-
ఒలింపిక్ మాజీ స్విమ్మర్కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
భారత తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ మృతి
రేపల్లె/విజయవాడ స్పోర్ట్స్: ఒలింపిక్స్ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో భారత్ తరఫున బరిలోకి దిగిన తొలి స్విమ్మర్ మెహబూబ్ షంషేర్ ఖాన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 87 ఏళ్ల షంషేర్ ఖాన్కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2016 డిసెంబర్లో ఆయన భార్య ఫాతిమా మృతి చెందారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షంషేర్ ఖాన్ 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ (హీట్స్లో ఐదో స్థానం), 200 మీటర్ల బటర్ఫ్లయ్ (హీట్స్లో ఆరో స్థానం) ఈవెంట్స్లో పాల్గొన్నారు. 1930 ఆగస్టు 2వ తేదీన జన్మించిన షంషేర్ ఖాన్ ఎలాంటి కోచ్లు, సదుపాయాలు లేకుండానే కృష్ణానదిలో ఈత నేర్చుకున్నారు. 16 సంవత్సరాల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్ కమాండ్లో ఆర్మీలో చేరారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో ఈతలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు. 1954 నుంచి వరుసగా మూడుసార్లు సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో చాంపియన్గా నిలిచారు. మెల్బోర్న్ ఒలింపిక్స్కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో ఆయన అసోంకు బదిలీ అయ్యారు. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. జలంధర్ రెజిమెంట్లో శత్రువులు రాకుండా మైన్స్ పెట్టే బలగంలో పనిచేశారు. 1973లో సుబేదార్ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్లో పనిచేసి స్వగ్రామానికి వచ్చారు. సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ సంతాపం షంషేర్ ఖాన్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు, ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే అంతిమ యాత్రలో ‘శాప్’ ప్రతినిధులుగా గుంటూరు డీఎస్డీవో, సిబ్బంది, క్రీడాకారులు, పీఈటీలు పాల్గొంటారని శాప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘సాక్షి’తోనే అందరికీ తెలిశా.. ‘ఊరూ పేరూ లేని చోటుకు వెళ్లి గుర్తింపులేని ఆటల్లో పతకాలు గెలిచినవాళ్లకు ప్రభుత్వాలు భారీ నగదు పురస్కారాలు ఇచ్చేస్తున్నాయి. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో తొలి భారతీయునిగా షంషేర్ఖాన్ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తే... ఆ తరువాత 1996 వరకు అంటే 40 ఏళ్ల పాటు భారత్ నుంచి ఎవరికీ ఒలింపిక్స్లోని స్విమ్మింగ్ ఈవెంట్లో పాల్గొనే అర్హత కూడా లభించలేదు. అలాంటి దిగ్గజం 86 ఏళ్ల వయసులో ఎటువంటి గుర్తింపూ లేకుండా నివసిస్తున్నారు, మన ఒలింపియన్ను కనీసం గౌరవించుకోలేకపోవడం తెలుగుజాతి దురదృష్టం. పాతతరం యోధులను గుర్తించి సన్మానిస్తే చాలు...ఆ గుర్తింపే వాళ్లను మరింతకాలం బతికిస్తుంది’ అని 2016 జూలై 20వ తేదీన ‘ఎవరికీ పట్టని ఓ ఒలింపియన్’ పేరుతో సాక్షి పత్రిక స్పోర్ట్స్ పేజీలో కథనాన్ని ప్రచురించి షంషేర్ఖాన్ను తెలుగుజాతికి పరిచయం చేసింది. దీంతో శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు, శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ చొరవ తీసుకొని ప్రభుత్వ క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లగా... రూ.25 లక్షల నగదు పారితోషికం, ఇంటి స్థలం మంజూరు చేసి అందజేశారు. దీంతో ఆయన చివరి దశలో కొద్దిపాటి గుర్తింపు లభించి కాస్తంత సంతృప్తిగా కాలం చేశారని చెప్పవచ్చు. ఈ ఏడాది నరసరావుపేటలో జరిగిన జాతీయ ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో ఆయన ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షలు చెక్కును అందుకున్నారు. అప్పుడు ఈ విషయాన్ని సాక్షి స్పోర్ట్స్ ప్రతినిధితో ఆయన సంతోషాన్ని పంచుకుంటూ...‘‘నాకు సాక్షి ద్వారా 60 ఏళ్ల తరువాత గుర్తింపు వచ్చింది. అందరికీ తెలిశాను’ అంటూ చెమర్చిన కళ్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
తాగి బండి నడుపుతూ పట్టుబడ్డ ఒలింపిక్ ఈతగాడు
ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ మైఖేల్ ఫెల్ప్స్ తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాల్టిమోర్లోని ఫోర్ట్ మెక్హెన్రీ సొరంగంలో వెళ్లాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లి, డబుల్ లేన్ను కూడా క్రాస్ చేసినట్లు మేరీలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.40 గంటలకు ఫెల్ప్స్ వ్యవహారాన్ని రాడార్ గుర్తించింది. గంటకు 45 మైళ్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రాంతంలో అతడు 84 మైళ్ల వేగంతో వెళ్లాడు. దాంతో 18 సార్లు ఒలింపిక్స్లో స్వర్ణపతకాలు సాధించిన అతగాడిని పోలీసులు ముందుగా అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. ఎంత మొత్తంలో మద్యం తాగాడన్న పరీక్షల్లో కూడా ఫెల్స్ప్ విఫలం అయినట్లు పోలీసులు చెప్పారు. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఫెల్స్ప్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ అందుబాటులోకి రాలేదు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement