-
అమెజాన్లో మొబైల్స్పై అదిరిపోయే ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు దసరా పండుగ పురస్కరించుకుని మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా శామ్సంగ్, ఆపిల్, వన్ప్లస్, ఎంఐ, రెడ్ మీ మొబైల్స్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. తాజాగా మొబైల్ ఆఫర్లకు సంబంధించి అమెజాన్ టీజ్ చేసింది. 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ రూ.40 వేలలోపు ధరకే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ తన అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ.70,499 నుంచి రూ.36,999కు తగ్గించారు. అలాగే, దీంతోపాటు వన్ప్లస్ 9 నార్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.28,499 నుంచి ప్రారంభం కానుంది. వన్ప్లస్ 9 ఆర్ 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపును అందించారు. రూ.36,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐకూ జెడ్3 రూ.15,490 నుంచి ప్రారంభం కానుంది. రెడ్మీ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7,920కు తగ్గనుంది. రెడ్మీ నోట్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,990కు తగ్గనుంది. ఇంకా వన్ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో లభించే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్ సేల్లో దాదాపు అమెజాన్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లపై అయితే తగ్గింపు లేదా బ్యాంకు ఆఫర్లు వర్తించనున్నాయి. దీంతోపాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటే మరిన్ని ఆఫర్లు అందించనున్నాయి. (చదవండి: భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే!) -
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఐఫోన్ 11పై ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తరువాత వినియోగదారుల షాపింగ్ అనుభవ కోసం తహ తహలాడుతున్న సమయంలో ఫెస్టివ్ సీజన్ ముంచుకొస్తోంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎప్పటిలాగానే ఈకామర్స్ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అమెజాన్ "గ్రేట్ ఇండియన్ సేల్ '' ద్వారా డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ప్రధానంగా ఈ సేల్ లో ఆపిల్ ఐఫోన్ 11 కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే దీన్ని అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఈ నెల 17వ తేదీన ప్రారంభంకానుంది. ప్రైమ్ మెంబర్లకు అక్టోబరు 16 నుంచే ఈ స్పెషల్ సేల్ అందుబాటులో ఉంటుంది. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు) అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 11 ను సుమారు 50 వేల రూపాయల కంటే తక్కువకే అందించనుంది. ప్రస్తుతం భారతదేశంలోఐఫోన్ 11 ధర 68,300. ఈ సేల్ లో దీని ఖచ్చితమైన ధరను బ్యానర్ వెల్లడించలేదు. కానీ “ఇప్పటివరకు అతి తక్కువ ధర వద్ద అత్యంత శక్తివంతమైన ఐఫోన్,” అని అమెజాన్ టీజ్ చేసింది. దీంతో ఐఫోన్ 1164 జీబీ వేరియంట్ ధర గణనీయంగా తగ్గనుందని అంచనా. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్బ్యాక్ / తక్షణ డిస్కౌంట్ ఆఫర్ను దీనికి అదనంగా అందించనుంది. 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా ఎల్సిడి ప్యానెల్, డాల్బీ అట్మోస్ , ఏ13 బయోనిక్ చిప్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్ డబుల్ కెమెరా, ఫేస్ ఐడితో 12 ఎంనఅ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా 3,190 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 11 ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్: ఆఫర్లివే!
అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా అమెజాన్ ఆఫర్ చేయనున్న డిస్కౌంట్లు రివీల్ అయ్యాయి. పలు బ్రాండ్లపై డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు అదనపు క్యాష్బ్యాక్లను అందించనున్నట్టు అమెజాన్ చెప్పింది. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్పై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ బ్రాండ్లపైనా గ్రేట్ ఇండియన్ సేల్లో డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది ఈ కంపెనీ. ఉదాహరణకు వన్ ప్లస్ స్మార్ట్ఫోన్లపై 2000 రూపాయల వరకు, ఎంపికచేసిన మోటోరోలా మొబైల్ ఫోన్లపై 5000 రూపాయల వరకు, ఆపిల్ స్మార్ట్ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేయనుంది. ఎల్జీ జీ6 స్మార్ట్ఫోన్పై 31 శాతం వరకు డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఈ ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 19,470 రూపాయల వరకు తగ్గింపు ఇవ్వనుంది. అసలు ఈ ఫోన్ ధర రూ.55వేలు. అదేవిధంగా వన్ ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్ను రూ.2000 డిస్కౌంట్తో రూ.27,999కి విక్రయానికి ఉంచనుందట. పాత డివైజ్తో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందని తెలిసింది. ఐఫోన్ ఎస్ఈ 64జీబీ స్టోరేజ్ వేరియంట్పై ఏకంగా 43 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ఆఫర్ చేస్తుంది. 49,999 రూపాయలు గల ఈ ఫోన్ను 27,999 రూపాయలకే విక్రయిస్తుంది. ఎక్స్చేంజ్లో మరో 19,470 రూపాయల వరకు తగ్గింపు వస్తుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement