ఆర్వోపై నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు | Sakshi
Sakshi News home page

ఆర్వోపై నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు

Published Tue, May 14 2024 3:10 PM

-

నర్సీపట్నం: అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి హెచ్‌.వి.జయరాం ఏమి పీకుతున్నారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. మున్సిపాలిటీ గచ్చపు వీధి బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అయ్యన్నపాత్రుడు రిటర్నింగ్‌ అధికారిపై నోరు పారేసుకున్నారు. ఓటేసేందుకు వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆర్డీవో ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు ఆదేశించినా కింది స్థాయిలో నర్సీపట్నం ఆర్డీవో పర్యవేక్షణ అసలు బాగోలేదన్నారు. జిల్లా కలెక్టర్‌కు ఉదయం నుంచి ఫోన్‌ చేస్తుంటే రివ్యూ మీటింగ్‌లో ఉన్నారని సీసీ చెబుతున్నారు తప్ప కలెక్టర్‌ స్పందించలేదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement