-
'కిడ్నాపైన ఇంజినీర్లను రక్షించండి'
హైదరాబాద్: నాగాలాండ్లో కిడ్నాపైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్ల విడుదల కోసం ఆంధ్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఆ ఇంజినీర్లు విడుదలకు చర్యలు చేపట్టాలని నాగాలాండ్ ప్రభుత్వంతో చర్చించినట్లు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. వారి విడుదలపై నాగాలాండ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుతున్నామని తెలిపారు. నాగాలాండ్లోని పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో విజయవాడకు చెందిన ఇంజినీర్లు ప్రదీశ్ చంద్ర, రఘులు సూపర్ వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన వారు స్వస్థలం విజయవాడకు బయలుదేరేందుకు నాగాలాండ్లోని దిమాపూర్ చేరుకున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు ఇంజనీర్లతోపాటు మరో వ్యక్తిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే ముగ్గురులో ఓ వ్యక్తి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని... కిడ్నాపైన ఇంజినీర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు పృధ్వీ కన్స్ట్రక్షన్ యాజమాన్యంతో సంప్రదించారు. రఘు, ప్రతీశ్ చంద్రలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనని.... వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు తమకు అందజేయాలని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దాంతో బోడో తీవ్రవాదుల చెరలో ఉన్న తమ వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రఘు, ప్రతీశ్ చంద్ర కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ
అసోం : అసోంలో ఇద్దరు తెలుగువారిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ అయిన రఘు, ప్రదీప్లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు తీవ్రవాదులు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా తమ కుమారుల కిడ్నాప్ సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ అయినవారిలో ఒకరు విజయవాడకు చెందినవారు. కాగా గతంలోనూ బోడో తీవ్రవాదులు....అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
RR vs PBKS: పంజాబ్పై రాజస్తాన్ గెలిస్తే!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement