-
అయితే తిట్టు..లేదంటే ఒట్టు
వెల్దుర్తి (తూప్రాన్), చిన్నశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అయితే తిట్టు.. లేదంటే ఒట్టు అన్నట్లుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో, చిన్నశంకరంపేటలో నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడారు.తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపుమేస్త్రీ గువ్వ గుయ్యిమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హామీల అమలు చేయమని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారని విమర్శించారు. మండుటెండల్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందన్నారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు మోసం మైనార్టీలకు కనీసం కేబినెట్లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లింలను సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రంజాన్ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. ప్రజలకు మేలు చేస్తుందని హరీశ్ చెప్పుకొచ్చారు. -
మెదక్ మొనగాడెవరు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ఉంది. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాం«దీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వంటి కాకలుతీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలో దింపగా, వారు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు..విమర్శలు.. ప్రతివిమర్శలతో మెదక్ పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం మీద ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగుతోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, బీఆర్ఎస్ ఐదు పర్యాయాలు (ఉప ఎన్నికతో కలిపి) గెలిచాయి. బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్, టీపీఎస్ ఒక్కోసారి విజయం సాధించాయి.పట్టు నిలుపుకునేందుకు గులాబీ 2004 నుంచి రెండు దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. ఈసారి కూడా ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి.వెంకట్రాంరెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. గెలుపు బాధ్యత మాజీ మంత్రి హరీశ్రావు తన భుజాలపై వేసుకొని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాలను పునరావృతం చేసేందుకు బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పాగా వేసేందుకు బీజేపీ యత్నం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఒకేఒక దుబ్బాక సీటును కోల్పోయి.. ఘెర పరాజయం పాలైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని ప్రయతి్నస్తోంది. ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న చరిష్మాతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతోంది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావును బరిలో దింపింది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈ పార్టీ తరపున పోటీ చేసిన నందీశ్వర్గౌడ్ వంటి నాయకులు ఈ ఎన్నికల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు పార్టీని వీడారు. సత్తా చాటేందుకు హస్తం యత్నం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో సత్తా చాటేందుకు సై అంటోంది. వరుస చేరికలతో ఊపు మీదున్న హస్తం పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి తదితర నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలంమధు ముదిరాజ్ను ఎంపిక చేసింది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేస్తుండగా., కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయతి్నస్తోంది.ప్రభావితం చేసే అంశాలు ► మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాల భూనిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహార పంపిణీ, పునరావాస కల్పన అంశాలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐదు వేల వరకు నిర్వాసిత కుటుంబాలున్నాయి. ► బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభు త్వరంగ సంస్థల్లో సుమారు 20 వేలమంది ఉద్యోగులున్నారు. వారితోపా టు కుటుంబసభ్యుల ఓట్లూ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి. ► యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కారి్మకులు పటాన్చెరు, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు. చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ► మెదక్ ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. -
మోదీతో ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్/ మెదక్ జోన్: ‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నాం. సెమీస్లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ను ఓడించాం. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు అమిత్షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిది. దీన్ని మీరే కాపాడుకోవాలి.ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. 14 ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రేవంత్ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు..’ అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారు.ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పారీ్టగా మారింది. బ్రిటిష్ వాళ్ల మాదిరిగానే మోదీ దేశాన్ని దోచుకొనేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఏళ్ల తరబడి కులగణన జరగడం లేదు. దీంతో బీసీలకు జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుంది..’ అని రేవంత్ అన్నారు. జహీరాబాద్ స్థానం బీజేపీకి తాకట్టు ‘లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కురీ్చలోకి వచ్చామా? బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బిడ్డ కోసం జహీరాబాద్ స్థానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. జహీరాబాద్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించే కుతంత్రంలో మెదక్లో గాలి అనిల్కుమార్కు టికెట్ ఇవ్వాల్సి ఉండగా జహీరాబాద్లో ఇచ్చి గాలికి వదిలేశారు.తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 60 ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్ కుటుంబానికి.. కొడుకు, కూతురు, అల్లుడుతో పాటు ఆయన బంధువులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు దక్కాయి. పదేళ్లుగా గడీల్లో తెలంగాణ తల్లిని బందీ చేశారు. గడీలను బద్ధలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాం..’ అని సీఎం చెప్పారు. వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. అప్పట్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడం జరిగింది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. పేదలకందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఎవరికీ కట్టించిన పాపాన పోలేదు..’ అని రేవంత్ విమర్శించారు. ‘సోనియాగాంధీ అభీష్టం మేరకు ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం..’ అని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది ‘హరీశ్రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది..’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హరీశ్రావు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30 –రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?..’ అని సీఎం ఎద్దేవా చేశారు. హరీశ్.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో..హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. -
నేడు గన్పార్కుకు నేనొస్తున్నా..దమ్ముంటే నువ్వూ రా
మెదక్జోన్/సాక్షి, హైదరాబాద్: రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. ‘మెదక్ నుంచి రేవంత్రెడ్డికి మరోసారి చాలెంజ్ చేస్తున్నా.. శుక్రవారం ఉదయం 10గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా పత్రంతో వస్తున్నా.. దమ్ముంటే నువ్వూ అక్కడికి రా. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. బాండ్ పేపర్ల మీద రాసిన గ్యారంటీలు అమలు చేసే మాట నిజమైతే.. గన్పార్కు వద్దకు రా.. ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతు ల్లో పెడదాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను మేధావులు తీసుకెళ్లి స్పీకర్కు ఇస్తారు. ఒకవేళ అమలుకాకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తా రు.. నువ్వు సిద్ధమా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచినట్లే’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో హరీశ్ ప్రసంగించారు. కాగా, స్పీకర్ ఫార్మాట్లో హరీశ్ రాజీనామా పత్రం సిద్ధం చేసుకున్నా రు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు అమరుల స్తూపం వద్దకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్లనున్నారు. మెడలు వంచుతాం.. ‘అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొడుకులు గాల్లో ఉన్నారు. హామీలు అమలు కావాలన్నా.. వారిని కిందకు దింపి మెడలు వంచాలన్నా రాష్ట్రంలో బీఆర్ఎస్కు కనీసం 12 సీట్లు ఇవ్వాలి’అని హరీశ్రావు అన్నారు. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అసలు పేగులు వేసుకొని తిరిగేది రాక్షసులు కదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. జిల్లాలను తొలగించే కుట్ర చేస్తున్నారు.. పదేళ్లుగా కేసీఆర్ ఏం చేశారని సీఎం అనడం విడ్డూరంగా ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు చేయడంతోనే రేవంత్రెడ్డి మెదక్ వచ్చి కలెక్టరేట్లో వారి అభ్యర్థి నామినేషన్ దాఖలుకు వచ్చారని, లేకుంటే సంగారెడ్డి పోయే వాడన్నారు. జిల్లాలు ఎక్కవయ్యాయని, కొన్నింటిని తొలగించే కుట్ర చేస్తున్నారని, అలాచేస్తే మెదక్ ప్రజలు ఊరుకుంటారా? అని అన్నారు. కనీసం చరిత్ర తెలుసుకోకుండా రేవంత్ మాట్లాడుతున్నాడని, ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యాకే సంగారెడ్డికి బీహెచ్ఈఎల్ లాంటి పరిశ్రమలు వచ్చాయనడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. 1952లోనే సంగారెడ్డికి బీహెచ్ఈఎల్ పరిశ్రమ వచ్చిందని, ఇందిరాగాంధీ 1980లో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్లో వణుకు పుట్టిందన్నారు. -
ఆగస్టు 15 డెడ్లైన్.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్కు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. కాగా, మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. మీరు రండి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాంఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి..ఆగస్ట్ 15 లోపు పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు… pic.twitter.com/jUVKakgdYf— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024Video Credit: Telugu Scribeఇదే సమయంలో సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
Advertisement