కూలీలందరికీ పని కల్పించండి | Sakshi
Sakshi News home page

కూలీలందరికీ పని కల్పించండి

Published Wed, Apr 17 2024 8:15 AM

-

కొందుర్గు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్‌డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని పర్వతాపూర్‌, గంగన్నగూడ గ్రామాల్లో మంగళవా రం ఆమె పర్యటించి ఉపాధి పనులతోపాటు నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీల తో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు వెళ్లాలని సూచించారు. గతంలో రోజుకు రూ.272 చెల్లించేవారని, ప్రస్తుతం ప్రభుత్వం రూ.300కు కూలీ పెంచిందన్నారు. కొల తల ప్రకారం పనులు చేయాలని సూచించారు. న ర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని, మొ క్కలను సకాలంలో మల్చింగ్‌ చేయాలని సూచించారు. అనంతరం కొందుర్గు మండలపరిషత్‌ కా ర్యాలయంలో గ్రామ ప్రత్యేకారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ కూలీలు సేద తీరడానికి పని ప్రదేశంలో టెంట్‌ ఏర్పాటు చేయాలన్నా రు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్టు అందుబాటులో ఉంచాలన్నారు. మస్టర్‌లో పేర్లు నమోదుచేసి న కూలీలే పనులు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement