-
‘కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి’
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. మోదీ చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా.. సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు. ప్రధాని మోదీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. గత పాలనలో అవినీతి, లంచగొండితనం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ప్రధాని చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. మోదీ పని తీరుపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మోదీ పాలనలో దేశం త్వరితగతిన ఎదుగుతుంది. మొదటి క్యాబినెట్లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం’ కేంద్ర మంత్రి జేపి నడ్డా తెలిపారు. -
కేంద్ర ఉద్యోగులకు 2% డీఏ పెంపు
జనవరి 1, 2017 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరువు భత్యాన్ని (డీఏ) పెంచే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1, 2017 నుంచి అమల్లోకి రానున్న డీఏ పెంపుతో మొత్తం డీఏ 4 శాతానికి చేరింది. ‘ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మూల వేతనం/పింఛనుపై 2% డీఏ పెంచుతున్నాం. దీనిద్వారా 48.85 లక్షల మంది ఉద్యోగులకు, 55.51 లక్షల మంది పింఛనుదారులకు లాభం చేకూరనుంది’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపు ద్వారా ఖజానాపై రూ.5,857.28 కోట్ల భారం (2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,833 .50 కోట్లు) పడుతుందని ప్రకటనలో పేర్కొంది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న జాతీయ వైద్య విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యసేవలందించటం ఈ విధానం ఉద్దేశం. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గురువారం పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం. ► దేశంలోని 15 ట్రిపుల్ ఐటీలకు (పీపీపీ కింద ఏర్పాటుచేసిన) డిగ్రీలు ప్రదానం చేసే అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్ నిర్ణయం. ఐఐటీ–పీపీపీ బిల్లులు–2017కు కేబినెట్ ఆమోదం. ఈ 15 సంస్థలను జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు. ఇందులో ఏపీ నుంచి చిత్తూరు, కర్నూలు ఐఐఐటీలున్నాయి. ► ఉత్తరప్రదేశ్లో రూ.2,147.33 కోట్లతో హందియా–వారణాసి మధ్య 73 కి.మీ. హైవే విస్తరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం. ఎన్హెచ్డీపీ–5వ దశలో భాగంగా ఈ ప్రాజెక్టుకు ఆమోదం. దీనిద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకూ అవకాశం ఉంటుంది. ► కోల్–బెడ్ మిథేన్ (సీబీఎం) ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన దానికి ధరను నిర్ణయించి మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ వంటి సంస్థలు ధరలపై పారదర్శకంగా బిడ్డింగ్ వేసుకునే అవకాశం. -
జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు వినోద్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డిలు ఆయనను కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఎయిమ్స్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఆ మూడు రాష్ర్టాల్లోని వెనకబడిన జిల్లాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి హామి ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు. -
అమ్మ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు. ‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా చెప్పారు. -
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement