-
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్
సూర్యాపేటరూరల్: హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ తెలిపారు. శనివారం సూర్యాపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపాడులో ఈ నెల 16న గంగదేవమ్మ పండుగను గ్రామస్తులంతా వైభవంగా జరుపుకుంటున్నారు. యాదవ కులస్తులు యాటలు బలిచ్చి ఆల య సమీ పంలోనే వంటలు చేసుకుని బంధుమిత్రులతో భోజ నాలు చేశారు. సాయంత్రం గంగదేవమ్మ ఆ లయం చుట్టూ యాదవ కులస్తులు బేరీలు కొడుతూ ప్రదిక్షణలు చేశారు. ఈ క్రమంలో పాతర్లపహాడ్కు చెందిన బొల్లక బక్కయ్యకు కేశబోయిన అంజయ్యకు వా గ్వాదం జరిగింది. ఒకరి కాలు ఒకరికి తగిలిందం టూ ఘర్షణకు దిగారు. వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు సర్ది చెప్పిపంపిం చారు. కాసేపటి తర్వాత బొల్లక బక్కయ్య, అతడి అ న్న లింగయ్య, తమ్ముడు చిన్న లింగయ్య, బావమరిది ఉప్పుల పుట్టయ్య, కుమారుడు గణేష్, భార్య లిం గమ్మ, అక్కబయ్య లింగమ్మ, బంధువులైన బొల్లక దేవలింగం, బొల్లక మల్లయ్యలు గడగొయ్యలను తీసుకుని తంగెళ్ల దామోదర్రెడ్డి వ్యవసాయ బావి వద్ద పం డుగ చేసుకుంటున్న కేశబోయిన అంజయ్యపై దాడి చేశారు. అడ్డువచ్చిన అంజయ్య తండ్రి సౌడ య్య, కొడుకు ర మేష్ను, మరదలు నాగలక్ష్మమ్మపై కూడా దాడి చేశారు. గాయపడిన సౌడయ్యను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో అదేరోజు మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. శనివారం ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్ స్టేజీ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం రాగా సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. తొమ్మిది మంది నేరస్తుల్లో బొల్లక గణేష్ మైనర్ కావడంతో అతడిని నల్లగొండ జూవైనల్ కోర్టులో హాజరుపరుచనున్నట్లు, మిగతావారిని సూర్యాపేట కోర్టులో రిమాండ్కు పంపించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో సూర్యాపేటరూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ ఎస్ఐ హరికృష్ణ పాల్గొన్నారు. -
ఎంసెట్-2 లీకేజీలో మరొకరి అరెస్ట్
హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీఐడీ పోలీసులు మంగళవారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ముకుల్ జైన్ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. ముకుల్ ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. మిగతా నిందితుల కోసం సీఐడీ తీవ్రంగా గాలిస్తోంది. -
వ్యభిచార గృహంపై దాడి: 9మంది అరెస్ట్
సైదాబాద్: నగరంలోని ఓ వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం టూఆర్టీ క్వార్టర్స్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు నిర్వహించిన దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. -
9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండ పేకాట స్థావరంపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. గోపాలపురం గ్రామంలోని నాగవల్లి నదీ తీరంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, 3 ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement