-
రవాణాశాఖలో ప్రకంపనలు!
సాక్షి, నెల్లూరు : చిరుద్యోగంలో వుండి కోట్లకు కోట్లు వెనుకేసుకున్న రవాణాశాఖ అటెండర్ నరసింహారెడ్డి అక్రమాస్తుల కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రవాణాశాఖలోని కొంతమంది ఉన్నతాధికారులకు అతను ఓ బినామీ తేలుతుండటంతో ఆ శాఖలో ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఏసీబీ దాడుల్లో నరసింహారెడ్డి పట్టుబడటంతో తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని.. కొందరు అవినీతి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. డీటీసీ, ఆర్టీవోగా పనిచేసిన ఇద్దరు అధికారులకు నరసింహారెడ్డి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ భావిస్తోంది. నెల్లూరు డీటీసీగా పనిచేసిన మోహన్రావు ఇంటిపై గతంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. మోహన్రావు పేరిట రూ. వెయ్యికోట్లకుపైగా ఆస్తులు గురించింది. మోహన్రావు వెనుక ఐఏఎస్ అధికారి ఉన్నట్టు ఏసీబీ విచారణలో వెలుగుచూసింది. మరో ఇద్దరు ఆర్టీవోల ఆస్తులపైన ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అటెండర్ అక్రమాస్తుల చిట్టా.. ఒకటి కాదు.. రెండు కాదు..రూపాయలు 100 కోట్లు.. ఈ ఆస్తులు ఏ బిజినెస్ టైకూనువో కాదు.. ఓ సాదాసీదా చిరు ఉద్యోగివి. రవాణా శాఖలో అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తివని అంటే ఎవరైనా షాక్ తింటారు. అతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. కిలోల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. కోట్లకు పడగలెత్తిన అటెండర్ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉంది. నెల్లూరు ఆర్టీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న నరసింహారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎంవీ అగ్రహారంలోని ఆయన ఇంటితో పాటు కాపువీధిలోని అతడి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్లోని మరో సోదరుడు నిరంజన్రెడ్డి, రాంజీనగర్లో నివాసం ఉండే వియ్యంకుడు రేబాల మురళీమెహన్రెడ్డి, ఆత్మకూరులో నివాసముండే బావమరిది వరప్రసాద్రెడ్డి, బీవీనగర్లో ఉండే ఆర్టీఏ ఏజెంట్ బీ ప్రసాద్ ఇళ్లతోపాటు రవాణా కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. నరసింహారెడ్డి అక్రమాస్తులివే.. నరసింహారెడ్డి పేరు మీద గుండ్లపాళెంలో 3.95 ఎకరాల భూమి కొండాయపాళెంలో 200చదరపు గజాల ఇంటి స్ధలం నరసింహారెడ్డి భార్య హరిప్రియ పేరుపై గుండ్లపాళెంలో 6.5ఎకరాల భూమి సంగం మండలం పెరమనలో 35.30ఎకరాల వ్యవసాయ భూమి నెల్లూరులోని ఎంవీ అగ్రహారంలో 346 చదరపు గజాల ఇంటి స్థలం శ్రీహరినగర్లోని సుబ్బారెడ్డినగర్ లేఅవుట్లో 240చదరపు గజాలు కొండాయపాళెంలో 266 చదరపు గజాల ఇంటి స్ధలాలు గుండ్లపాళెంలోని వివేకానంద లేఅవుట్లో 10 ఇళ్ల స్థలాలు ఎంవీ అగ్రహారంలో జీ ప్లస్ 2 ఇల్లు అత్త నారాయణమ్మ పేరుమీద పెరమనలో 4.6 ఎకరాల వ్యవసాయ భూమి ఇవి కాకుండా ఇంట్లో 7లక్షల 70వేల రూపాయల లక్షల నగదు, బ్యాంకులోని రూ.20లక్షల నగదు, ఇంట్లో 2 కేజీల బంగారం, 7 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతోపాటు కోటి రూపాయల విలువైన ఎల్ఐసీ డిపాజిట్లు, 10లక్షల మేరకు ఎల్ఐసీ పాలసీలు బయటపడ్డాయి. ఇక భార్య, కుమార్తె పేరిట ఉన్న లాకర్లును తెరిచి చూస్తే కళ్లు జిగేల్మనేలా కేజీల కొద్ది బంగారం బయపడింది. లాకర్లలోని బంగారు ఆభరణాలు దాదాపు 4 కేజీల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటెండర్ నరసింహారెడ్డిని అరెస్టు చేశారు. అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. 1984లో అటెండర్గా విధుల్లోకి.. నెల్లూరు కాపువీధికి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్గా విధుల్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరించేవాడని సమాచారం. నరసింహారెడ్డికి పదోన్నతులు వచ్చినా.. కాదని 34 ఏళ్లుగా ఒకేచోట ఆఫీసు సబార్డినేటర్గానే విధులు నిర్వహిస్తున్నాడు. చూసేందుకు సాదాసీదాగా కనిపించే ఇతను మామూళ్ల వసూలులో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తాడని సమాచారం. తన వాటా కింద రావాల్సిన మొత్తంలో రూపాయి తగ్గినా ఒప్పుకోడని, ఆఫీసులోని పై అధికారులకు వాటాలు పంచడంలోనూ అంతే కచ్చితంగా ఉంటాడని సమాచారం. రోజువారీ సంపాదనతో నరసింహారెడ్డి ఏదో ఒక ఆస్తి కొనేవాడని తెలుస్తోంది. మొదట పొలాలు కొని, ఆ తరువాత రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇతడి కుటుంబ సభ్యుల పేరిట 18 ప్లాట్లు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రియల్ భూం తగ్గిపోవడంతో నరసింహారెడ్డి తన పెట్టుబడులను తెలివిగా బంగారం వైపు మళ్లించాడని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
బెల్లంపల్లి, న్యూస్లైన్ : ఎన్నికల్లో గెలిపిస్తే బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని పలువురు అభ్యర్థులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులతో ఉమ్మడి వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎరుకల రాజ్కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పత్తిసాగు గణనీయంగా ఉందన్నారు. పత్తికి అనుబంధంగా కాటన్ టెక్స్టైల్స్ పార్కును నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు లభించేలా చూస్తానన్నారు. నియోజకవర్గంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. విద్యుత్ సమస్య లేకుండా మూడు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలోని సామాజిక కమ్యూనిటీ ఆస్పత్రిని అప్గ్రేడ్ చేసి వంద పడకలకు పెంచుతానని, ఉన్నత విద్య చదవడం కోసం పీజీ, ఇతర కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెడికల్ కళాశాల మంజూరుకు.. టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, బెల్లంపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి పాటుపడతానన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉం డి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రవాణా అభివృద్ధికి.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి చిలుముల శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని భీమిని, వేమనపల్లి మండలాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేవన్నారు. మండలాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా గోదావరి నుంచి నేరుగా బెల్లంపల్లికి ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటు చేసి గోదావరి జలాలు సరఫరా చేయిస్తానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా మాట్లాడారు. నియోజకవర్గ ఓటర్లు ఆదరించి గెలిపిస్తే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. అయితే సీపీఐ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి గుండా మల్లేశ్, టీడీపీ అభ్యర్థి పాటిసుభద్ర ఈ కార్యక్రమాన్ని గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థులు ప్రజలు అడిగిన ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమానికి ఎన్నికల నిఘా వేదిక నాయకులు కమల్, పోచయ్య, జి.మోహన్, ఇ. చంద్రశేఖర్, జి.లక్ష్మి, ఇ.సువర్ణ, రంగ ప్రశాంత్, దాసరి విజయ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement