-
జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు
ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ మెట్రోపై ఆంక్షలను విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. In order to maintain foolproof security arrangements during the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10, the Delhi Police metro unit asked the Chief Security Commissioner to close some metro station gates that open towards the VVIPS Route/venue of… pic.twitter.com/5ssPc9xepz — ANI (@ANI) September 4, 2023 ఢిల్లీలోని మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు. ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే -
రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచును దృష్టిలో పెట్టుకుని జనవరి 15 వరకు 78 రైళ్ళను రద్దు చేసేందుకు నిర్ణయించామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శీల్దా ఎక్స్ ప్రెస్ , నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, బేగంపుర ఎక్స్ ప్రెస్ , లక్నో డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ , గోరఖ్పూర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ , జైపూర్-చండీగఢ్ ఎక్స్ ప్రెస్ , మౌ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి. విజిబిలిటీ తగ్గిన కారణంగా ముందు జాగ్రత్తచర్యగా వీటీని జనవరి 15 వరకు వీటిని రద్దు చేసినట్టు చెప్పారు. వీటిలో ఉత్తర మండలంలో 34 రైళ్లు ఉన్నాయి. చండీగఢ్-అమృతసర్ ఎక్స్ ప్రెస్ రోహ్తక్ ఇంటర్సిటీ, వారణాసి-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ , లిచ్చావి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయి. ప్రమాదాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ సమాచారాన్నిప్రయాణికులకు అందిస్తున్నామని తెలిపారు. సంబంధిత సమాచారాన్ని అందించేందుకు వివిధ స్టేషన్ల దగ్గర హెల్స్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీంతోపాటుగా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా మిగిలిన లోకో డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. మరోవైపు వాతావరణం అనుకూలించని కారణంగా ఇవాల్టి రైళ్లు అనేక గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీపొగమంచు వాహనాదారులకు తీవ్ర కష్టాలనుతెచ్చిపెడుతోంది. ఇటీవల అనేక రైళ్లు, విమానాల రాకపోకలకు సైతం తరచూ అంతరాయం ఏర్పతోంది. కొన్నిచోట్ల అనేక రోడ్డు ప్రమాదాలుకూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement