-
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు -
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
గుంటూరు, సాక్షి: తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో జరిగిన ఘటనపై యెల్లో మీడియా ఇష్టానుసారం కథనాలు ఇస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు శివకుమార్. గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడానని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు. ‘‘ఐతానగర్లో నేను నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లాం. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాషలాడాడు. వైఎస్సార్సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు. పోలింగ్ బూత్లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్కల సుధాకర్ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ‘‘నువ్వు అసలు కమ్మొడివేనా? అంటూ నన్ను దూషించాడు. ‘‘పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్లో ఉదయం నుండి అతడు హల్చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారు. టీడీపీ జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను దింపారు. వాళ్ల ద్వారా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని శివకుమార్ ఆరోపించారు. -
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ షర్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో ఓబుల్రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది. దీనికి కారణంగా పోలింగ్కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పరోక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫోటోని వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. లోకేష్ కోసమే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సభ్యులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వంశీ వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Superstar Jr NTR (@tarak9999) came out wearing BLUE Shirt to Vote Big Signal to his Fan. #VoteForFan pic.twitter.com/GJgmO5nlg7— Avesh Kumar Singh (@AveshKumarSingh) May 13, 2024 -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. -
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)నెట్ఫ్లిక్స్ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 1699 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17హాట్స్టార్క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17 జీ5బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమాడిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17 బుక్ మై షోగాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16ఆపిల్ ప్లస్ టీవీద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ఎల్లా (హిందీ సినిమా) - మే 17(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కొత్తగా అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ముచ్చటగా మూడోసారి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజనకు కారకుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఈయనపై పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి పీవీ మిథున్రెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన విజయావకాశాలు తదితర అంశాలపై ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.. – రాజంపేట ? : మీరు రాజంపేట స్థానం నుంచి ఎన్నోసారి పోటీ చేస్తున్నారు. మీ బలం ఏమిటి? ● మిధున్రెడ్డి : రాజంపేట నుంచి మూడోసారి పోటీ చేస్తున్నాను. ప్రజలతో పాటు పార్టీ క్యాడర్కు అండగా ఉంటా. పిలిస్తే పలుకుతా..చెబితే చేస్తాను. రెండుసార్లు రాజంపేట లోక్సభ ప్రజలు ఆశీర్వదించారు. మూడోసారి ఆశీర్వదిస్తే లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తాను. ప్రజల అండదండలతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నాను. ? : మీ ప్రత్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డికి, మీకు ఉన్న తేడా ఏమిటి ● నేను లోకల్ లీడర్, కిరణ్కుమార్రెడ్డి గెస్ట్ పొలిటిషియన్. వస్తాడు. పనిచేసుకుంటాడు. హైదరాబాదుకు వెళ్లిపోతాడు. ఇది లోక్సభ పరిధిలోని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ సూట్కేసుతో హైదరాబాదుకు పంపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ? : మీకున్న బలం ఏమిటి? ఏ విధంగా ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావిస్తున్నారు ● నాకున్న బలం ప్రజలు. జగనన్న ఆశయాలతో ముందుకెళుతున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లు సంక్షేమం, అభివృద్ధినే చూస్తారు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే. జగనన్న ఎన్నికల సభలకు జ నం బ్రహ్మరథం పట్టారు. అందుకే కూటమిలో ఓటమి గుబులు పట్టుకుంది. ? : రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా అభివృద్ధి చేశారు. వచ్చే టర్మ్లో ఏం చేయనున్నారు ● రూ.2400 కోట్లతో వాటర్గ్రిడ్స్ పూర్తి చేశాము. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తున్నాము. కడప–రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాను. రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాము. అన్ని నియోజకవర్గాలలో ఆ ప్రాంత పరిస్ధితులను బట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. తప్పకుండా దేవుడు, ప్రజల ఆశీస్సులతో నా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. ? : రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేశారు ● ప్రధానంగా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో నూతన రన్నింగ్రూం మంజూరుకు కృషి చేశాను. బడ్జెట్లో కూడా ప్రకటించారు. రైల్వే పూర్వవైభవం కోసం ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లోక్సభలో కూడా ప్రస్తావించాను. ఎప్పటికప్పుడు నందలూరు రైల్వే అభివృద్ధి కోసం రైల్వేమంత్రి, రైల్వేబోర్డుకు వినతులు ఇస్తూనే ఉన్నాము. ఎన్నడూ లేని విధంగా ముంబై–రేణిగుంట రైలుమార్గంలోని రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న రైల్వే ప్రాంతాల్లో గేట్ల సమస్య లేకుండా ఆర్యూబీ(రోడ్ అండర్ బ్రిడ్జి)ల మంజూరుకు కృషి చేశాము. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజంపేట, పీలేరు రైల్వేస్టేషన్లను అమృత్లో ఎంపికకు కృషి చేశాను. అలాగే కరోనా ముందు ఏ విధంగా హాల్టింగ్ సౌకర్యం ఉండేదో అదే విధంగా ఉండేలా రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాను. ? : జిల్లాకు సంబంధించిన అంశంపై చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేవేనా ● చంద్రబాబు రాజంపేటకు వస్తే ఒక మాట..రాయచోటికి వెళితే మరొక మాట, మదనపల్లెలో ఉంటే ఇంకో మాట ఇలా జనం చెవిలో పువ్వులు పెడతారు. అవి సాధ్యం కావని ప్రజలకు తెలుసు. బాబు మాటలను నమ్మే పరిస్థితిలో రాజంపేట జనం లేరు. ఊసరవెల్లి రాజకీయాలకు రాజంపేట ప్రజలు చెల్లుచీటి పలుకుతారు. మేము వచ్చే టర్మ్లో అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయిస్తాము. 18వ మెడికల్ కాలేజి రాజంపేటలో ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ? : రాజంపేట వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్ధిగా విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ● కచ్చితంగా జగనన్న సంక్షేమం, అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, బీసీల ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అంటే అభిమానం, ఆత్మీయత ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షాన నిలుస్తుందని అన్నమయ్య, చిత్తూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఏ అవసరం ఉన్నా..నేనున్నా అంటూ ముందుకొచ్చే కుటుంబం ఏది అంటే పెద్దిరెడ్డి కుటుంబమే. దైవబలం, ప్రజాబలంతో అఖండ విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. ప్రజలకు ఏ అవసరమున్నా.. నేను ముందుంటా రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం జగన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తా సంక్షేమం, అభివృద్ధినే ప్రజలు చూస్తారు ప్రజలే నా బలం