-
నితీష్కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్లోని 4 బీహెచ్కే ఫ్లాట్కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
-
తేజస్విని మాటల యుద్ధం.. వీడియో వైరల్
దొడ్డబళ్లాపురం: యాంకర్గా ప్రజలకు పరిచయమై, కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలిచి తరువాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన తేజస్విని రమేశ్ తమ స్వగ్రామం అయిన దొడ్డ తాలూకా దొడ్డరాయప్పనహళ్లిలో వీరంగం సృష్టించారు. గ్రామంలో పాఠశాల నిర్మించడానికి నిధులు వచ్చాయని తేజస్విని పనులు ప్రారంభించారు. అయితే స్థానిక గ్రామపంచాయతీ నిబంధనలు తుంగలో తొక్కి, రాజకీయ దురుద్దేశంతో తన ఇంటి ముందు రాకపోకలు సాగించడానికి కూడా అవకాశం లేకుండా కట్టడం నిర్మించడం జరుగుతోందని మెళేకోట గ్రామపంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో కొందరు తేజస్వినికి మద్దతుగా మరికొందరు నరసింహమూర్తికి మద్దతుగా నిలవడంతో గ్రామం రణరంగంగా మారింది. నరసింహమూర్తి ఇంటి ముందు అడ్డంగా తవ్వేసిన దృశ్యం గురువారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య గొడవలు జరగగా తేజస్విని కొందరిని దుర్భాషలాడుతూ, చేతులతో తోస్తూ, సవాళ్లు విసురుతున్న వీడియోలు స్థానికంగా వైరల్గా మారాయి. ఈ గొడవలకు కొనసాగింపుగా శుక్రవారం పంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తికి మద్దతుగా జేడీఎస్ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్వినికి, జేడీఎస్ నాయకులకు మాటల యుద్ధమే జరిగింది. తేజస్విని తమపై దాడి చేసిందని ఆరోపిస్తూ కొందరు దళితులు గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ తేజస్విని మాత్రం తాను ఎవరిపై దాడి చేయలేదని, కొందరు తనపై కక్షతో పాఠశాల నిర్మాణానికి అడ్డుపడుతున్నారన్నారు. నిజానికి తనమీదే కొందరు దౌర్జన్యం చేసారన్నారు. తాను నిబంధనలకు లోబడే పాఠశాల నిర్మిస్తున్నానన్నారు. ప్రస్తుతం దొడ్డరాయప్పనహళ్లిలో పరిస్థితి నివురుగ్పిన నిప్పులా ఉంది. -
ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి
హిందీ బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్కు చేదు అనుభవం ఎదురైంది. తన ఫోన్ హ్యాకింగ్ బారిన పడటంతో.. ఆమె ఫోన్ నుంచి స్నేహితులకు అసభ్య వీడియో కాల్స్ వెళ్లాయి. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న తేజస్వీ దయచేసి ఎవరూ తన వాట్సాప్ నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తవద్దని తెలిపారు. ఓ ప్రముఖ వెబ్సైట్తో ఆమె మాట్లాడుతూ... ‘ నేను నిన్న సీరియల్ షూటింగ్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అతడు అత్యంత అసభ్యంగా వికృత చర్యలకు పాల్పడుతూ కనిపించాడు. ఒక్కసారిగా అసహ్యం పుట్టింది. అప్పుడు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అతడు నా ఫోన్ను హ్యాక్ చేసి నా స్నేహితులతో చాట్ చేసి వాళ్లకు కూడా ఇలాగే అసభ్య వీడియో కాల్స్ చేశాడు’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న తేజస్వీ... తన తోటి నటీమణులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. తన ఫోన్ నుంచి ఈ కాల్స్ వెళ్లడంతో వాళ్లు షాక్కు గురైనట్లు పేర్కొన్నారు. తనేంటో పూర్తిగా తెలిసిన వాళ్లు కాబట్టి తనను తప్పుగా అర్థం చేసుకోలేదని .. అయితే ఈ ఘటన తననెంతో మానసిక వేదనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని... హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా వెంటనే ఫిర్యాదు చేయలేకపోతున్నానని వెల్లడించారు. కాగా ‘స్వరాగిణీ’ సీరియల్లో రాగిణిగా నటించిన తేజస్వీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement