-
ఇదీ సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం కాదని, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని ఆచరించి చూపిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో శనివారం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ఎంపీ అభ్యర్థులను, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు కేటాయించామని చెప్పారు. 50 శాతం సీట్లను కచ్చితంగా నా.. నా.. నా.. అని సంబోధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదన్నారు. ఇది నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ అమలు చేశామని చెప్పారు. దాన్ని మనస్ఫూర్తిగా... స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు.. మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఈ వర్గాల వారికే సీట్లు ఇవ్వగలగడం చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీకి మాత్రమే ఆ ధైర్యం ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశాం. దాదాపు 99 స్థానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్ రాని వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నా. విప్లవాత్మక మార్పులు.. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఐదేళ్ల పాలన సాగింది. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బట¯Œన్ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లింది. ఇలా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి.. ఇది సాధ్యమే అని ఐదేళ్ల పరిపాలనలో చూపించాం. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండి పోతుంది. గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి.. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం బాగు పడింది. మహిళా సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నింటి వల్ల ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయేలా అడుగులు వేస్తాం. 59 స్థానాలు బీసీ అభ్యర్థులకే.. మొత్తం 200 స్థానాల్లో ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 11 స్థానాలు వీరికి కేటాయించాం. మహిళలకు ఇంతకు ముందుకన్నా బెటర్గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలకి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపోయినప్పటికీ లాస్ట్ టైమ్ కన్నా బెటర్గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ కన్నా బెటర్గానే ఉంటుందనుకుంటున్నాం. గతంలో 19 సీట్లు ఇస్తే ఈసారి 24దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషమే. వచ్చే ఎన్నికలకి ఇంకా పెద్ద సంఖ్యలో ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తాం. ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మందిలో 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేశాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. -
IPL 2024: విశాఖలో మరోసారి ఐపీఎల్.. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే..
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియం మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు జట్లకు హోమ్ గ్రౌండ్గా నిలిచిన ఈ స్టేడియం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కు హోమ్ గ్రౌండ్గా నిలవనుంది. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న చైన్నె సూపర్ కింగ్స్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. మరో 38 రోజుల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. రెండు మ్యాచ్లు విశాఖలో... ప్రస్తుత సీజన్లో తొలి విడతలో 21 మ్యాచ్లు 10 నగరాల్లో రెండు వారాలపాటు జరగనుండగా అందులో రెండు మ్యాచ్లు విశాఖలోనే నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూలు ఖరారు చేసింది. 2019లో గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏకంగా రెండు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్లను విశాఖ సొంతం చేసుకోగా.. మళ్లీ ఇప్పుడు మరో రెండు మ్యాచ్లకు అతిథ్యమివ్వనుంది. హోమ్ గ్రౌండ్గా వైఎస్సార్ స్టేడియాన్ని తొలిసారిగా 2012లో డెక్కన్ చార్జర్స్ ఎంచుకోగా 2015లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంచుకుంది. 2016లో ముంబయ్ ఇండియన్స్, పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఏకంగా మూడేసి మ్యాచ్లు ఆడాయి. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13వ మ్యాచ్గా మార్చి 31న చైన్నె సూపర్కింగ్స్తోనూ, 16వ మ్యాచ్గా ఏప్రిల్ 3వ తేదీన కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సహకారం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం వల్లే విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు అవకాశం దక్కిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్రరెడ్డి, కార్యదర్శి గోపినాథ్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి వసతులను అందించడంతో విశాఖవాసులకు దక్కిన అదృష్టంగా భావించవచ్చని పేర్కొన్నారు. విశాఖలో క్రీడలకు ఎంతగానే ప్రోత్సహిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖకు ధోని ఐపీఎల్–2016 సీజన్లో విశాఖలో జరిగిన 53వ మ్యాచ్లో పూణే సూపర్జెయింట్స్ జట్టు ఆట చివరి బంతిని ధోనీ బౌండరీ దాటించి నాలుగు వికెట్ల తేడాతో విజయతీరానికి చేర్చాడు. అప్పట్లో సీఎస్కే జట్టుకు ఐపీఎల్ అనర్హత వేటు పడగా ధోని సూపర్జెయింట్స్ తరఫున ఆడాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ ఎలెవెన్ ఏడు వికెట్లకు 172 పరుగులు చేయగా ధోని సేన భారీ లక్ష్యచేధనలో ఆరు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్నందుకుంది. 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ధోని 64పరుగులతో ఫినిషర్గా నిలిచాడు. మరోసారి ధోని ప్రత్యక్ష ఆటను చూసేందుకు విశాఖ తహతహలాడుతోంది. -
లేఖను ఎందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను మంగళవారం ప్రశ్నించారు. వివేకా మరణించే ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించే వారిద్దరి నుంచి ఎక్కువగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. సీబీఐ నోటీసుల మేరకు సునీత, రాజశేఖరరెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలతోపాటు లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది?, తర్వాత పోలీసులకు అందించడం, వివేకా పీఏ కృష్ణారెడ్డికి హత్య జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్లు చేశారు? ఆయన నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ అందుకున్నారు? హత్య జరిగిన సమాచారం అందిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఇలా పలు అంశాలపై సునీత, రాజశేఖరరెడ్డిలను సీబీఐ అధికారులు మరోమారు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరి స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాని అవినాష్ కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని 15వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాను ముందుగా నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని.. నాలుగు రోజుల గడువు కావాలని లేఖ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారి డ్రైవర్కు నోటీసులు అందజేసి అతడి సంతకం తీసుకున్నారు. అవినా‹Ùరెడ్డి ఈ నెల 19న ఉదయం 11గంటలకు హైదరాబాద్లో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వసతులు కల్పించండి: భాస్కరరెడ్డి పిటిషన్ జైలులో తనకు ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ–7) వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను గత నెలలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు తన ఉత్తర్వులను జూన్ 2కు వాయిదా వేసింది. -
‘చంద్రబాబు చరిత్ర తెలిస్తే.. పక్కన కూర్చోరు’
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నలుగురు మాజీ సీఎస్లు ఆరోపణలు చేశారంటేనే ఎంతలా అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుంటే ఆయన పక్కన ఎవరూ కూర్చోరని విమర్శించారు. ఒక్కసారి వామపక్షాలు, మరోసారి జనసేన, ఇంకోసారి బీజేపీ.. చివరగా కాంగ్రెస్తో కూడా పొత్తుకున్నారని, అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పనుల్లో రూ.7వేల కోట్లు చంద్రబాబు మింగేశారని ఆరోపించారు. రూ. 450కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే బినామిలకు ఇచ్చారన్నారు. చంద్రబాబు అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఓటమి భయంతో నీచంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు, ఆయనతో నడిచే పార్టీలకు ప్రజలు తగిన శాస్తి చెబుతారని రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
రాజన్న అన్నీ ఇచ్చిండు
పెద్దపల్లిఅర్బన్: ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్రను వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. ఆయన సేవల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణికి వచ్చిన పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన యేల్పుల ఎల్లయ్య(80) దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వృద్ధాప్య పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారి కలెక్టర్కు మొర పెట్టుకుందామని వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఇచ్చిండు.. అడుగుడు ఆలస్యంలేదు పని చేసి పెట్టిండు..దొర ఎక్కడున్న సల్లంగుండాలే.. మల్ల గసొంటోడు రావాలె.. నాడు నెలనెలా ఠంచన్గా పింఛన్ అచ్చేది’అని దివంగత నేతను తలచుకుని కన్నీరుపెట్టుకున్నాడు. ‘కేసీఆర్ అచ్చి ఏం చేయలేదు.. బ్యాంకుల ఖాతా కావాలంటే తెరిచినా..అయినా పింఛన్ రాలే.. తెలంగాణ అచ్చిన మొదటి నుంచి న్యాయం జరగలేదు’అని అక్కసును వెల్లగక్కాడు.. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement