-
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్డ్రాయల్కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. -
ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ బీమా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు. -
‘400 సీట్లు ఇలాగే దాటుతుంది’.. పాత వీడియో మళ్లీ వైరల్
న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో ఓ మహిళా పోలింగ్ ఏజెంట్ ఇద్దరు మహిళలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించినదే ఈ వీడియో అంటూ వైరల్గా మారింది.ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని సూచించే క్యాప్షన్లతో యూజర్లు వీడియోను షేర్ చేశారు. దీనిపై వార్తా ఏజెన్సీ పీటీఐ ఫాక్ట్ చెక్ చేసింది. ఇందులో ఈ వీడియా 2019 ఎన్నికల నాటిదని తేలింది. ప్రస్తుతం జరుగుతన్న ఎన్నిలకు సంబంధించిన వీడియో అంటూ తప్పుదారి పట్టిస్తూ సోషల్ మీడియాలో రీసెంట్గా షేర్ చేసినట్లు కనుగొంది.ఏప్రిల్ 23న ఓ ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సబంధించినదని పేర్కొన్నారు. "400 సీట్లు ఇలాగే దాటుతుంది" అంటూ దానికి క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేపట్టిన పీటీఐ ఇది 2019 మే 18న పశ్చిమ బెంగాల్లో ఓ పోలింగ్ కేంద్రంలో తీసినదిగా తేల్చింది. -
ఆ బుర్రలో ‘సైతాన్’ తిష్ట ఫ్యాక్ట్ చెక్
రామోజీ మెదడును సైతాన్ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా జరిగినట్లు వక్రీకరిసు్తన్నారు. ‘పాపపు’ రాతలు రాస్తూ ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. దీన్నే నిత్యం పనిగా పెట్టుకుని కల్లిబొల్లి మాటలతో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ‘జీసస్’ కాలంలో ‘అబద్ద ప్రవక్తలు’ ఉండేవారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లు వారికి పదిరెట్లు ఎక్కువగా ‘ఈనాడు’ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా నిజాలను తప్పులుగా రాస్తున్న రామోజీకి ప్రజాకోర్టులో ఆ ‘కరుణామయుడు’ శిక్ష వేయడం మాత్రం ఖాయం.(సాక్షి, అమరావతి) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్ అంత పవిత్రంగా భావించారు. అందుకే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చిత్తశుద్దితో అమలు చేసి చూపించారు. అంతకు ముందు మేనిఫెస్టోను చిత్తు కాగితంలా చూసిన చంద్రబాబు 600పైగా హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని రామోజీకి తెలియదా?. మేనిఫెస్టోను అమలు చేయని చంద్రబాబు దాన్ని టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన మాయల మరాఠీ. ఇప్పుడు జర్నలిజం విలువలకు శిలువేస్తూ రామోజీ నీతులు వల్లిస్తున్నారు.ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సీఎం వైఎస్ జగన్పై రోజు ఏదో ఒకటి పచ్చి అబద్దాలతో అచ్చేస్తూ రామోజీ పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా క్రైస్తవులకు టీడీపీ హయాంలో బాగా చేశారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ.. ‘హామీలకు శిలువ’ అంటూ అడ్డగోలు అబద్దాలతో రామోజీ వార్త అచ్చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆరోపణ: పాస్టర్లను బెంబేలెత్తించారువాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అండగా నిలిచింది. కోవిడ్ కష్టంలోను పాస్లర్లకు నెలకు రూ.5వేలు చొప్పున అందించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున 8,427 మందికి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా రూ.71.10కోట్లు అందించింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిస్టియన్లతోపాటు పాస్టర్లకు కలిపి 29,841 మందికి కోవిడ్ అసిస్టెన్సీ వన్ టైమ్ గ్రాంట్గా రూ. రూ.14.90కోట్లు అందించింది. చంద్రబాబు తన హయాంలో ఏనాడు పాస్టర్లను పట్టించుకోలేదు. అయినా చంద్రబాబు కోసం రామోజీ దాసోహం అయిపోతున్నారు.ఆరోపణ: ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామనివాస్తవం: పవిత్ర జెరుసలేం యాత్రకు గత టీడీపీ ప్రభుత్వం సాయం చేసినట్టు రామోజీ మసి పూస్తున్నారు. ఆయన హయాంలో నిధులు కేటాయించినట్టు చూపించినా సాయం అందించింది నామమాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి క్రైస్తవునికి రూ.60వేలు, రూ.3లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30వేలు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు అందించారు.ఆరోపణ: సాయాన్ని కాదు..జాప్యాన్ని పెంచారు..వాస్తవం: గత ప్రభుత్వం సాయం చేసింది గోరంత అయినా రామోజీకి ఆనందంగా ఉంటుంది. నిరుపేద ఆడ పిల్లల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మింగుడు పడటంలేదు. వాస్తవానికి గత ప్రభుత్వం తోచినప్పుడు సాయం అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాలెండర్( నిర్థిష్ట గడువు) ప్రకటించి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి పెళ్లి సాయాన్ని విడుదల చేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఆపసోపాలు పడేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది.దీంతో ఉన్న చోట నుంచే ధరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వారిని ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.ఆరోపణ: పెళ్లి కానుక హుళక్కే..వాస్తవం: పేదల పెళ్లికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా రాసేశారు. వాస్తవానికి పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ పెట్టిన పథకాన్ని 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల ఆర్థిక సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి పేద బిడ్డలకు భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ఆయా వర్గాలకు గతం కంటే రెట్టింపు చేసి మరీ సీఎం వైఎస్ జగన్ పెళ్లి సాయాన్ని అందిస్తుండటం విశేషం.ఆరోపణ: బీమా అమలులోను కుయుక్తులే..వాస్తవం: బీమా అమలు లేదంటూ రామోజీ కుయుక్తులతో కూడిన ఆరోపణలు చేశారు. వాస్తవానికి వైఎస్సార్ బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలకు అండగా నిలిచారు. కుటంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యానికి గురైనా ఆ కుటుంబం రోజువారీ గడవడం కష్టమని భావించి బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షలు, సహజ మరణమైతే రూ.లక్ష బీమా మొత్తాన్ని చెల్లిస్తోంది.ఆరోపణ: గ్రాంట్ ఇన్ ఎయిడ్నూ ఎగ్గొట్టారువాస్తవం: చర్చిల నిర్మాణం, ప్రహారీల ఏర్పాటుకు గత ప్రభుత్వం గొప్పగా చేసింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రామోజీ బురదచల్లేశారు. వాస్తవానికి కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, అభివృద్ధి, ప్రహారీ, మరుగుదొడ్లు, మౌళిక వసతుల కోసం రూ.5 లక్షల సాయంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 లక్షల నుంచి 5 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు కేటాయించింది.ఐదేళ్లలో 24,304.37కోట్ల లబ్ది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్ మైనార్టీలకు ఐదేళ్లలో నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాయి. క్రిస్టియన్ మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్లు లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు లబ్దిని చేకూర్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56కోట్లు లబ్ది అందించింది. చంద్రబాబు ఓట్ల కోసం మాయ మాటలతో మభ్య పెడితే.. సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని పొందారు. -
‘క్రమం’ తప్పి బాబు ‘కక్ష’
సాక్షి, అమరావతి: అబద్దాలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే అలవాటు తప్ప ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డికి అవి వర్తించవు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ చేయకుండా మోసం చేసింది మీ చంద్రబాబే. గత చరిత్రను వదిలేసి ఇప్పుడు కళ్లు మూసుకుని రాసే రాతలు చెల్లవు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరించకుండా పరీశీలన చేయడానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డు వస్తోందని, దానికి సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబే. ఇవేమీ రామోజీకి అప్పట్లో కనిపించలేదు.ఇప్పుడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ అమలు చేస్తుంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ ముందు వరకూ జీవోలు ఇవ్వలేదంటూ మరో పచ్చి అవాస్తవాన్నీ ఈనాడు అచ్చువేసింది. అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 13నే ఆర్దికశాఖ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఈనాడు మాత్రం ఎన్నికల షెడ్యూల్కు రెండు రోజులు ముందే ఉత్తర్వులు ఇచ్చినట్లు ఈనాడు మరో అబద్దాన్ని అచ్చు వేసింది.మేనిఫెస్టోనే వక్రీకరిస్తున్న రామోజీవైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని పేర్కొంది తప్ప అందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పలేదు. ఎన్నికల మేనిఫేస్టోను కూడా వక్రీకరించి మరీ రామోజీ అవాస్తవాలను ప్రచురించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎటువంటి కసరత్తు చేయలేదు. వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్దీకరించే విధంగా నిబంధనలను రూపకల్పన చేశారు.ప్రభుత్వ రంగ సంస్ధలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా ఎన్నికల మేనిఫేస్టోలోగానీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్ చెప్పలేదు. వివిధ కేంద్ర పథకాల కింద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, ఆ పథకాల కొనసాగినంత కాలమే కొనసాగుతారు. ఈ విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ మరో వక్రభాష్యం చెప్పారు.1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసేయించారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను పప్పూ, బెల్లాల మాదిరిగా తన వాళ్లకు అమ్మేసుకున్నారు.ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. దాని గురించి అప్పట్లో ఒక్క వార్త రాయని ఈనాడు ఇప్పుడు మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది.నిబంధనల ప్రకారమే క్రమబద్దీకరణచంద్రబాబు హయాంలో ఐదేళ్లు పాటు సాగదీసి గత ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పారు. వైఎస్.జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం అర్హులైనవారిని రెగ్యులరైజేషన్ చేసేందుకు ఆర్థికశాఖ చర్యలను చేపట్టింది. రెగ్యులరైజేషన్కు సంబంధించి మార్గదర్శకాలను ఆర్థిక శాఖ 13-12-2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. దీనికి రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా ఆర్దిక శాఖ స్పష్టం చేసింది.సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3,000 మందికిపైగా క్రమబద్దీకరించారు. మిగతా ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు మూడు నెలల్లో ఆ ప్రకియ పూర్తి అవుతుంది. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటిస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులు సర్వీసును క్రమబద్దీకరిస్తారు.ప్రభుత్వం అంటే రామోజీ సొంత జాగీరు కాదు రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు తెచ్చింది కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని టీడీపీ హయాంలో చంద్రబాబు అడ్డు పుల్ల వేశారు.ఎన్నికల హామీ నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్పై ఆర్దిక మంత్రి, మానవ వనరుల మంత్రి, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09-09-2014న జీవో 3080 ద్వారా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు న్యాయంఇప్పుడు సీఎం వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయ పరమైన చిక్కులు అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని వైస్సార్సీపీ మేనిఫేస్టోలో పేర్కొంది. దీని ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది.మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కమిటీ, వర్కింగ్ కమిటీ పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించింది. ఇందుకోసం రెగ్యులరైజేషన్పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. బ్యాక్ డోర్ కాకూడదని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపెట్టి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేస్తే జగన్ సర్కారు సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
Advertisement