-
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్రెడ్డి అన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామన్పాడుకు 1,140 క్యూసెక్కులు మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్పాడు జలాశయానికి 1,140 ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్రెడ్డి తెలిపారు. -
జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్ఫ్లో.. శ్రీశైలం జలాశయంలో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2,800క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. నెట్టెంపాడు ఎత్తిపోతల నీటి పంపింగ్ కొనసాగుతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 99, ఎడమ కాల్వకు 1,140, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్ లింకు కెనాల్కు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగులు దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో సోమవారం 842 అడుగుల వద్ద 64.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,392, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్కు 960, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 135 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో..
మహబూబ్నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత
గద్వాల రూరల్/దోమలపెంట/బాల్కొండ: కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా వస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 క్రస్టుగేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో ఒకేసారి 27 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. సాయంత్రం 6 గంటలకు వరద తగ్గడంతో 17 గేట్లు మూసి వేసి.. 75,005 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయంలో జూరాలకు 92 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి.. సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి సాయంత్రం 6 గంటలకు 1,52,589 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 62,896 క్యూòÜక్కులు, స్పిల్వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, మొత్తం ప్రాజెక్టు నుంచి 2,02,811 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.8 అడుగులు, 214.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద.. ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి 88,470 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు. కాగా శుక్రవారం రాత్రికి 1,088.6 (78.34 టీఎంసీలు) అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీశైలం, జూరాల గేట్లెత్తారు
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి భారీగా వరద పెరగడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తారు. గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో 81,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 81,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 8.591 టీఎంసీలు, 317.990 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు సుంకేశుల నుంచి భారీగా వరద పోటెత్తింది. సుంకేశుల 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, జూరాలతో కలిపి మొత్తం 1,98,204 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 27,662 క్కూసెక్కులు, ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,237 క్యూసెక్కులు మొత్తం 91,683 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.1 అడుగులు, 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
అధ్వాన్నంగా ఆత్మకూరు - జూరాల ప్రాజెక్ట్ రహదారి
-
మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్కు పోటెత్తిన వరద
-
మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద ఉధృతి
-
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్లో స్వల్పంగా వరద నీరు
-
జూరాల కాల్వపై కూలిన వంతెన
ధరూరు (గద్వాల): వాహనం బరువును తట్టుకోలేక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వపై నిర్మించిన వంతెన కూలింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం సమీపంలో జూరాల–ఆత్మకూరు, మక్తల్ ప్రధాన రోడ్డు మార్గం నుంచి భీంపురం, పెద్దచింతరేవులకు రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఏళ్ల క్రితం రోడ్–కం–బ్రిడ్జిని నిర్మించారు. అప్పటినుంచి ఇదే మార్గం గుండా ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం భీంపురానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంకోసం స్లాబ్ వేసేందుకు కాంక్రీటు మిశ్రమంతో కూడిన భారీ వాహనం (30 టన్నుల ట్రాంక్ మిక్చర్) వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే బ్రిడ్జి కూలింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అలాగే ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. -
జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
-
జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి
-
‘బొగత’కు జనకళ.. వాహ్ మహబూబ్ ఘాట్
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద చాలా రోజుల తర్వాత పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. – వాజేడు వాహ్ మహబూబ్ ఘాట్ చుట్టూ ఎత్తయిన కొండలు... చెట్లతో ఎటు చూసినా పచ్చ తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చదనం మధ్యలో నల్లతాచు పాములా కనిపించే రోడ్డు మలుపులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ వద్ద కనిపించే ఈ దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్ధం పడుతున్నాయి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మహబూబ్ ఘాట్ అందాలను ‘సాక్షి’కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ జూరాల ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత ధరూరు (గద్వాల): జూరాలకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 4,27,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 36 గేట్ల ద్వారా 3,63,993 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ఫ్లో 3,66,006 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.557 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పుడమి పచ్చకోక కట్టినట్టు.. కనుచూపు మేర పచ్చటి పొలాలు.. ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమేఘాలు.. మధ్యలో పచ్చని చెట్లు.. పైర్లు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చదనంతో సింగారించుకున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారు ప్రాంతమిది. – ఫొటో: కె.సతీష్, స్టాఫ్ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సుందర జలపాతం.. వెళ్లడం కష్టం కొండలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం సమీపంలోని రథంగుట్టపై ఉంది. ఇది దాదాపు వర్షాకాలం పొడవునా జాలువారుతూనే ఉంటుంది. అయితే దీని వద్దకు వెళ్లేందుకు మాత్రం దారిలేదు. మూడేళ్ల క్రితం పై భాగానికి వెళ్లే యత్నంలో ఓ యువకుడు రాళ్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. అప్పట్నుంచి ఎవరూ ఈ జలపాతం వద్దకు వెళ్లట్లేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్ -
నిండుకుండలా సాగర్!
సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన నాగార్జున సాగర్కు చేరుతూ.. నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం కల్లా సాగర్ పూర్తిగా నిండుతుందని, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. భారీగా ప్రవాహాలు.. జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల సమయంలో 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 47 గేట్లను ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరదకుతోడు సుంకేశుల ద్వారా చేరుతున్న ప్రవాహాలు కలిసి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తూ.. పదిగేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీనితోపాటు కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తితో 66 వేల క్యూసెక్కుల మేర విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 264 టీఎంసీలు దాటింది. మరో 48 టీఎంసీలు వస్తే సాగర్ నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికల్లా ప్రాజెక్టు నిండనుందని, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 26,712 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జూరాల ప్రాజెక్టు వద్ద పర్యటకుల సందడి
-
నిండుకుండలా మారిన జూరాల ప్రాజెక్టు
-
జూరాల, శ్రీశైలానికి భారీ ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: గత నాలుగు రోజులుగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల పరిధిలో కొనసాగుతున్న వర్షాలకు తోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్కు విడుదల చేస్తుండగా అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కులు వస్తుండగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో అక్కడ నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 41.11 టీఎంసీలకు చేరింది. ఇక ఇక్కడి నుంచి 7 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్లోకి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అక్కడ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నిల్వ 169.71 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. -
జూరాల ప్రాజెక్ట్ వంతెన పై రాకపోకలు నిషేధం
-
Photo Feature: కమ్మేసిన మబ్బులు.. కుమ్మేసిన వాన
తొలకరి జల్లులతో హైదరాబాద్ నగరం పులకించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడింది. భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు లాక్డౌన్ సమయం పెంచడంతో హైదరాబాద్ రహదారులపై సందడి పెరిగింది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. -
జురాలకు పోటెత్తిన వరద నీరు
సాక్షి, మహబూబ్నగర్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగు కురుస్తున భారీ వర్షాలకు జురాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 50 గేట్లను అధికారులు ఎత్తి వేశారు. దీంతో కృష్ణానది నీరు పరవళ్ళు తొక్కుతుంది. కృష్ణానదికి ఇన్ ఫ్లో 5లక్షల 5వేల క్యూసెక్కులు కాగా.. దిగువున 5 లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.73 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9: 657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.08 టీఎంసీలుగా ఉంది. (చదవండి: భారీ వరదలు: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం) దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుండటంతో సమీప మండలంలోని వాసునగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అధికారులు నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తంగిడి వద్ద కృష్ణ బీమా నదుల సంగమం వద్ద ఉన్న భీమేశ్వర ఆలయం చుట్టూ నీళ్లు నిలవడంతో అధికారులు కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం) -
గాలికొదిలేసిన కరోనా నిబంధనలు
సాక్షి, అమరచింత (కొత్తకోట): కరోనా నేపథ్యంలో ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం పాటిస్తూ మస్క్లు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఓ వైపు అవగాహన కలి్పస్తున్నా.. మరోవైపు కోవిడ్ నిబంధనలు.. భౌతికదూరం పాటింపును గాలికొదిలేస్తున్నారు మరికొందరు. గుంపులు గుంపులుగా ఒకేచోట చేరడం.. మాస్్కలు ధరించకపోవడంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూరాల ప్రాజెక్టు వద్ద 29 క్రస్టుగేట్లు తెరిచి వరద జలాలను దిగువకు వదులుతుండగా ఆ దృశ్యాలను చూసేందుకు ఆదివారం జిల్లాతోపాటు హైద్రాబాద్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుండి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు పరిసరాలు ఎటు చూసినా.. జనసందోహం నెలకొంది. వందలాదిగా వాహనాలు ప్రాజెక్టు రహదారిపైకి రావడంతో ట్రాఫిక్జాం అయ్యింది. రెండు కిలోమీటర్ల పొడవున వాహనరాకపోకలకు అంతరాయం కల్గడంతో వాహనదారులు దాదాపు మూడు గంటల పాటు వాహనాల్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. దేవరకద్ర పోలీసులు సమీపంలోనే బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలకు అక్కడే నిలిపి కొందరు కాలినడకన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పిల్లలు, పెద్దలు, యువతి యువకులు సెలీ్ఫలు దిగుతూ ఆనందంగా కనిపించారు. చేపలు పట్టిన ఎమ్మెల్యే.. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బండర్పల్లి చెక్డ్యామ్ వద్ద ఆదివారం కొద్ది సేపు గాలం వేసి చేపలు పడుతూ ఆనందించారు. చెక్డ్యామ్ నిండుగా ఉండడం అలుగు పారడంతో చేపలు నీటిలో ఎదురెక్కడంతో పలువురు గాలాలు వేసి చేపలు పట్టడం కనిపించింది. బండర్పల్లి వద్ద గాలంతో చేపను పట్టిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కనిపించని కరోనా భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలను విధిస్తున్న ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను పాటించలేక పోతున్నారు. భౌతిక దూరం, మాసు్కలను ధరించాలని చెబుతున్నా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న పర్యాటకులు మాత్రం వీటిని పాటించలేక పోతున్నారు. ప్రాజెక్టు దిగువ భాగాన క్రస్టుగేట్ల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. పర్యాటకులు మాత్రం సెల్ఫీల మోజులో పారుతున్న నీటిలో నిల్చోవడం, జలకాలాడడం, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. తేడా వస్తే ప్రవాహంలో కొట్టుకుపోతామన్న భయం కూడా కలగకపోవడం దిగువ జూరాల వద్ద ప్రాజెక్టు అధికారులు గాని పోలీసు సిబ్బందిగాని హెచ్చరిక బోర్డులతో పాటు సిబ్బందిని నియమించక పోవడంతో పర్యాటకులు పారే నీటిలో ఆటలాడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక మద్యం విక్రయాలు కూడా చేపవంటకాల దుకాణాల వద్ద జోరుగా కొనసాగుతున్న సంబందిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా, కోవిడ్ దృష్ట్యా పర్యాటకులు జూరాల ప్రాజెక్టు వద్దకు రావద్దని సూచించామని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య, ప్రాజెక్టు ఈఈ పార్థసారథి పేర్కొన్నారు. అందరు సహకరించాలని కోరారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement