-
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
అక్కడ అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్ అద్భుతమైన నటనతో పాటు థ్రిల్లింగ్ రెస్పాన్స్తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ హాట్ స్టార్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులని గెలుచుకుంది. దీంతో ఈ సినిమాకు పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు. డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్లో చెప్పినట్లుగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులను 'మంగళవారం' సినిమా గెలుచుకుందని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలిపారు. తమ చిత్రానికి ఈ అవార్డ్స్ దక్కడం చాలా సంతోషం అని విన్నర్స్ పేర్లు వెల్లడించారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణంలోకి భాగమయ్యారు. ► ఉత్తమ నటి - పాయల్ రాజపుత్ ► ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్ ► ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్ -
Mangalavaaram: 'మంగళవారం' సినిమాలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఫొటోలు చూశారా..దివ్యా పిళ్లైకి క్రేజ్ మామూలుగా లేదుగా!
-
'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం
పాయల్ రాజ్పుత్.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్కి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరూ అవాక్కయ్యేలా చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్గా 'మంగళవారం' సినిమాతో క్రేజీ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం పాయల్కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి టైంలో ఈ బ్యూటీ ఇంట్లో విషాదం నెలకొంది. (ఇదీ చదవండి: 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!) ఇయర్ ఎండింగ్లో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్.. క్షమించు, నిన్ను బతికించుకోలేకపోయాను అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. పెట్ డాగ్తో ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుని పలు వీడియోల్ని షేర్ చేసింది. 'నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతా.. ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది.. నిన్ను ఎంతగానో ప్రేమించా.. ఇకపై నా జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా.. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని హీరోయిన్ పాయల్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఈమె బాయ్ఫ్రెండ్తో పాటు పలువురు స్పందిస్తున్నారు. పాయల్ కెరీర్ విషయానికొస్తే 'మంగళవారం' సినిమాతో సూపర్ కమ్బ్యాక్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్లైన్స్.. అరబ్ ఎమిరేట్స్లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్లైన్ సిబ్బందిగా తన కెరీర్ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే
సాధారణంగా కొత్త మూవీస్ ఏ శుక్రవారమో శనివారమో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు మాత్రం డిఫరెంట్గా వారం మధ్యలో విడుదల చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తెలుగు హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్- అజయ్ భూపతి కాంబో.. ఈ మూవీతో మరో క్రేజీ హిట్ అందుకున్నాడు. హిట్ సినిమా 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'మంగళవారం' మూవీ తీశారు. తనకు అచొచ్చిన పాయల్ రాజ్పుత్ ఇందులో హీరోయిన్గా చేసింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. (ఇదీ చదవండి: బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత) ఆ ఓటీటీలోనే అయితే థియేటర్లలో 'మంగళవారం' సినిమా.. నవంబరు 17న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్ ఉండటంతో దీన్ని జనాలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. థియేటర్లలో ఈ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు గానీ ఓటీటీలో మాత్రం మంగళవారమే రిలీజ్ చేశారండోయ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి! కథేంటి? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి వీకెండ్తో 2023కి ఎండ్ కార్డ్ పడనుంది. గత శుక్రవారం థియేటర్లలోకి 'సలార్' వచ్చింది. హిట్ టాక్తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ 'డెవిల్', సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న 'బబుల్గమ్' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్, నయనతార 'అన్నపూరణి'.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి కానీ అవి రిలీజైతే గానీ వాటి సంగతేంటనేది తెలీదు. మరి ఏ మూవీ ఏ ఓటీటీల్లో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే క్రేజీ మూవీస్ (డిసెంబరు 25 నుంచి 31 వరకు) నెట్ఫ్లిక్స్ రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25 స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25 కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26 థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26 ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27 హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27 లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28 మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28 పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28 అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29 బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29 శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29 త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31 ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31 అమెజాన్ ప్రైమ్ కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27 టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31 హాట్స్టార్ మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 జీ5 దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29 వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29 జియో సినిమా ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25 ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30 లయన్స్ గేట్ ప్లే ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29 బుక్ మై షో ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29 (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
పాయల్ రాజపూత్ స్పెషల్ వీడియో
-
Payal Rajput: పాయల్కు కలిసొచ్చిన ‘మంగళవారం’
ఒక్క హిట్తో ఊహించని స్టార్డమ్ను సాధించింది నటి పాయల్ రాజ్పుత్. కానీ కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడిప్పుడే వరుస చాన్స్లతో మళ్లీ బిజీ అవుతోంది. ఆ విషయాలే క్లుప్తంగా.. ► పాయల్ స్వస్థలం ఢిల్లీ. తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్.. టీచర్. తల్లి నిర్మల్ రాజ్పుత్.. గృహిణి. ఢిల్లీలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్ స్కూల్లో చదివింది. యాక్టింగ్ కోర్స్లో డిప్లొమా పూర్తి చేసింది. ► ‘సప్నోం సే భరే నైనా’ అనే హిందీ సీరియల్తో మొదట బుల్లితెరకు, తర్వాత పంజాబీ సినిమా ‘ఛన్నా మేరేయా’తో సినీ ప్రేక్షకులకూ పరిచయం అయింది. 2018లో ‘ఆరెక్స్ 100’తో టాలీవుడ్లోనూ అడుగుపెట్టి యూత్లో క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ► ఆ పాపులారిటీ ఆమెకు ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్ మార్ఖాన్’, ‘జిన్నా’ వంటి తెలుగు సినిమాలతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటనావకాశాలను తెచ్చిపెట్టింది. సక్సెస్ గ్రాఫే సస్టెయిన్ కాలేకపోయింది. ► సినీఫీల్డ్లో పాయల్ కాస్త స్లో అయిన సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్ ఆమెకు వెల్కమ్ చెప్పింది. ‘3 రోజెస్’, ‘అనుకోని అతిథి ’ వంటి వెబ్ సిరీస్లతో ఆకట్టుకుంది. ఇటీవలే ‘మంగళవారం’ మూవీతో మళ్లీ హిట్ సాధించి.. డేట్స్ ఖాళీలేని అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడ్డాను. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవే. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి: పాయల్ రాజ్పుత్ -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' మూవీ సందడి కనిపిస్తోంది. మూవీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ అయ్యేలోపు ఎలా అయినాసరే ప్రభాస్ సినిమా చూసేయాలని తెగ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో అవకాశాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఓ తెలుగు హిట్ మూవీ రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే ఒకటి స్టార్స్ అయినా ఉండాలి లేదంటే కంటెంట్ అయినా డిఫరెంట్గా ఉండాలి. అలా నవంబరు ట17న పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ 'మంగళవారం'. కాకపోతే సరిగ్గా దీని రిలీజ్ టైంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగడం వల్ల ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ తేదీని డిస్నీ ప్లస్ హాట్స్టార్ తాజాగా ప్రకటించింది. డిసెంబరు 26న అంటే మంగళవారం రోజునే 'మంగళవారం' మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. ఓవైపు 'సలార్' థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం కచ్చితంగా ప్లస్ అవుతుందని అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్పూత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్లో ఒక్కొక్కటి రవీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ మంగళవారం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్తో పూనకాలు వచ్చేస్తాయి. -
డైరెక్టర్ గురించి చెప్పాలంటే!
-
మాస్క్ తో చేసే సీన్స్ లో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే!
-
లో దుస్తులపై అసభ్యకర కామెంట్.. నెటిజన్కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!) అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్పుత్పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. Payal Rajput bra#PayalRajput #payal #payalbra#bra #boobs #cleavage #hot#actresshot #sexy #actresshot pic.twitter.com/uxQMZXn9sN — actresspicshot (@ViaanSharma0210) November 27, 2023 -
ఈ సినిమాలో నన్ను ఎవరైనా చూస్తారా లేదా అని భయమేసింది
-
తరుణ్ భాస్కర్ తొడల పై మంగళవారం కామెంట్స్ చేసిన విశ్వక్..!
-
దర్శి గాడి సినిమానే కదా OTTలో చూద్దాంలే అనుకోవద్దు..!
-
పాయల్ Cute స్పీచ్ మంగళవారం సినిమా గురించి
-
నా జీవితాన్ని 'మంగళవారం' మార్చింది: ప్రియదర్శి
‘‘అజయ్ భూపతికథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. అయితే డేట్స్ కుదరక నేనా సినిమా చేయలేకపోయా. ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్తో ‘మంగళవారం’ని రెండున్నర గంటల సినిమాగా నిజాయతీగా చెపారు అజయ్ భూపతి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ–‘‘పాయల్ పాత్రని అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా అని కాస్త భయపడ్డా. అయితే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నా సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో... ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక 'మంగళవారం' మార్చింది. నా జీవితంలో గుర్తుపెట్టుకునే 'మంగళవారం' ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా’ అన్నారు. ‘మా సంస్థలో తీసిన తొలి సినిమా ‘మంగళవారం’ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు సురేష్ వర్మ. -
దెబ్బకొట్టిన ప్రపంచకప్ ఫైనల్.. తెలుగు హిట్ సినిమాకు ఆ రేంజ్ నష్టాలు!
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా మనోళ్లకు అదృష్టం కలిసిరాలేదని.. అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సరే దాని గురించి అలా వదిలేయండి. ఇదే వరల్డ్కప్ ఫైనల్ వల్ల ఓ తెలుగు హిట్ సినిమాపై దారుణమైన దెబ్బ పడింది. అలాంటి ఇలాంటి దెబ్బ కాదని చెప్పొచ్చు. దీంతో లాభాలు రావాల్సింది నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటి? దురదృష్టం.. ఎప్పుడు, ఎలా వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. 'మంగళవారం' చిత్రానికి మాత్రం ప్రపంచకప్ ఫైనల్ రూపంలో వచ్చింది. సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది. కానీ ఏం లాభం. టీమిండియా.. ఈ వరల్డ్కప్లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్కి చేరడం.. 'మంగళవారం' మూవీకి శాపమైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్లో మాత్రం వరల్డ్కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు. మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే సందేహమే!? అలానే వరల్డ్కప్ లేకపోయింటే.. 'మంగళవారం' సినిమాకు తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండేవని, ఈ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. ఇప్పుడు వీక్ డేస్లో జనాలు ఈ సినిమాని ఆదరిస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే హిట్ కొట్టిన నష్టాలు మాత్రం తప్పవు! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
మంగళవారం మూవీ సక్సెస్ మీట్.. పాయల్ రాజ్పుత్ సందడి (ఫోటోలు)
-
మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్ హీరోను దించేశారుగా!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్100 మూవీతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత అజయ్ మహాసముద్రం మూవీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్తో కలిసి ‘మంగళవారంతో దూసుకొచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్పుత్. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. (ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ) #Mangalavaram in Theatres now 💥💐💥💐 pic.twitter.com/8pOArYDuPZ — Moviezupp Entertainment (@moviezupp) November 17, 2023 -
Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ
టైటిల్: మంగళవారం నటీనటులు: పాయల్ రాజ్పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి దర్శకత్వం:అజయ్ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి విడుదల తేది: నవంబర్ 17, 2023 ‘మంగళవారం’కథేంటంటే.. ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు. మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ టచ్తో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దాంతో పాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. అలా అని ఇది మెసేజ్ ఓరియెంటెంట్ ఫిల్మ్గా సాగదు. కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు.. అసలు కథ ప్రారంభం కాదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి. శైలు చిన్ననాటి ఎపిసోడ్తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం..తండ్రి మరోపెళ్లి చేసుకోవడం..అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. శైలు, రవిల చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి..ఆ తర్వాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే 1996కు తీసుకెళ్లాడు. అక్కడ వరుస మరణాలు.. గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం.. మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం.. ఇలా ప్రతి మంగళవారం జరగడం.. దాని వెనుక ఉన్నదెవరని ఎస్సై మాయ చేపట్టే విచారణ.. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం.. ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్టాఫ్ను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. శైలు లవ్స్టోరీ ఎపిసోడ్తో చాలా ఎమోషనల్గా ద్వితియార్థం ప్రారంభం అవుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్గా చూపిస్తూనే. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అలా చేయడం చాలా కష్టమైన పని.. కొంచెం తేడా కొట్టినా.. ఫలితమే మారిపోతుంది. కానీ అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం.. బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్పుత్ చాలా సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గాళ్గానే చూపించారు. కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్ని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. శైలు పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. గ్లామర్తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇక ఎస్సై మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది. అయితే నటనకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఆమెది. అజయ్ ఘోష్, లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వారిద్ధరి మధ్య సంబాషణలు నవ్వులు పూయిస్తాయి. శైలు చిన్ననాటి ప్రియుడు, మాస్క్ ధరించిన వ్యక్తి( ఈ నటుడి ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిలింగ్గా ఉంటుంది) కూడా అద్భుతంగా నటించాడు. ఆర్ఎంపీ డాక్టర్గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అతను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్ని అదించింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
మంగళవరం మేకింగ్ మూవీ
-
'మంగళవారం' ఛాన్స్ కోసం డైరెక్టర్ వెంటపడ్డా: పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఆ మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే 'మంగళవారం' చేసింది. ఈ శుక్రవారం (నవంబరు 17)న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్పై పోలీస్ కేసు) 'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డా. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. అలానే కొన్నాళ్లకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. నాకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం. శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేకపోయాను. నా చేతిపై గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు నటించిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జు చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని పాయల్ రాజ్పుత్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement