ఆర్మీ హవల్దార్‌ ఆత్యహత్య | Sakshi
Sakshi News home page

ఆర్మీ హవల్దార్‌ ఆత్యహత్య

Published Tue, Dec 12 2023 6:16 AM

-

కంటోన్మెంట్‌: ఆర్మీ హవల్దార్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేంద్ర బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా, పెల్లిపట్టికి చెందిన సుభాష్‌ (28) తాడ్‌బంద్‌లోని 68 మీడియమ్‌ రెజిమెంట్‌లో గార్డ్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీ ముగించుకుని విశ్రాంతి తీసుకునేందుకు రెజిమెంట్‌లోకి వెళ్లాడు. 11.30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన అతను ఎంతకూ తిరిగి రాకపోవడంతో మరో కమాండర్‌ విశ్వనాథ్‌ వెళ్లి తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో వెంటిలేటర్‌ నుంచి చూడగా సుభాష్‌ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తోటి గార్డ్‌ మనోజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement