-
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
బంగ్లాదేశ్తో ఆదివారం సిల్హెట్లో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యస్తిక భాటియా (36; 6 ఫోర్లు), కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (30; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (3/18), పూజ వస్త్రకర్ (2/25) బంగ్లాదేశ్ను కట్టడి చేశారు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది. -
నేడు పాక్, కివీస్ తొలి టి20
రావల్పిండి: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో పాకిస్తాన్ ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో పోటీపడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో బ్రేస్వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో బాబర్ ఆజమ్ సారంథ్యంలోని పాకిస్తాన్ జట్టు తలపడు తుంది. తొలి మూడు మ్యాచ్లు రావల్పిండిలో, చివరి రెండు మ్యాచ్లు లాహోర్లో జరుగుతాయి. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్లను ఫ్యాన్కోడ్ యాప్లో తిలకించవచ్చు. -
చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పించిన శ్రీలంక బౌలర్.. ఏకంగా 36 బంతులు
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్లో 2 నో బాల్లు, 3 వైడ్లు.. మూడో ఓవర్లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు. -
ఆసీస్ను గెలిపించిన టిమ్ డేవిడ్
వెల్లింగ్టన్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్లో టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్లు) కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్ ఆఖరి బంతికి హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది. ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన సౌతీ వైడ్ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్ 6, 2, 4లతో ఆసీస్ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్లో జరుగుతుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
వందో మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్దే
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తొలి వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్డార్ఫ్, మ్యాక్స్వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్లో జరుగనుంది. -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
పాకిస్తాన్తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్కు భారీ షాక్
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్కు పెద్ద లోటు. సాంట్నర్ను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్టైమ్ టీ20 జట్టు కెప్టెన్గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్మ్యాన్ కెప్టెన్గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
IND Vs AFG, 1st T20I: కుర్రాళ్లు గెలిపించారు
విరాట్ కోహ్లి ఆడలేదు... రోహిత్ శర్మ విఫలమయ్యాడు... అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా... చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్లో శివమ్ దూబే మెరుపులు జట్టును సిరీస్లో ఆధిక్యంలో నిలిపాయి. అఫ్గాన్ ఆటగాళ్లు కొంత పోరాడినా... మంచు ప్రభావంతో పాటు ఒత్తిడిలో ఆ జట్టు చిత్తయింది. మొహాలి: అఫ్గానిస్తాన్తో టి20 సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, జితేశ్ శర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించాడు. నబీ మెరుపులు... అఫ్గాన్కు ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), గుర్బాజ్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 48 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 1 పరుగు వద్ద ఇబ్రహీమ్ ఇచ్చిన క్యాచ్ను దూబే వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరిని అవుట్ చేసి భారత్ పైచేయి సాధించింది. తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న రహ్మత్ షా (3) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నబీ, అజ్మతుల్లా (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యంతో అఫ్గాన్ కోలుకుంది. ముఖ్యంగా నబీ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్తో 16 పరుగులు రాగా... ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో నబీ 2 సిక్స్లు బాదాడు. నబీ, అజ్మతుల్లా నాలుగో వికెట్కు 43 బంతుల్లో 68 పరుగులు జత చేయగా... ముకేశ్ ఒకే ఓవర్లో వీరిని పెవిలియన్ పంపించాడు. చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ 6 ఫోర్లతో 28 పరుగులు రాబట్టింది. రోహిత్ డకౌట్... ఛేదనలో రెండో బంతికే భారత్కు అనూహ్య షాక్ తగిలింది. శుబ్మన్ గిల్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు)తో సమన్వయ లోపంతో కెపె్టన్ రోహిత్ శర్మ (0) రనౌట్గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా, గిల్ ఏమాత్రం స్పందించకుండా తన క్రీజ్లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ తన సహచరుడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) అక్షర్ 23; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) దూబే 25; అజ్మతుల్లా (బి) ముకేశ్ 29; రహ్మత్ (బి) అక్షర్ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్ 42; నజీబుల్లా (నాటౌట్) 19; కరీమ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–50, 2–50, 3–57, 4–125, 5–130. బౌలింగ్: అర్ష్దీప్ 4–1–28–0, ముకేశ్ 4–0–33–2, అక్షర్ 4–0–23–2, సుందర్ 3–0–27–0, దూబే 2–0–9–1, బిష్ణోయ్ 3–0–35–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 0; శుబ్మన్ గిల్ (స్టంప్డ్) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; తిలక్ (సి) గుల్బదిన్ (బి) అజ్మతుల్లా 26; శివమ్ దూబే (నాటౌట్) 60; జితేశ్ శర్మ (సి) ఇబ్రహీమ్ (బి) ముజీబ్ 31; రింకూ సింగ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–72, 4–117. బౌలింగ్: ఫారుఖీ 3–0–26–0, ముజీబ్ 4–1–21–2, మొహమ్మద్ నబీ 2–0–24–0, నవీన్ 3.3–0–43–0, అజ్మతుల్లా 4–0–33–1, గుల్బదిన్ 1–0–12–0. -
పంత్ ఒక్క కాలితో ఫిట్గా ఉన్నా టీ20 వరల్డ్కప్ ఆడాలి..!
టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్కప్లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్కప్లో కేఎల్ రాహుల్ కూడా వికెట్కీపింగ్ కమ్ బ్యాటింగ్కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో అయినా ఓపెనర్గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్కు ఒకరు చొప్పున పార్ట్టైమ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్కప్లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్ను కానీ ఇషాన్ కిషన్ను కాని వికెట్కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
భారత మహిళల విజయగర్జన
ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్తో ఆసీస్ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసీస్ జట్టు మళ్లీ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఫోబీ లిచ్ఫీల్డ్ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలైస్ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్ఫీల్డ్, పెరీ ఐదో వికెట్కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిటాస్ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్) మ్యాచ్ ముగించింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్ప్రీత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచింది. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బుధవారం వాంఖెడె మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. హీతెర్ నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఈ గెలుపుతో సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. రేణుక సింగ్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లీ, అలీస్ క్యాప్సీలను అవుట్ చేసింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్ను డానియల్ వైట్ (47 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 77; 13 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్కు 138 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓడిపోయింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 52; 9 ఫోర్లు), హర్మన్ప్రీత్ కౌర్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్స్టోన్ (3/15) భారత్ను కట్టడి చేసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా డంక్లీ (బి) రేణుక సింగ్ 1; డానియల్ వైట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సైకా ఇషాక్ 75; అలీస్ క్యాప్సీ (బి) రేణుక సింగ్ 0; నాట్ సివర్ బ్రంట్ (సి) రిచా ఘోష్ (బి) రేణుక సింగ్ 77; హీతెర్ నైట్ (బి) శ్రేయాంక పాటిల్ 6; అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక పాటిల్ 23; ఫ్రెయా కెంప్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–140, 4–165, 5–177, 6–197. బౌలింగ్: రేణుక 4–0–27–3, పూజ 4–0–44–0, సైకా ఇషాక్ 4–0–38–1, దీప్తి శర్మ 3–0–28–0, శ్రేయాంక 4–0–44–2, కనిక అహుజా 1–0–12–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) సారా గ్లెన్ (బి) సోఫీ ఎకిల్స్టోన్ 52; స్మృతి మంధాన (బి) నాట్ సివర్ బ్రంట్ 6; జెమీమా రోడ్రిగ్స్ (సి) అమీ జోన్స్ (బి) ఫ్రెయా కెంప్ 4; హర్మన్ప్రీత్ కౌర్ (బి) సోఫీ ఎకిల్స్టోన్ 26; రిచా ఘోష్ (సి) అలీస్ క్యాప్సీ (బి) సారా గ్లెన్ 21; కనిక అహుజా (సి) నాట్ సివర్ బ్రంట్ (బి) సోఫీ ఎకిల్స్టోన్ 15; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; దీప్తి శర్మ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–20, 2–41, 3–82, 4–122, 5–134, 6–151. బౌలింగ్: మహికా గౌర్ 2–0–18–0, లారెన్ బెల్ 4–0–35–0, నాట్ సివర్ బ్రంట్ 4–0–35–1, ఫ్రెయా కెంప్ 2–0–30–1, సోఫీ ఎకిల్స్టోన్ 4–0–15–3, సారా గ్లెన్ 4–0–25–1. -
టీ20ల్లో అత్యుత్తమ ఛేజింగ్.. రోహిత్ను దాటేసిన సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓ అత్యుత్తమ రికార్డు సాధించింది. నిన్నటి మ్యాచ్లో ఆసీస్పై విజయం సాధించిన భారత్.. పొట్టి ఫార్మాట్లో తమ అత్యుత్తమ రన్ ఛేజింగ్ రికార్డును మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్.. ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. ఈ మ్యాచ్కు ముందు టీ20ల్లో భారత్ అత్యుత్తమ ఛేజింగ్ రికార్డు 208 పరుగులుగా ఉండింది. హైదరాబాద్ వేదికగా 2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. టీ20ల్లో భారత్ అన్ని దేశాల కంటే అధికంగా ఐదు సార్లు 200 ప్లస్ స్కోర్లను ఛేదించింది. భారత్ పొట్టి ఫార్మాట్లో 209, 208, 207, 204, 202 పరుగులకు విజయవంతంగా ఛేదించింది. భారత్ తర్వాత సౌతాఫ్రికా (4), పాకిస్తాన్ (3), ఆస్ట్రేలియా (3) అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లను ఛేదించాయి. రోహిత్ను దాటేసిన సూర్యకుమార్.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో తొలి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న స్కై.. తన 54 మ్యాచ్ల టీ20 కెరీర్లో 13 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (115 మ్యాచ్ల్లో 15) టాప్లో ఉండగా.. రోహిత్ శర్మ (148 మ్యాచ్ల్లో 12) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. T20 format is so easy for Suryakumar Yadav. 🔥pic.twitter.com/8XcKGl6MO6 — Johns. (@CricCrazyJohns) November 23, 2023 బ్యాటింగ్ ఆర్డర్లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాప్లో ఉన్నాడు. మోర్గాన్ 107 ఇన్నింగ్స్ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్ కోహ్లి (98 ఇన్నింగ్స్ల్లో 106 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (98 ఇన్నింగ్స్ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా స్కై తన 51 ఇన్నింగ్స్ల టీ20 కెరీర్లో 108 సిక్సర్లు బాదాడు. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన రింకూ.. మ్యాచ్ గెలిచాం, కానీ..!
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించింది. సీన్ అబాట్ బౌలింగ్లో రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే రింకూ ఈ సిక్సర్ కొట్టినందుకు టీమిండియా గెలవలేదు. భారత్ గెలుపుకు ఆఖరి బంతికి సింగిల్ అవసరం కాగా.. అబాట్ నో బాల్ వేశాడు. అంపైర్లు రింకూ సిక్సర్ను పరిగణలోకి తీసుకోకుండా నో బాల్ ద్వారా లభించిన పరుగుతోనే టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో రింకూ సింగ్ సిక్సర్ వృధా అయ్యింది. The Finisher Rinku Singh is here to rule for India. 💪🫡pic.twitter.com/p3TtZOm7iC — Johns. (@CricCrazyJohns) November 23, 2023 కాగా, ఛేదనలో అప్పటిదాకా సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం ఆఖరి ఓవర్లో కీలక మలుపులు తిరిగింది. చివరి ఓవర్లో భారత్ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్ తొలి బంతికే బౌండరీ బాది భారత్ను గెలుపు వాకిటికి చేర్చాడు. అనంతరం రెండో బంతికి బైస్ రూపంలో మరో పరుగు వచ్చింది. దీంతో భారత్ గెలుపుకు మరింత చేరువగా వెళ్లింది. ఇక భారత్ గెలవాలంటే 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయాలి. ఇక్కడే మ్యాచ్ మలుపులు తిరిగింది. మూడు (అక్షర్ క్యాచ్ ఔట్), నాలుగు (బిష్ణోయ్ రనౌట్), ఐదు బంతులకు (అర్షదీప్) భారత్ వికెట్లు కోల్పోయింది. ఐదో బంతికి అర్షదీప్ రెండో పరుగుకు వెళ్తూ రనౌటయ్యాడు. దీంతో భారత్ గెలవాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. స్ట్రయిక్లో ఉన్న రింకూ సింగ్ అబాట్ వేసిన బంతిని సిక్సర్గా మలిచాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా రింకూ సిక్సర్ కారణంగానే భారత్ గెలిచినందని అనున్నారు. కానీ, అబాట్ ఆఖరి బంతి క్రీజ్ దాటి బౌలింగ్ చేయడంతో భారత్ ఖాతాలోని పరుగు చేరి శ్రమ లేకుండానే టీమిండియాకు విజయం దక్కింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
బాగానే ఆడాం.. గెలుస్తామని అనుకున్నాం.. కానీ అతను అలా..!: ఆసీస్ కెప్టెన్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆసీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి భారత్ను గెలిపించారు. చివరి ఓవర్లో భారత్ 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించినప్పటికీ.. రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. అంతకుముందు జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్గా మంచి మ్యాచ్. ఇంగ్లిస్ మాకు మంచి స్కోర్ అందించాడు. డిఫెండ్ చేసుకోగలమని భావించాం. కానీ సూర్యకుమార్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. మ్యాచ్ గెలిచేందుకు ఆఖరి ఓవర్లోనూ అవకాశం వచ్చింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది ఖేల్ ఖతం చేశాడు. యువ భారత ఆటగాళ్లకు ఐపీఎల్తో పాటు స్థానిక దేశవాలీ టీ20లు ఆడటం బాగా కలిసొచ్చింది. మా వరకు మేము బౌలింగ్ బాగానే చేశాం. అయితే యార్కర్లు సంధించడంలో విఫలమయ్యాం. ఈ గేమ్ నుండి చాలా పాజిటివ్లు తీసుకోవాలి. ఇంగ్లిస్ క్లాసీ బ్యాటింగ్. 19వ ఓవర్లో ఇల్లిస్ కట్టుదిట్టమైన బౌలింగ్. మొత్తంగా మా వైపు నుంచి అద్బుత ప్రదర్శన చేశాం. కానీ, టీమిండియా ఆటగాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి మాపై పైచేయి సాధించారు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరి బంతి వరకు మ్యాచ్ను తీసుకెళ్లామంటే మా ప్రదర్శన బాగానే ఉన్నట్లు అనుకుంటున్నామని వేడ్ అన్నాడు. -
కెప్టెన్సీని డ్రెస్సింగ్ రూమ్లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్గా వచ్చిన స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి ముకేశ్ కుమార్ (4-0-29-0), అక్షర్ పటేల్ (4-0-32-0) మినహా భారత బౌలర్లంతా కుదేలయ్యారు. ప్రసిద్ద్, రవి బిష్ణోయ్కు తలో వికెట్ దక్కింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. స్కై ఔటయ్యాక ఆఖర్లో టీమిండియా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనినపించింది. అయితే రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. భారత్ గెలుపుకు చివరి బంతికి సింగిల్ అవసరం కాగా సీన్ అబాట్ నో బాల్ వేసి భారత గెలుపును లాంఛనం చేశాడు. దీంతో రింకూ సిక్సర్తో సంబంధం లేకుండానే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్సర్ గణాంకాల్లో కూడా కలవలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం స్కై మాట్లాడుతూ.. ఈ రోజు మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఓ దశలో ఒత్తిడికి గురయ్యాము. కానీ మా ఆటగాళ్లు దాన్ని అధిగమించి సత్తా చాటారు. టీమిండియా కెప్టెన్గా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మ్యాచ్ సమయంలో మంచు కురుస్తుందని భావించాము. కానీ అలా జరగలేదు. మైదానం చిన్నది కావడంతో ఛేదనలో బ్యాటింగ్ సులభం అవుతుందని తెలుసు. వారు 230-235 సాధించవచ్చని భావించాం. కానీ ఆఖర్లో మా బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారు. బ్యాటింగ్ను ఎంజాయ్ చేయమని ఇషాన్కు చెప్పాను. అందుకే అతను ఫ్రీగా షాట్లు ఆడగలిగాడు. కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్లో వదిలేసి బరిలోకి దిగాను. అందుకే బ్యాటింగ్ను ఆస్వాదించగలిగాను. ఆఖరి బంతికి రింకూ సిక్సర్ కొట్టడంపై స్పందిస్తూ.. అతడి కొరకే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నట్లుగా అనిపించింది. అతను ప్రశాంతంగా ఉండటమే కాకుండా నన్ను కూడా శాంతింపజేశాడు. ఇక్కడి (విశాఖ) వాతావరణం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నాడు. -
టీమిండియా శుభారంభం.. తొలి టీ20లో ఆసీస్పై విజయం
సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లో సూర్యకుమార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్గా వచ్చిన స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్కు 130 పరుగులు జోడించారు. ఇన్గ్లిస్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా ఆరోన్ ఫించ్ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్ అబాట్ వేసిన బంతిని రింకూ సింగ్ సిక్సర్గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్ సిక్స్ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. సిరీస్లోని రెండో టి20 మ్యాచ్ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది. సూర్య, ఇషాన్ ధనాధన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్ జత కలిశారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి డీప్ ఎక్స్ట్రా కవర్లో షార్ట్ చేతికి చిక్కడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్కు 40 పరుగులు జోడించడంతో భారత్ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ డ్రామా... 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్ వరుసగా మూడు బంతుల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ వికెట్లను కోల్పోయింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్దీప్ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్ ఓవర్’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. అయితే అబాట్ బంతి నోబాల్ అని తేలడంతో రింకూ సిక్స్ షాట్ను పరిగణనలోకి తీసుకోలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) 52; మాథ్యూ షార్ట్ (బి) రవి బిష్ణోయ్ 13; జోష్ ఇన్గ్లిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 110; స్టొయినిస్ (నాటౌట్) 7; టిమ్ డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్: అర్ష్దీప్ సింగ్ 4–0–41–0, ప్రసిధ్ కృష్ణ 4–0–50–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రవి బిష్ణోయ్ 4–0–54–1, ముకేశ్ కుమార్ 4–0–29–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్మిత్ (బి) షార్ట్ 21; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 0; ఇషాన్ కిషన్ (సి) షార్ట్ (బి) తన్వీర్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) ఆరన్ హార్డి (బి) బెహ్రన్డార్ఫ్ 80; తిలక్ వర్మ (సి) స్టొయినిస్ (బి) తన్వీర్ సంఘా 12; రింకూ సింగ్ (నాటౌట్) 22; అక్షర్ పటేల్ (సి అండ్ బి) సీన్ అబాట్ 2; రవి బిష్ణోయ్ (రనౌట్) 0; అర్ష్దీప్ సింగ్ (రనౌట్) 0; ముకేశ్ కుమార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్: స్టొయినిస్ 3–0–36–0, బెహ్రన్డార్ఫ్ 4–1–25–1, షార్ట్ 1–0–13–1, సీన్ అబాట్ 3.5–0–43–1, నాథన్ ఎలిస్ 4–0–44–0, తన్వీర్ సంఘా 4–0–47–2. -
ఆసీస్తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆసీస్పై గెలిచి వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్ ఆసీస్ కెప్టెన్గా బరిలో ఉంటాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్ సైతం పలువురు రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్కప్ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. వరల్డ్కప్ హీరోలు ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఆసీస్ మేనేజ్మెంట్ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్ ఇన్నింగ్స్ను మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రన్డార్ఫ్, తన్వీర్ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్ కిషన్తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్డౌన్లో తిలక్ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్ బదులు రుతురాజ్, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. -
భారత్-ఆసీస్ తొలి టీ20.. వైజాగ్లో వాతావరణ పరిస్థితి ఏంటి..?
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వైజాగ్లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్ టీ20లో ఆసీస్ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్లో మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్కు మ్యాక్స్వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం. తుది జట్లు (అంచనా).. భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్డార్ఫ్, తన్విర్ సంఘా. -
IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆసీస్పై గెలిచి వరల్డ్కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్గా ఉంది. మనదే పైచేయి.. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్లు ఆడగా భారత్ 6 మ్యాచ్ల్లో గెలిచి, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విశాఖలోనూ మనోళ్లే..! విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది. -
నిస్వార్ధంగా, నిర్భయంగా ఆడండి.. వ్యక్తిగత మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదు..!
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 ముందు టీమిండియా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను వరల్డ్కప్ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరమని అన్నాడు. వరల్డ్కప్లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని తెలిపాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నాడు. పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నామన్నాడు. వరల్డ్కప్లో రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హిట్మ్యాన్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. రోహిత్ లాగే తాను కూడా జట్టుకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని వివరించాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు. సిరీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా ఈ సిరీస్ చాలా కీలకమని తెలిపాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడమని సభ్యులతో చెప్పానని అన్నాడు. ఇటీవలికాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్లో వారు అదే చేశారని తెలిపాడు. కాగా, వైజాగ్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి ట20 జరుగనున్న విషయం తెలిసిందే. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్డార్ఫ్, తన్విర్ సంఘా.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ ట్వీట్.. బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ అంటూ..
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement