-
షూటింగ్కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్లో షూటింగ్ స్పాట్కు వెళ్లడం విశేషం. -
సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!
సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలతో పాటు ఆమెకున్న మయాసైటిస్ వ్యాధి గుర్తొస్తుంది. అప్పటివరకు వరసపెట్టి మూవీస్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. దీని వల్ల ఆమె.. 'చెన్నై స్టోరీ' అనే హాలీవుడ్ చిత్రం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమకు అవమానం.. ఎన్టీఆర్ ముందే..!) సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత.. సదరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ కు వచ్చింది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ కథతో సాగే మూవీ. ఇందులో శ్రుతి.. అనూ అనే లేడీ డిటెక్టివ్గా నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్యే మొదలైన షూటింగ్లోనూ పాల్గొంది. ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు శ్రుతిహాసన్.. చైన్నె స్టోరి మూవీ నుంచి వైదొలగినట్లు టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందుకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో నటి సమంత, శృతిహాసన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో చూడాలి? (ఇదీ చదవండి: Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?) -
హీరోయిన్తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
రొమాన్స్తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
ఈ ఫోటోలోని వ్యక్తి స్టార్ హీరోయిన్ మదర్.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గతేడాది రిలీజైన సలార్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. అయితే గతంలో ఆమె సింగర్గా కూడా సుపరిచితమే. ప్రస్తుతం జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు పాట పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఫోటోలతో వీడియోను రూపొందించింది. నాకు అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం.. వారిద్దరు నా జీవితంలో అద్భుతమైన. ప్రత్యేక వ్యక్తులని తెలిపింది. వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టమని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మొదట వాణి గణపతిని పెళ్లాడిన కమల్ హాసన్.. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అక్షర హాసన్, శృతి హాసన్ జన్మించారు. కాని అనివార్య కారణాలతో 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
హీరోయిన్ శ్రుతిహాసన్.. మళ్లీ ఒకప్పటి ప్రొఫెషన్లోకి
శృతిహాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గతేడాది చిరు, బాలయ్యతో మొదలుపెట్టి.. చివర్లో ప్రభాస్ 'సలార్'తో హిట్ కొట్టి 2023ని ముగించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పక్కనబెట్టేసిన పాత ప్రొఫెషన్ని తిరిగి ఇప్పుడు మొదలుపెట్టేసింది. (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ చాలామందికి తెలుసు. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. హీరోయిన్ కాకముందు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసింది. తండ్రి కమల్ 'ఉన్నైపోల ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలు అయింది. ఆ తర్వాత నటిగా మారడంతో పాడటాన్ని పక్కనబెట్టేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తనలోని సింగర్ని శ్రుతిహాసన్ బయటకు తీయబోతుంది. జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇందులో 'కాదలిక్క నేరమిల్లై' అనే పాటని శ్రుతిహాసన్ పాడనుంది. అలా యాక్టింగ్ పరంగా ఛాన్సులు రాకపోతేనేం.. మళ్లీ సింగర్గా బిజీ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
స్టార్ డైరెక్టర్తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హీరోయిన్ శ్రుతిహాసన్ డేరింగ్ స్టెప్.. ఫైనల్గా ఇన్నాళ్లకు?
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రుతిహాసన్.. కెరీర్ ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలు ఫేస్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. చెప్పాలంటే గతేడాది తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో లక్కీ హీరోయిన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో కెరీర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) గతేడాది తెలుగులో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్', 'హాయ్ నాన్న' (గెస్ట్ రోల్) సినిమాల్లో శ్రుతిహాసన్ నటించింది. ఇవన్నీ హిట్ అయ్యాయి. తాజాగా రవితేజ కొత్త మూవీలో నటించబోతుందని టాక్. హాలీవుడ్లో 'ది ఐ' అనే వెబ్ సీరీస్లోనూ శ్రుతి ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం ఈమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే సొంత భాషలో దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రుతిహాసన్ నటించబోతుందట. శ్రుతిహాసన్ తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. విజయ్సేతుపతి 'లాభం' చిత్రంలో ఈ బ్యుటీ నటించింది. 2021లో ఇది రిలీజైంది. అప్పటినుంచి సొంత భాషలో చేయని శ్రుతిని ఇప్పుడు ఓ క్రేజూ సినిమాలో ఆఫర్ కొట్టేసిందట. వేలు నాచ్చియార్ అనే వీరవనిత పాత్రని శ్రుతిహాసన్ చేయబోతుందట. స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి వేలు నాచ్చియార్. రాజేష్ ఎం.సెల్వా ఈ ప్రాజెక్ట్ తీయబోతున్నారు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసే శ్రుతిహాసన్.. ఈ పాత్రలో చేస్తే సినిమా వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) -
శ్రుతిహాసన్ స్టన్నింగ్ లుక్.. నిధి అగర్వాల్ని ఇలా చూస్తే అంతే!
క్యూట్ ఫొటో షేర్ చేసిన ముద్దుగుమ్మ సమంత చీరలో మరింత అందంగా కనిపిస్తున్న మీనాక్షి చౌదరి కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న 'బలగం' బ్యూటీ లంగా ఓణీలో కేక పెట్టించేంత అందంగా బిగ్బాస్ శ్రీసత్య వింత ఔట్ఫిట్లో మత్తెక్కించే చూపులతో శ్రుతిహాసన్ 'నా సామి రంగ' షూటింగ్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన రుక్సార్ పట్టుచీరలో చిరునవ్వుతో టెంప్ట్ చేస్తున్న ఈషా చావ్లా పింక్ కలర్ డ్రస్లో అలా కనిపిస్తున్న యాంకర్ వర్షిణి View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by WARINA HUSSAIN (@warinahussain) View this post on Instagram A post shared by Nitya Naresh (@nityanaresh) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే
టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ శృతిహాసన్. అవును మీరు సరిగానే విన్నారు. 2023లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు. అయితే వీళ్ల సినిమాలన్నింటినిలోనూ శృతిహాసన్ ఉంది. అలా ప్రస్తుతం అదృష్ట కథానాయికగా మారిపోయింది. వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ వార్త ఎందుకొచ్చింది? (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) గతంలో హీరో సిద్ధార్థ్తో శృతిహాసన్ రిలేషన్ లో ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరూ సెపరేట్ అయిపోయారు. కొన్నాళ్లకు ఓ ఫారినర్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. పెద్ద టైమ్ తీసుకోకుండానే ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది. కొన్నాళ్ల నుంచి అసోంకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజరికాతో కలిసి ఉంటోంది. శృతి అయితే శంతను తన ఫ్రెండ్ అని చెబుతూ వస్తోంది. కానీ వీళ్లని చూస్తే మాత్రం అలా అనిపించదు. ఇకపోతే బాలీవుడ్లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు.. తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ శృతిహాసన్పై కామెంట్స్ చేశాడు. అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని, తనతో కూడా రూడ్గా ప్రవర్తించిందని ఒర్రీ చెప్పాడు. శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతిహాసన్.. 'నేను పెళ్లి చేసుకోలేదు. అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది' అని ఒర్రీ కామెంట్స్కి కౌంటర్ ఇచ్చింది. (ఇదీ చదవండి: హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్) -
‘సలార్’ మూవీ రివ్యూ
టైటిల్: సలార్ పార్ట్ 1- సీజ్ఫైర్ నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీహాసన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు తదితరులు నిర్మాతలు: విజయ్ కె. దర్శకత్వం: ప్రశాంత్ నీల్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రఫీ: భువన గౌడ్ విడుదల తేది: డిసెంబర్ 22, 2023 ప్రభాస్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు (రాధేశ్యామ్, ఆదిపురుష్) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(డిసెంబర్ 22)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడులైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా..యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. సలార్ కథేంటంటే.. ఆద్య(శృతిహాసన్) విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్(మైమ్ గోపీ) ద్వారా అస్సాంలో ఉన్న దేవా(ప్రభాస్) దగ్గరకు పంపిస్తాడు. దేవా బొగ్గు గనుల్లో మెకానిక్గా పని చేస్తుంటాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే.. ఆందోళన చెందుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు? ఖాన్సార్ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్)ను చంపాలని కుట్ర చేసిందెవరు? ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్ కోసం దేవా ఏం చేశాడు? ఆద్య ఎవరు? ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మేకింగ్ పరంగా ప్రశాంత్ నీల్కు ఓ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లో హీరోకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది. లెక్కలేనన్ని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్ సెంటిమెంట్ మస్ట్గా ఉంటుంది. సలార్లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీయఫ్లో మాదిరి ఇందులో కూడా ఖాన్సార్ అనే ఓ కల్పిత ప్రాంతాన్ని సృష్టించి, కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీయఫ్ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనీ సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు. కేజీయఫ్తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్ కాస్త తక్కువే అయినా.. అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి ఆ సీన్స్ అన్నీ థియేటర్లో ఈళలు వేయిస్తాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఫ్యాన్స్కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్ నీల్. ఈ విషయంలో ప్రశాంత్ని మెచ్చుకోవాల్సిందే. కథలో గందరగోళం.. కథనానికి నిలకడలేమి ఉన్నప్పటికీ.. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా తీర్చి దిద్దాడు. అయితే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచిపెడుతూ లైటర్ వేలో పార్ట్ 1ని కంప్లీట్ చేశాడు. దేవా, వరద రాజమన్నార్ల చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్గా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత భారీ ఎలివేషన్తో హీరో పాత్రని ఎంట్రీ చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాటకోసమే హీరో ఆగుతున్నాడు...ఒక్కసారి ఆమె వదిలేస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సెండాఫ్లో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే సీన్స్ గూస్బంప్స్ని తెప్పిస్తాయి. ఇలా రెండు పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్ సన్నివేశాలను మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. హీరో ఎలివేషన్స్.. యాక్షన్స్ సీన్స్తో ఫస్టాఫ్ అలరిస్తుంది. కానీ సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడేది చాలా తక్కువ సేపు. ఫస్టాఫ్లో అయితే రెండు, మూడు డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ఎలివేషన్.. యాక్షనే. ఇక సెకండాఫ్లో కథంతా ఖన్సార్ ప్రాంతం చుట్టూ తిరిగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళానికి గురిచేస్తాయి. కుర్చి కోసం చేసే కుతంత్రలు కూడా అంతగా రక్తి కట్టించవు. అయితే ఈ క్రమంలో వచ్చే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో సంహరించే సన్నివేశం గూస్బంప్స్ తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో ఇందులో కూడా తల నరికే సన్నివేశం ఉంటుంది. అది కూడా హైలెట్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే.. రాజమౌళి తర్వాత ప్రభాస్ కటౌట్ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చి దిద్దాడు. ఇక ఆ పాత్రలో ప్రభాస్ రెచ్చిపోయి నటించాడు. తల్లిమాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రబాస్ చేత కత్తిపట్టి విలన్లను నరుకుతుంటే.. ఫ్యాన్స్ ఆనందంతో ఈళలు వేయడం పక్కా. ఇక వరద రాజమన్నార్గా పృథ్విరాజ్ సుకుమారన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించేది ఒకటిరెండు సన్నివేశాల్లోనే అయినా డిఫరెంట్ పాత్రలో కనిపించింది. మన్సార్ ప్రాంత కర్త(రాజు)గా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తిండిపోయే పాత్ర చేశాడు. శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఫస్టాఫ్లో ఆమే కీలకం. టినూ ఆనంద్, మైమ్ గోపీ, రామచంద్రరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. భువన గౌడ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి.. నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమా స్థాయిక తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
ప్రతి రోజు పబ్లో మద్యం తాగేదాన్ని: స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రవర్తన, పరివర్తనలకు శృతిహాసన్ కేరాఫ్గా మారారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సలార్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నటుడు కమలహాసన్ తనయగా.. తండ్రి కథానాయకుడిగా నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయౖమైన శృతిహాసన్, ఆ తరువాత హిందీలో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ) అయితే చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన నటి శృతిహాసన్. కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. ఈ ఏడాది తెలుగులో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విజయం సాధించటం విశేషం. అదే విధంగా నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న హాయ్ నాన్న చిత్రంలో కూడా మోడల్గా కీలక పాత్రలో నటించారు. తాజాగా ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ భారీఅంచనాల మధ్య తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ సలార్ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిస అయ్యానని పేర్కొన్నారు. ప్రతి రోజు నా స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. అయితే తనకు ఎలాంటి డ్రగ్స్ సేవించే అలవాటు మాత్రం లేదని శృతిహాసన్ చెప్పారు. అయితే కొన్ని రోజుల తరువాత మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైందని తెలిపింది. ఎలాగైనా ఆ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికీ మద్యం మానేసి 8 ఏళ్లు పూర్తవుతోందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం తెలుగులో అడవి శేషు సరసన ఓ చిత్రం.. ఇంగ్లిష్లో ది ఐ అనే చిత్రంలోనూ శృతిహాసన్ కనిపించనుంది. (ఇది చదవండి: బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు) -
Shruti Haasan Photos: బ్లాక్ డ్రెస్లో మోస్ట్ బ్యూటిఫుల్గా శ్రుతి హాసన్ కుర్రకారుకు మత్తెక్కిస్తోందిగా!
-
సాలార్ ట్రైలర్ పై మిక్స్ రియాక్షన్ కి కారణం ఇదే..
-
శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు.. పూనమ్ బజ్వా హాట్ లుక్స్!
►గోల్డ్ డ్రెస్లో శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు ►బ్లూ కలర్ డ్రెస్సులో పూనమ్ బజ్వా హాట్ లుక్స్ ►ఎల్లో శారీలో ప్రియా భవానీశంకర్ హోయలు ►కలర్ఫుల్ డ్రెస్లో నిహారిక స్మైలీ లుక్స్ ►ఫుల్గా చిల్ అవుతోన్న ఆదా శర్మ ►గ్లామర్తో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
రాజకీయాల్లోకి స్టార్ హీరో కూతురు.. క్లారిటీ ఇదే!
సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. నటి, సంగీత దర్శకురాలు, గాయనిగా ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్. తరచుగా సోషల్ మీడియాలో టచ్లో ఉండే శృతి.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్, మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు కావడంతో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ విషయమై శ్రుతిహాసన్ ఇప్పటికే చాలా స్పష్టంగా సమాధానం చెబుతూనే వచ్చింది శృతి. తాజాగా కోయంబత్తూర్లో మీడియాతో ముచ్చటించగా... ఈ సందర్భంగా శ్రుతిహాసన్కు అదే ప్రశ్న ఎదురైంది. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడంపైనే తనకు ఆసక్తి ఉందని చెప్పారు. కాగా.. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న భామ.. ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రమని తెలిపారు. అయితే పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే విధంగా తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆల్బమ్ను కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రుతిహాసన్ చెప్పారు. (ఇది చదవండి: హీరోయిన్గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?) -
'సలార్' బ్యూటీ.. డిప్రెషన్ సమస్యకి చిట్కాలు చెప్పింది!
మానసిక ఒత్తిడి(డిప్రెషన్).. ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య ఇది. కారణాలు ఏంటనేది పక్కనబెడితే దీని బారిన పడి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు హీరోయిన్ శ్రుతిహాసన్ అద్భుతమైన చిట్కాలు చెప్పింది. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మానసిక ఒత్తిడి గురించి ఎవరూ బయటకు చెప్పడం లేదు. నేను మాత్రం వీటి గురించి డైరీలో రాసుకుంటాను. రోజూ జిమ్ చేస్తారు. దీని వల్ల శరీరంలోని రసాయనాలు, హార్మోనులు సమతుల్యం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తుంది. రోజూ నచ్చిన వారితో మాట్లాడతాను. వారి మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడుకునే విషయాల్లో మంచి-చెడు గురించి ఆలోచిస్తానని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్ 'సలార్'లో హీరోయిన్. అలానే హాలీవుడ్ మూవీ 'ది ఐ'లోనూ యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్) సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
యువరాణి గెటప్లో చిట్టి.. బ్యాక్ పోజులో అనసూయ!
సెల్ఫీ పోజులతో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి బ్లాక్ డ్రస్లో శ్రుతిహాసన్ బుసలకొట్టే స్టిల్స్ పింక్ చీరలో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింపుల్ ఔట్ఫిట్లో కాజల్ అగర్వాల్ అందాలు రాణి గెటప్లో రాజసం చూపిస్తున్న ఫరియా సన్నజాజి తీగలా శ్రియ అందాల విందు పై యాంగిల్ పోజుల్లో కృతిసనన్ చెల్లెలు రూట్ మార్చిన అనసూయ.. చీరలో సోయగాలు View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Jose Charles (@picstory_josecharles) -
'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్
హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పేరుకే హీరోయిన్ కానీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. నటిగా పేరు తెచ్చకున్నా, అంతకు ముందే సంగీతంపై ఆసక్తితో ఆ రంగంలో పలు ప్రైవేటు పాటల ఆల్బమ్స్ చేసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యింది. తండ్రి కమలహాసన్ హీరోగా నటించిన 'ఉన్నైప్పోల్ ఒరువన్' చిత్రానికి సంగీతమందించింది. అలానే లిరిక్ రైటర్, సింగర్గా పేరు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు 'సలార్' కోసం సాహసం చేసేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ!) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేస్తున్న శ్రుతి హాసన్.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. హిట్స్ అందుకుంది. ఈమె నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు ఈ మధ్యే శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఓవరాల్ గా ఐదు భాషల్లోనూ ఈమె సొంత గొంతే వినిపించనుంది. ఇప్పటికే మూడు భాషల డబ్బింగ్ పూర్తి చేసిన ఈమె.. మరో రెండింటివి కూడా కంప్లీట్ చేసే బిజీలో ఉంది. సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో చెప్పడానికే తంటాలు పడుతుంటారు. అలాంటిది శ్రుతి.. ఐదు భాషల్లో చెప్పడమంటే సాహసమే. ప్రస్తుతం తెలుగులో 'హాయ్ నాన్న', ఇంగ్లీష్లో 'ది ఐ' అనే సినిమాలో నటిస్తోంది. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) -
హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్. అలా పండగ విన్నర్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలో ప్రభాస్ 'సలార్'తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇది ఎవరికో కౌంటర్ వేసినట్లు ఉంది. దీంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. పోస్టులో ఏముంది? 'నేను కొందరినీ గమనిస్తుంటారు. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి సైలెంట్ గా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుంది' అని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) ఇబ్బంది పెట్టారా? అయితే ఈ పోస్ట్ చూస్తే శ్రుతిహాసన్.. ఎవరికో కౌంటర్ వేస్తున్నట్లు అనిపించింది. అలానే ఈ బ్యూటీ ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారా అనే సందేహం కూడా వస్తోంది. అయితే ఇలా సడన్ గా కర్మ సిద్ధాంతం టైపులో పోస్ట్ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది. బాయ్ ఫ్రెండ్తో గతంలో సిద్ధార్థ్, ఓ ఫారెన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిన శ్రుతిహాసన్ ప్రస్తుతం శంతను హజరికా అనే కుర్రాడితో రిలేషన్లో ఉంది. అయితే అతడిని ఫ్రెండ్ అని చెబుతుంది తప్పితే బాయ్ ఫ్రెండ్ అని ఎక్కడా అనట్లేదు. అయితే ప్రస్తుతం పెట్టిన కర్మ పోస్ట్ కూడా వీళ్ల రిలేషన్ గురించి ఏమైనా కామెంట్స్ చేసిన వాళ్లకా అనే సందేహం వస్తోంది. ఈ విషయాలపై స్వయంగా శ్రుతిహాసన్ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకు రాదు. (ఇదీ చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ) -
అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్డే.. పబ్లో డ్యాన్స్ చేస్తూ! ) అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్లు లేకపోతే వెంటనే ఫ్లాట్కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది. ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!) -
అప్పుడేమో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్! (ఫోటోలు)
-
ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో
మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది. అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే) -
వీకింగ్స్ సిరీస్ పాత్రల్లో సౌత్, బాలీవుడ్ నటులు.. ఏఐ మాయాజాలం! (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement