లిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటాను. ఢిల్లీ సమావేశాల సమయంలో అక్కడికి వెళ్తాను. ప్రజల మధ్యే ఉంటా.. ఎంపీ అంటే ప్రజలతో పెద్దగా సంబంధాలు లేని పదవి అని చాలా మంది అనుకుంటారు. నిజమైన ప్రజా సేవకుడికి పదవులతో పనేం ఉంది? నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాడిని. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉన్నాను. ఇకపై కూడా ఉంటాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవుల్లో ఉండి కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. నాదెప్పుడూ అదే ఒరవడి. గతంలో ఉన్నట్లే నా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. అభివృద్ధికి.. సంక్షేమానికి కృషి చేస్తాను. పారిశ్రామికంగా అనకాపల్లిని అభివృద్ధి చేస్తా.. నా ప్రాథమిక విద్య అంతా అనకాపల్లిలోనే జరిగింది. చిన్ననాటి నుండి అనకాపల్లిపై అవగాహన ఉంది. బెల్లం మార్కెట్కు అనకాపల్లి ప్రసిద్ధి. సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో అనకాపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నేను లోకల్.. అనకాపల్లిలో నాన్లోకల్ అభ్యర్థులను ఓడించి పంపిస్తారు. అదిక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఎన్నికల తర్వాత ఎవరు అందుబాటులో ఉంటారు.. ఎవరుండరు అనే సంగతి ఇక్కడి ప్రజలు ఆలోచిస్తారు. ప్రస్తుతం నాన్ లోకల్ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తుండటంతో అనకాపల్లి ప్రజలు లోకల్ అయిన నన్నే గెలిపిస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది. దీంతో పాటు సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కూడా నా గెలుపును మరింత సులువు చేస్తాయని బలంగా నమ్ముతున్నాను. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, డిప్యూటీ సీఎం.. ఇలా పదవి ఏదైనా ప్రజలు.. సామాన్య కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా స్వయంగా తానే సమాధానం ఇస్తారు బూడి ముత్యాలనాయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా స్థిరంగా నిలబడే తత్వం ఆయనది. హంగు.. ఆర్భాటాలు లేకుండా తారువలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు సావధానంగా వింటారు. తక్కువ వ్యవధిలోనే పరిష్కరించి.. మన్ననలందుకుంటారు.. ఇదీ బూడి వ్యవహార శైలి. నమ్ముకున్న సిద్ధాంతం.. ఇచ్చిన మాట కోసం ఎందాకై నా.. సాక్షితో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు -
నిబంధనలు పక్కాగా పాటించాలి
తుమ్మపాల: జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సాధారణ పరిశీలకులు దల్జీత్ సింగ్, రాకేష్ కుమార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 72 గంటల సమయంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నలుగురికి మించి ఎక్కడా గుమిగూడరాదన్నారు. నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అర్హులైన ఓటర్లందరికీ పోలింగ్ స్టేషన్ల వద్ద సురక్షితంగా ఓటు హక్కు వినియోగించుకునే ప్రశాంత వాతావరణం కల్పించామన్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎం.రామ్మూర్తి, డీటీ రవిబాబు, ఎస్ఎ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ప్రచారపర్వంలో ఆఖరి రోజు శనివారం జిల్లా అంతటా హోరెత్తింది. ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు జరిపాయి. నర్సీపట్నంలో జరిగిన రోడ్ షోలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పెట్ల ఉమాశంకర గణేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరణం ధర్మశ్రీ చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో, మలసాల భరత్ అనకాపల్లి టౌన్లో, ఈర్లె అనురాధ కె.కోటపాడు మండలంలో, కంబాల జోగులు నక్కపల్లి, కోటవురట్ల తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. – సాక్షి న్యూస్ నెట్వర్క్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement