-
బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందే!
గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు ఎలా సాధ్యం? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఓబీసీల కుల గణాంకాల అవసరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఏ రంగాల్లో, ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నారు? వారి ప్రధానమైన సమస్యలేమిటి? గత కాలంలో వారి జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? ప్రభుత్వం ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానం గణాంకాల ద్వారా వెతకడానికి సాధ్యమవుతుంది. 50 శాతం పైగా ఉన్న జనాభా విషయంలో మొదటి నుండి ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కావాలని నిర్లక్ష్యం చేయడం దారుణం. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1872 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టిన కుల గణాంకాలలో కుల అంశం కూడా చేర్చారు. అది 1931 వరకు కొనసాగింది. 1941లో గణాంకాలు సేకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంవల్ల ఆ ప్రక్రియలను మధ్యలోనే నిలిపివేశారు. 1951 నుంచి భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గణాంకాలు తప్ప ఓబీసీలు కుల గణాంకాలు చేపట్టడం కావాలనే మానివేసింది. మొదటి ఓబీసీ కమిషన్ 1953 (కాకా కలేల్కర్), రెండవ కమిషన్ (మండల్) 1979, తప్పనిసరిగా కుల గణాంకాలు చేపట్టాలని సిఫారసు చేశాయి. మండల్ కమిషన్ ఓబీసీల రిజర్వేషన్లను నిర్ధారించటానికి 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన అన్ని బీసీ కమిషన్లు కులగణాంకాలు చేపట్టాలని పదేపదే చెబుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఎలా ఇయ్యాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం అహేతుకమని చేప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరం పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు ఈ విషయంలో పట్టుపట్టగా యూపీఏ ప్రభుత్వం మొదటగా అంగీ కరించి, ఆ తర్వాత మాటమార్చి 2011లో సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) చేపట్టటానికి ప్రభుత్వశాఖల ద్వారా దేశవ్యాప్త గణాంకాలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయటపెట్టలేదు. ఆ తర్వాత 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గణాంకాల వివరాలను బయట పెడతామని వాగ్దానం చేసి, జరిగిన తప్పులు సవరించలేని స్థాయిలో ఉన్నాయని, వాటిని అక్కడితో ఆపేసింది. కేవలం 20 శాతం కూడా లేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, ఇంకా అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు, 50 శాతం పైగా ఉన్న వేలాది కులాలు కింది స్థాయిలో కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైనట్లు బయటపడింది. అందువల్ల ఆ సమాచారాన్ని తొక్కిపెట్టించి ఉంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021 సెన్సెస్లో కుల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణాంకాల అవసరం గురించి దాదాపు అన్ని పార్టీలవారు ప్రస్తావించి, సమాచారం లేకుండా కొత్త కులాలను చేర్చడానికి, అభివృద్ధి చెందిన కులాలను జాబితాల నుండి తొలగించటానికి ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. సమాచారం లేకుండానే కులాలను వర్గీకరిస్తే భవిష్యత్తు పరిణామాలు అసంబద్ధంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 2021 సెన్సెస్లో భాగంగా కుల గణాంకాలను చేపట్టాల్సిందే. వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి సుదమల్ల వెంకటస్వామి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొబైల్ : 93470 15154 -
హ్యాట్రిక్ల సిద్దిపేట
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి.. 1971, 1977లోనూ గెలిచి వరుసగా మూడుమార్లు గెలిచారు. ఆయన తరువాత నంది ఎల్లయ్య 1989, 1991, 1996 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్సభ స్థానం రద్దయి.. మెదక్ లోక్సభ స్థానంలో అంతర్భాగమైంది. ఇక, సిద్దిపేట అసెంబ్లీ స్థానంలోనూ హ్యాట్రిక్ల మోత మోగుతోంది. అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983 శాసనసభ ఎన్నికల్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన తరువాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత టి.హరీశ్రావు కూడా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. -
అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్ చేయరూ..
హైదరాబాద్ : ఫోన్ రీచార్జీల కోసం ఓవ్యక్తి సరికొత్త వక్రమార్గం కనుగొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వనస్థలిపురానికి చెందిన వెంకటస్వామి తనఫోనులో బాలెన్స్ అయిపోయినప్పుడుల్లా ఏదో ఒక నెంబరుకు ఫోన్ చేసేవాడు. విహార యాత్రకు వచ్చిన తన కుటుంబం కన్యాకుమారి అటవీ ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేవాడు. ఆపదలో ఉన్నామని రీచార్జీ చేయమని కోరేవాడు. అతగాడి మాయమాటలు నమ్మి చాలామంది రీచార్జులు చేశారు. ఇలా ఆరునెలల్లో 527 మందిని మోసం చేశాడు. దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వనస్థలిపురంలో ఎస్ఓటీ పోలీసులు వెంకట స్వామిని అరెస్ట్ చేశారు. గతంలోను ఇలాంటి కేసులో ఇతగాడు జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నాచర్ల వేటలో దిట్ట
టాస్క్ఫోర్స్ హెచ్సీ వెంకటస్వామి నేపథ్యమిది సర్వోన్నత పోలీసు పతకం పొందిన ఇద్దరిలో ఒకడు ‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే సిటీబ్యూరో: స్నాచర్ పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్లో హెడ్-కానిస్టేబుల్గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు. -
పాపపై పైశాచికం
♦ కామాంధుడి చేతిలో బలైన బాలిక ♦ అత్యాచారం.. ఆపై గొంతునులిమి హత్య ♦ మృతదేహాన్ని కోళ్ల గంప కింద దాచి పరారీ కాటారం: కరీంనగర్ జిల్లాలో మరోచోట కామాంధులు బరితెగించారు. వీణవంక మండ లం చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం... ఓదెల మండలం మడకలో ఆర్మీ జవాన్ యువతిపై అత్యాచారం చేసిన ఘటన లు మరువకముందే కాటారం మండలంలో మరో ఘోరం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసిబాలికపై అఘాయిత్యం చేసి.. ఆపై గొంతు నులిమి చంపేసిందో మానవమృగం. కాటారం మండలం దామెరకుంటకు చెందిన తొగరి త్రివేణి-రాయస్వామి దంపతులకు కూతుళ్లు సింధుశ్రీ, వినయశ్రీ(4), కుమారుడు మారుతి ఉన్నారు. శనివారం సాయంత్రం వినయశ్రీ రోజులాగా ఇంటి వద్ద ఆడుకుం టోంది. ఇంటివెనుకాలే నివాసముంటున్న జక్కు వెంకటస్వామి(35) చిన్నారిని చాక్లెట్ కొనిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. పాపపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి చంపేశాడు. ఇంట్లోని కోళ్లగంప కింద మృతదేహాన్ని దాచేసి ఇంటికి తాళం వేసి పారి పోయాడు. వినయశ్రీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. ఆదివా రం ఉదయం అనుమానంతో వెంకటస్వామి ఇంటితాళం పగలగొట్టి చూడగా విషయం వెలుగు చూసింది. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు, వారి బంధువులు నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. దహనం చేయడానికి పూనుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆది నుంచి అదే నేరచరిత్రే.. నిందితుడు జక్కు వెంకటస్వామిది ఆది నుంచి నేరచరిత్రే. కొన్నేళ్ల క్రితం పీపుల్స్వార్ మిలిటెం ట్గా పనిచేసి కేసులపాలైనట్లు సమాచారం. గ్రామంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. అరుునా అతడిలో మార్పు లేదు. ఓ చోరీ కేసులో నింది తుడని తెలుస్తోంది. ఇతడి తీరుతో మొదటి భార్య విడాకులిచ్చి వెళ్లింది. మరో మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం కొనసాగించాడని తెలిసింది. అతడి తీరుతో విసుగుచెందిన ఆమెకూడా వెళ్లిపోరుుంది. దీంతో అప్పటినుంచి సైకోగా ప్రవర్తిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటస్వామి తాగొచ్చి నిత్యం చిత్రిహ ంసలు పెడుతుండడంతో తండ్రి మరో కొడుకు వద్దకు వెళ్లిపోయూడు. అతడి వ్యవహారశైలితో కుటుంబసభ్యులు కూడా దూరమయ్యూరు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement