-
మాజీ మంత్రి ‘భాట్టం’ కన్నుమూత
* అనారోగ్యంతో విశాఖలో మృతి * పలువురు ప్రముఖుల సంతాపం సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న జన్మించారు. భారత సోషలిస్టు పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1957లో ఆ పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 16 ఏళ్ల పాటు ఏఐసీసీ సభ్యునిగా కొనసాగారు. 1962 నుంచి 1981 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. విద్య, సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమం, సాంకేతిక విద్య, హరిజన, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, దేవాదాయ, ప్రత్యేక ఉపాధి పథకాలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1984లో టీడీపీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించిన ఆయన వివాదరహితునిగా పేరొందారు. చాన్నాళ్లుగా భాట్టం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తొలినాళ్లలో శ్రీరామ్మూర్తి జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1947-48లో జయభారత్ మ్యాగ్జీన్కు ఉప సంపాదకునిగా, 1969 నుంచి కొన్నేళ్లు ప్రజారథం వారపత్రిక, ఆంధ్ర జనతా (హైదరాబాద్ నుంచి వెలువడే) దినపత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. స్వేచ్ఛా భారత్ పేరుతో స్వీయ చరిత్రతో పాటు తెలుగులో నాలుగు పుస్తకాలు రాశారు. సాంస్కృతిక రంగంలో చేసిన కృషిని గుర్తించి 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాట్టంకు కళారత్న పురస్కారాన్ని అందజేసింది. సోమవారం సాయంత్రం శ్రీరామ్మూర్తికి విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భాట్టం మృతికి సీఎం చంద్రబాబు , జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాష్ట్ర మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన భాట్టం సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండటమే కాక, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన సంప్రదాయాలను నెలకొల్పారని జగన్ కొనియాడారు. భాట్టం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
బహుముఖ ప్రజ్ఞకు దర్పణం
ఈతరం ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకుడు భాట్టం విశాఖపట్నం/మహారాణిపేట :దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. వాటి పరిష్కారానికి చట్టసభల్లో గళమెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలిచారు.. భాట్టం శ్రీరామ్మూర్తి! తన క్రియాశీలత, రాజకీయ చతురత, ప్రతిభతో నలుగురు ముఖ్యమంత్రుల (పీవీ నరసింహారావు, టి. అంజయ్య, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి) మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇరవయ్యేళ్ల పాటు అమాత్య పదవుల్లో కొనసాగారు. తొలినాళ్లలో విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగుతున్న విజయనగరం జిల్లాలో అక్కడ రాజులు, విశాఖ జిల్లాలో ఆధిపత్యంలో ఉన్న తంగేడు రాజుల ప్రాబల్యాన్ని తట్టుకుని నిలబడగలిగారు. పాతికేళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న ఆయనకు 1984లో అనూహ్యంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ విశాఖ ఎంపీ సీటిచ్చారు. లోక్సభలో అడుగుపెట్టాక ఆయన విశాఖకు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. అప్పటికే విశాఖను పట్టిపీడిస్తున్న పరిశ్రమల కాలుష్య భూతంపై సమగ్ర సమాచారంతో 1985 ఫిబ్రవరిలోనే ప్రధాని రాజీవ్గాంధీ దృష్టికి తెచ్చారు. ఉక్కు నిర్వాసితులకు ఉపాధి, అల్యూమినా ప్లాంటు ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు, ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు క్లియరెన్స్, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు స్పెషల్ గ్రాంటు తదితర అంశాలపై లోక్సభలో తన వాణి వినిపించారు. దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భాట్టానికి సత్యసాయిబాబాపై అమితమైన భక్తిభావం. అందుకే ఆయన కొన్నేళ్ల పాటు ఆయన సన్నిధిలోనే గడిపారు. రచనలంటే ఇష్టం.. శ్రీరామ్మూర్తికి రచనలంటే ఇష్టం. తొలినాళ్లలో పత్రికా ఉప సంపాదకునిగా, సంపాదకునిగాను పనిచేశారు. తెలుగులో నాలుగు పుస్తకాలు కూడా రాశారు. స్వేచ్ఛాభారతం పేరిట స్వీయ చరిత్రను, మైసెల్ఫ్ ఇన్ పార్లమెంట్ పేరుతో ఇంగ్లిష్ పుస్తకాలను ప్రచురించారు. కులాంతర వివాహం.. సోషలిస్టు భావాలున్న శ్రీరామ్మూర్తి కులాంతర వివాహం చేసుకున్నారు. తాను విజయనగరంలో కాలేజి చైర్మన్ పదవికి పోటీ పడుతున్న సమయంలో క్లాస్మేట్ సత్యవతిని ఇష్టపడ్డారు. కొన్నాళ్ల తర్వాత రాజమండ్రిలో ఆమెను ఆదర్శ వివాహమాడానని తాను రచించిన స్వేచ్ఛాభారతంలో రాశారు. అయితే ఏడాదిన్నర క్రితమే ఆయనను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. కుమారుడి వద్ద ఉంటున్న ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం కన్నుమూసి తాను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామి వద్దకు పయనమయ్యారు. ప్రముఖుల నివాళులు శ్రీరామ్మూర్తి మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు పాండురంగాపురంలోని ఆయన స్వగృహానికి చేరుకుని ఆయన పార్ధివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ శర్మ, ఎమ్మెల్యేలు పెతకంశెట్టి గణబాబు, పీలా గోవింద సత్యన్నారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు మళ్ల విజయ్ప్రసాద్, తైనాల విజయ్కుమార్, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్రాజు, నగర యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, సబ్బంహరి, మాజీ మేయర్ రాజాన రమణి భాట్టంకు నివాళులు అర్పించారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, సీపీఐ నేతలు పైడిరాజు, వామనమూర్తి, తదితరులు భాట్టం మృతికి సంతాపం తెలిపారు. సత్యసాయి సేవలో... ఎంవీపీకాలనీ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి భాట్టం శ్రీరాంమూర్తి మృతి భారతదేశానికి తీరనిలోటు అని శ్రీసత్యసాయిసేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జె.చలం అన్నారు. ఎంవీపీ కాలనీలోని సత్యసాయిసేవ సదన్లోని సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అయన మాట్లాడుతూ బాబా ఆలోచనలతో పేదలకు సేవ చేశామన్నారు. భాట్టం 50 సంవత్సరాలుగా బాబా భక్తునిగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఎంతో ఎదిగి, ప్రజలకు సేవ చేసి ఆధ్యాత్మిక జీవితం కొనసాగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.ఆర్. నాగేశ్వరరావు, నగర కన్వీనర్ పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement