-
తమిళ చిత్రాలతోనే గుర్తింపు
తమిళ చిత్రాలతోనే తాను గుర్తింపు పొందినట్లు నటి నీతుచంద్ర పేర్కొన్నారు. ఈ బెంగాలీ సుందరి సొంతగడ్డపై నటిగానే కాకుండా నిర్మాతగా త్రాలు నిర్మించి అవార్డులు పొందారు. అయినా తమిళ చిత్రాలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. కోలీవుడ్లో యావరుం నలం చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఆదిభగవాన్ తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల చెన్నైకి విచ్చేసిన ఈ బ్యూటీ మాట్లాడుతూ ఏడాది గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో ఒక చిత్రం చేయనున్నానని చెప్పారు. దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. తానిప్పటి వరకు పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో పోషించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. మంచి సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా ఉంటుందన్నారు. వ్యాపారాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు తనకు ఇక్కడే లభిస్తున్నాయన్నారు. తాజా చిత్రంలో కూడా ఆ తరహా పాత్రనే పోషించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని చెప్పారు. ఇటీవల 1980 ప్రాంత నటీనటుల విందులో కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇందులో నటి శ్రీప్రియకు అంకితం ఇచ్చేలా ఆమె నటించిన చిత్రంలోని పాటకు తాను నర్తించానన్నారు. ఇది తనకు తీయని అనుభూమితిని మిగిల్చిందన్నారు. -
నా రూటే సపరేటు
నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త అయిన ఆర్కే తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్వళి తనీవళి (నా రూటు సపరేట్) మక్కల్ పాళరై తాకంపై ఈయన సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆర్కే ఐపీఎస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర వివరాలను ఆర్కే తెలుపుతూ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న మంచి కమర్షియల్ కథా చిత్రం అని చెప్పారు. ఎక్కడ అరాచకాలు జరుగుతాయో అక్కడికి ప్రభుత్వం ఈ పోలీస్ అధికారిని పంపి పరిస్థితులను చక్కదిద్దుకుంటుందన్నారు. అలాంటి ప్రభుత్వమే చివరికి ఆ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా మారుతుందన్నారు. అందుకు కారణాలేమిటి? ఆ తరువాత ఏమయ్యిందనే పలు ఆసక్తికర సంఘటనల సమాహారమే ఎన్వళి తనీవళి చిత్రం అన్నారు. చిత్రంలో చాలా ట్విస్ట్లుంటాయని చెప్పారు. పేరుకు అందరూ పోలీసులే అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారని అలా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పోలీసు అధికారి కథ ఈ చిత్రం అని తెలిపారు. ప్రేమ, యాక్షన్, హాస్యం అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయన్నారు. అమ్మపాట హైలైట్ చిత్రంలో ఇద్దరు కథానాయికలుంటారని ఆ పాత్రలను పూనం కౌర్, మీనాక్షి దీక్షిత్లు పోషించారని తెలిపారు. వీరిలో ఒకరు తన మేనత్త కూతురు కాగా మరొకరు తనతో పని చేసే యువతి అని వివరించారు. చిత్రంలో ప్రధాన ప్రతినాయకిగా రోజా నటించడం విశేషంగా పేర్కొన్నారు. ఒక ప్రముఖ వ్యాపార వేత్తగా ఈమె పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. హీరోకు అమ్మగా సీత నటించారని చెప్పారు. ఈమె చనిపోయినప్పడు వచ్చే అమ్మపాట, చిత్రం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుందన్నారు. అంత గొప్పగా ఆ గీతం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వైరముత్తు రాసిన టైటిల్ సాంగ్ జనరంజకంగా ఉంటుందన్నారు. షూటింగ్ను పాండిచ్చేరి, చెన్నై, జోడాన్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. వి.ప్రభాకర్ కథనం, మాటలు రాసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేనా సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇళవరసు, రాధారవి, ఆశిష్ విద్యార్థి తలైవాసల్ విజయ్, విసు, టి.పి.గజేంద్రన్, రాజ్కపూర్, సంగిలి మురుగన్, సెంథిల్ నాధన్, పయిల్ వాన్ రంగనాథన్, కరాటే రాజా, బీసెంట్ నగర్ రవి, అన్బాలయా ప్రభాకర్, అరుల్ణి, యువరాణి అంటూ భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్.కె.వెల్లడించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement