ఖరీఫ్కు సన్నాహాలు
సాక్షి, రాజమహేంద్రవరం: కొద్ది నెలలుగా దాదాపు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలతో నిప్పుల గుండంలా మారిన వాతావరణం వారం రోజులుగా కాస్త చల్లబడింది. వరుణుడి కరుణతో జిల్లావ్యాప్తంగా అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రబీ వరి కోతలు సింహభాగం పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు సైతం జోరుగా జరుగుతున్నాయి. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. కాడి పట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పొలాలను సిద్ధం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెల 15వ తేదీలోగా వరి నారుమళ్లు వేయాలని, జూలై 15వ తేదీలోగా నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. సాగుకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా సబ్సిడీపై అందిస్తున్నారు.
83,068 హెక్టార్లలో సాగు
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 77,817 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
ఖరీఫ్ సాగులో భూసారాన్ని పెంపొందించడంలో పచ్చిరొట్ట విత్తనాలు కీలక భూమిక పోషిస్తాయి. పశువుల ఎరువులకు ప్రత్యామ్నాయంగా వినియోగించే ఈ విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. 434 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల జనుము, 30 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను ముందస్తుగానే అందుబాటులో ఉంచింది. జీలుగ, జనుము విత్తనాల కిలో ధర రూ.88 కాగా రూ.44కు, పిల్లిపెసర కిలో రేటు రూ.134 ఉండగా రాయితీపై కేవలం రూ.67కే అందజేస్తున్నారు.
58,356 మెట్రిక్ టన్నుల ఎరువుల ఆవశ్యకత
ఖరీఫ్లో ఆశించిన మేర దిగుబడులు రావాలంటే నాణ్యమైన ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీల బారిన పడి రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 58,356 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 23,096 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. రైతులు తమకు అవసరమైన ఎరువులను ఆర్బీకేలు, సొసైటీలు, డీలర్ల వద్ద పొందవచ్చు. సాధ్యమైనంత వరకూ సేంద్రియ ఎరువులనే వినియోగించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
వరి విత్తనాలూ సిద్ధం
ఖరీఫ్లో రైతులు అత్యధికంగా వరి సాగు చేపడతారు. వారికి అవసరమైన వివిధ రకాల విత్తనాలను వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉంచారు. వరి విత్తనాలు 38,908 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీనిలో ఇందులో 400 క్వింటాళ్లు ఏపీ సీడ్స్ ద్వారా, 10 వేల క్వింటాళ్లు ప్రైవేటు సంస్థల ద్వారా, మిగిలిన వాటిని రైతు నుంచి రైతుకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో రైతులు ఎంటీయూ–7029, పీఎల్ఏ–1100, బీపీటీ–5204, ఎంటీయూ–1318 వంటి వరి రకాలు అత్యధికంగా సాగు చేస్తారు. ఎకరానికి నాలుగైదు సెంట్ల విస్తీర్ణంలో మాత్రమే నారుమడులు వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 25 కేజీల విత్తనాలు సరిపోతాయి. విత్తన శుద్ధి చేసిన వాటిని మాత్రమే సాగుకు ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రబీ వరి కోతలు 95 శాతం పూర్తి
జిల్లా వ్యాప్తంగా రబీ వరికోతలు ఇప్పటికే 95 శాతం పైగా పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో వంద శాతం పూర్తవుతాయి. కోతలు పూర్తయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి.. ఇప్పటికే సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో రైతులకు ఎటువంటి నష్టమూ జరగలేదు. రబీలో జిల్లావ్యాప్తంగా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఇందులో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ప్రైవేటుగా మంచి ధర పలకడం, పొలాల నుంచే వ్యాపారులు ధాన్యం తీసుకుని వెళ్లడంతో పలువురు రైతులు వ్యాపారులకు అమ్ముకోవడానికే మొగ్గు చూపారు. జిల్లాలో వరి సాగు, కోతలు (హెక్టార్లలో) ఇలా.. మండలం వరి సాగు వరి కోతలు రాజమహేంద్రవరం రూరల్ 1,251 1,251
కడియం 2,006 2,004
రాజానగరం 3,328 3,328
అనపర్తి 3,670 3,670
బిక్కవోలు 5,597 5,597
కోరుకొండ 1,757 1,757
గోకవరం 1,537 1,537
సీతానగరం 3,280 3,265
రంగంపేట 795 795
చాగల్లు 3,317 3,317
దేవరపల్లి 2,838 2,838
గోపాలపురం 1,707 1,687
కొవ్వూరు 4,150 4,150
నిడదవోలు 6,820 6,820
పెరవలి 3,141 3,141
తాళ్లపూడి 3,375 3,347
ఉండ్రాజవరం 4,653 4,653
నల్లజర్ల 2,093 2,080 ఖరీఫ్కు సిద్ధంగా ఉన్నాం
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నాం. రైతులకు అవసరమైన పచ్చిరొట్ట, వరి విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో వచ్చే అవకాశం ఉంది. పంట సాగు సైతం లాభదాయకంగా మారనుంది. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. సాగుపై రైతులకు ఇప్పటికే అవగాహనకల్పిస్తున్నాం.
– ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఫ వరుణుడి పలకరింపు
ఫ రుతుపవనాలు సకాలంలో
రానున్నట్లు సంకేతాలు
ఫ సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఫ అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
ఫ ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై
అందజేసేందుకు ఏర్పాట్లు
ఫ జిల్లాలో ఖరీఫ్ సాధారణ
సాగు 83,068 హెక్టార్లు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు ఫ ఖరీఫ్ సాగుకు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
ఫ వ్యవసాయ శాఖ అధీకృత లైసెన్స్ పొందిన కంపెనీ డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
ఫ కొనుగోలు సమయంలో డీలరు నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఫ విత్తన సంచి, ట్యాగ్ను పంట కాలం చివరి వరకూ భద్రంగా ఉంచుకోవాలి.
ఫ పంట సాగు చేసే ముందే మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి.
ఫ ఏదైనా సమస్య వస్తే మండల వ్యవసాయ అధికారికి దృష్టికి తీసుకుని వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది.
ఫ మొక్కజొన్న, మిరప విత్తనాల కొనుగోలులో కూడా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.