-
గ్లో 'బుల్' ర్యాలీ...!
సెన్సెక్స్ 565 పాయింట్లు అప్.. 26,786 వద్ద క్లోజ్ అంచనాల కంటే తక్కువగా అమెరికా ఉద్యోగ గణాంకాలు దీంతో ఫెడ్ రేట్ల కోత ఈ ఏడాది ఉండకపోవచ్చని అంచనాలు ఈ అంచనాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల జోరు 168 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ... 8,119 పాయింట్లకు జూమ్ స్టాక్ సూచీల ఒక్క రోజు అధిక లాభాలు... ఈ ఏడాదిలో ఇది రెండోసారి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా స్టాక్ మార్కెట్కు ఈ వారం శుభారంభాన్నిచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవన్న అంచనాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడడంతో మన స్టాక్ మార్కెట్ కూడా సోమవారం లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 565 పాయింట్లు(2.15 శాతం) లాభపడి 26,786 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 168 పాయింట్లు (2.12 శాతం) లాభపడి 8,119 పాయింట్ల వద్ద ముగి శాయి. ఈ ఏడాది జనవరి 15 తర్వాత దాదాపు తొమ్మిది నెలల్లో ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీలు ఇన్ని ఎక్కువ పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. జనవరి 15న సెన్సెక్స్ 729 పాయింట్లు లాభపడింది. కాగా సెన్సెక్స్కు ఇది నెలన్నర గరిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నాలుగు రోజుల్లో 1,100 పాయింట్లు అప్... స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడం ఇది వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన గత మంగళవారం నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,169 పాయింట్లు లాభపడింది. సోమవారం సెన్సెక్స్ ఒక దశలో 26,822 పాయింట్ల గరిష్ట స్థాయిని(గురువారం నాటి ముగింపుతో పోల్చితే 601 పాయింట్లు లాభం) తాకింది. త్వరలోనే సెన్సెక్స్ 27 వేల పాయింట్లను దాటేస్తుందని విశ్లేషకులంటున్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు బావుంటే 28 వేల పాయింట్ల మైలురాయిని కూడా అధిగమిస్తుందని వారంటున్నారు. టాప్లో టాటా మోటార్స్ అమెరికాలో టాటా మోటార్స్కు చెందిన జేఎల్ఆర్ అమ్మకాలు 61 శాతం పెరిగాయి. భారత్లో కంపెనీ వాణిజ్య, మధ్య, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు గత నెలలో 52 శాతం పెరిగాయి. వీటికి తోడు పీజియో కంపెనీ టాటా మోటార్స్తో కలిసి కార్లు తయారు చేయాలని యోచిస్తుందన్న వార్తలు, భారత వాహన రంగంలో టాప్ పిక్ టాటా మోటార్సేనని మాక్వెరీ మార్కీ పేర్కొనడం వంటి వార్తలతో టాటా మోటార్స్ 6.1% లాభపడి రూ. 315 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. మారుతీ సుజుకీ 3.5%, లుపిన్ 1.1%, డాక్టర్ రెడ్డీస్ 1.1%, హిందూస్తాన్ యూనిలీవర్ 0.5% చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్ 5.8 శాతం, ఐసీఐసీ బ్యాంక్ 4.9%, హిందాల్కో 4.7%, హెచ్డీఎఫ్సీ 4.7%, లార్సెన్ అండ్ టుబ్రో 4.1 శాతం, హీరో మోటోకార్ప్ 4%, ఓఎన్జీసీ 3.4%, యాక్సిస్ బ్యాంక్ 3.3%, బజాజ్ ఆటో 3% చొప్పున పెరిగాయి. 2,001 షేర్లు లాభాల్లో, 787 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,036 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.18,698 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,79,876 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.650 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.366 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు. అసియా మార్కెట్లు 1.6 శాతం వరకూ లాభపడ్డాయి. జాతీయ దినోత్సవం సందర్భంగా చైనా స్టాక్ మార్కెట్కు బుధవారం వరకూ సెలవు. యూరప్ మార్కెట్లు 2.12 శాతం నుంచి 3.35 శాతం లాభాల రేంజ్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లో డోజోన్స్ 1.4%, నాస్డాక్ 1% లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.1.8 లక్షల కోట్లు ప్లస్ సెన్సెక్స్ జోరుగా పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.84 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,84,665 కోట్లు పెరిగి రూ.98,39,357 కోట్లకు చేరింది. లాభాల పరుగు ఎందుకంటే... ఉద్యోగాలు తగ్గాయ్... మార్కెట్లు పెరిగాయ్: గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో వచ్చే ఏడాదిలో గానీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవన్న అంచనాలతో అమెరికా, ఆసియా, యూరప్ మార్కెట్లు జోరుగా పెరిగాయి. బేస్ రేట్ తగ్గింపు: గత వారంలో ఆశ్చర్యకరంగా ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పలు బ్యాంకులు బేస్రేట్ను తగ్గించసాగాయి. దీంతో రుణాలు చౌకగా లభిస్తాయనే అంచనాలతో రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు పుంజుకుంటున్నాయి. రూపాయి బలపడడం: డాలర్తో రూపాయి మారకం విలువ 21 పైసలు పెరిగి 65.29కి చేరడం దేశీ స్టాక్మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది. వృద్ధి ఓకే: 7.5 శాతం వృద్ధి సాధించడం కష్టమేమీ కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేయడం కలసివచ్చింది. మరిన్ని రేట్ల కోతలు ఉండే అవకాశాలున్నాయని, ప్రభుత్వ మూలధన వ్యయాలు పెరుగుతాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడానికి ప్రభుత్వ వ్యయంలో కోత విధించే అవకాశాల్లేవని...ఇవన్నీ వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. చైనా చర్యలు: వృద్ధి జోరు పెంచడానికి చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ లాభాలకు దోహదపడ్డాయి. క్యూ2 ఫలితాలపై ఆశలు: అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గడం కంపెనీలకు ప్రయోజనకరమని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. వచ్చే వారం నుంచి క్యూ2 ఫలితాలు వెలువడనున్నాయి. -
8 నెలల కనిష్టానికి సెన్సెక్స్
♦ అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు ♦ ఈ ఏడాది కనిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీలు ♦ 245 పాయింట్ల నష్టంతో 26,523కు సెన్సెక్స్ ♦ 71 పాయింట్ల నష్టంతో 8,044కు నిఫ్టీ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది సెప్టెంబర్ కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచుతుందనే ఆందోళనతో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. దీనికి కరువు భయాలు కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు క్షీణించి 26,523 పాయింట్లకు పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి. గత మంగళవారం నుంచి సెన్సెక్స్ మొత్తం 1,326 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 8,044 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టీ కీలకమైన 8,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ రెండూ సూచీలకు ఇది ఈ ఏడాది కనిష్ట స్థాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ సెన్సెక్స్ నష్టాలపాలయ్యింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల, ఎఫ్ఎంసీజీ, వాహన, ఫార్మా షేర్లు పతనమయ్యాయి. డాలర్తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రభావం చూపింది. సన్ టీవీ 22 శాతం డౌన్.. డీలిస్టింగ్ వార్తలతో ఈరోస్ ఇంటర్నేషనల్ 12 శాతం ఎగసింది. మేలో చైనా ఎగుమతులు క్షీణించడంతో మెటల్, మైనింగ్ షేర్లు పడిపోయాయి. సన్ టీవీ నెట్వర్క్కు చెందిన 33 చానెళ్లకు సెక్యూరిటీ క్లియరెన్స్లు ఇవ్వడానికి హోమ్ మంత్రిత్వ శాఖ నిరాకరించిందన్న వార్తలతో ఈ కంపెనీ షేర్ 22 శాతం క్షీణించి రూ.279 కు చేరింది. మ్యాగీ ప్రభావం నెస్లే ఇతర బ్రాండ్లపై పడుతుందనే అంచనాలతో నెస్లే ఇండియా షేర్ 7.6 శాతం వరకూ నష్టపోయింది. టర్నోవర్ బీఎస్ఈలో రూ.1,873 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.12,894 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,63,736 కోట్లుగా నమోదైంది. ఏడేళ్ల గరిష్టానికి షాంగై: అంతర్జాతీయ రుణదాతలతో బెయిలవుట్ డీల్ కుదుర్చుకోవడంలో గ్రీస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా షాంఘై ఇండెక్స్ 2 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది మూడు ఐపీఓలకు సెబీ ఓకే న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, గత వారంలో మూడు ఐపీఓలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సెబీ 17 ఐపీఓలకు అనుమతిచ్చినట్లయింది. తాజాగా ఐపీఓకు ఆమోదం పొందిన కంపెనీలు- హిందీ దినపత్రిక అమర్ ఉజాలాను ప్రచురించే అమర్ ఉజాలా పబ్లికేషన్స్, మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్కాన్, కల్పతరు పవర్ ట్రాన్సిమిషన్స్ అనుబంధ కంపెనీ శ్రీ శుభం లాజిస్టిక్స్. దిలిప్ బిల్డ్కాన్ కంపెనీ రూ.650 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఆఫర్ ఫర్ సేల్ కింద 1.49 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. శ్రీ శుభం లాజిస్టిక్స్ రూ.210 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 70 లక్షల షేర్లను జారీ చేయనున్నది. ఇక అమర్ ఉజాలా రూ.50 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, 26.9 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేయనున్నది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement