-
ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..
-
Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు. -
ఆ పథకాల నిధుల విడుదలకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: లబ్దిదారులకు వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినివ్వకపోవడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరు నగరానికి చెందిన కె. వెంకటదుర్గాదేవి, జె. రత్నకుమారి దాఖలు చేశారు. ఆసరా కింద వెంటనే నిధుల విడుదలకు ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు.అలాగే, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఈసీ అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి. శివపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ లంచ్మోషన్ రూపంలో బుధవారం అత్యవసరంగా విచారణ జరిపారు. నిధుల పంపిణీ ఆవశ్యకతపై వినతిపత్రాలిచ్చాం.. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాల కింద నిధుల పంపిణీకి ఈసీ అనుమతిని నిరాకరించిందన్నారు. లబి్ధదారుల గుర్తింపు ఎప్పుడో పూర్తయిందని, నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈ రెండు పథకాలు కొత్తవి కావని, నాలుగేళ్లుగా అమలవుతున్నాయని చెప్పారు. నిధుల పంపిణీకి బ్రేక్వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల పంపిణీ అత్యవసరాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇచ్చిందన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గురువారం ఉదయం కోర్టు ముందుంచేలా ఈసీని ఆదేశించాలని ఆయన కోరారు. మీ నిర్ణయాన్ని మా ముందుంచండి.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా పథకాల కింద లబి్ధదారులకు నిధుల పంపిణీ విషయంలో అత్యవసరాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకుని, దానిని ప్రొసీడింగ్స్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. చేయూత, విద్యాదీవెన నిధుల పంపిణీ నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యాలతో తాజా వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మహిళలు ఇబ్బంది పడతారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నాలుగు విడతల్లో నిధులను విడుదల చేస్తుందన్నారు. ఈ పథకం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ నాలుగేళ్లలో రూ.25,570 కోట్ల మేర లబ్దిపొందారన్నారు. ఇప్పటికే మూడు విడతల కింద రూ.4,551 కోట్ల మేర నిధులు పంపిణీ చేశామని, నాల్గవ విడత కింద రూ.1,843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించిందన్నారు. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద రూ.15వేల ఆర్థికసాయం అందిస్తోందన్నారు. మూడు విడతలుగా ఈ మొత్తం చెల్లించారని.. ఇప్పడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే, ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీకి కూడా ఈసీ అనుమతిని నిరాకరించిందని తెలిపారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలకు అప్పులుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యంచేసుకుని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని కోరారు. -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు వేద్దాం ఇలా.!
మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటు వేయడానికి అమల్లో ఉన్న పద్ధతులేంటీ? అన్న విషయాలు తెలుసుకుందాం.ఓటరు జాబితాలో పేరుందా?మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం మీ పేరు ఓటరు జాబితాలో ఉందా? ఎన్నికల సంఘం వెబ్సైట్లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్తో చెక్ చేసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వెబ్సైట్లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చుఎపిక్ డౌన్లోడ్ చేసుకోండిఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) ఉండడం మంచిది. మీ పేరు జాబితాలో ఉంటే మీ ఎపిక్ను మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://voterportal.eci.gov.in/login వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయగానే డౌన్లోడ్ అప్షన్ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు.ఎపిక్లో లోపాలుంటే... ఇక కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు లేదు. ఎపిక్ వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.♦ ఆధార్కార్డు ♦ ఉపాధి హామీ కార్డు♦ జాబ్ కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్♦ పాన్కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)పోలింగ్ స్లిప్పులుపోలింగ్కు కొన్ని రోజుల ముందే పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేస్తారు. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరు. కానీ ఇందులో.. పార్ట్ నెంబర్, ఓటరు సీరియల్ నెంబరు ఉంటాయి. ఈ వివరాలతో ఓటరు జాబితాలో మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదున్నా.. మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి పోలింగ్ స్లిప్పు ఉంటే మీ పని చాలా సులభం.పోలింగ్ బూత్లో మీ ఓటు ఎలా వేసుకోవాలంటే.?పోలింగ్ బూత్లోకి వెళ్లగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి. లేదా మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు చెప్పండి.ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారువివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు.మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్లడానికి అనుమతిస్తారు.ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది.(మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ VVPAT)ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క.... వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు... వీటి పక్కన్నే నీలి రంగు బటన్ ఉంటాయి.మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క.బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు చిన్న శబ్ధం వినిపిస్తుంది.ఆ వెంటనే VVPAT మెషీన్పై పచ్చటి లైట్ వెలుగుతుంది.VVPATపై ఉండే స్క్రీన్పై చూస్తే... మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది.ఏడు సెకన్ల తరువాత ఈ స్లిప్ కాస్తా బాక్స్లోకి పడిపోతుంది.ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్ బూత్లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి.మీ ఓటు గురించి మీకు ఎలాంటి అనుమానాలున్నా.. మాకు ఈ మెయిల్ రాయగలరు. info@sakshi.com మీ సందేహాలకు సంబంధించి ఎన్నికల అధికారులతో మాట్లాడి సమాధానం ఇవ్వగలం. -
ఓటు హైజాక్ అయ్యిందా? సవాలు చేయండి..
మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? ఏం ఫర్వాలేదు. నేనే అసలైన ఓటరును అని సవాలు చేయండి. టెండర్ ఓటేయవచ్చు!ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.ఈ ఫారంలోని 5వ కాలమ్లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రెండు రూపాయలు చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేతే...పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ... విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. -
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. -
ఈసీ నిర్ణయాన్ని రద్దుచేయండి
సాక్షి, అమరావతి : రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు విద్యాదీవెన, మహిళలకు వైఎస్సార్ ‘చేయూత’ నిధులను పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత నిధుల పంపిణీని వాయిదా వేయాలంటూ ఈసీ ఈ నెల 4న జారీచేసిన లేఖను రద్దుచేయాలని కోరుతూ అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విద్యాదీవెన కింద రూ.610.79 కోట్ల నిధులను తక్షణమే పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గుంటూరు, అడవి తక్కెళ్లపాడుకు చెందిన బంకా అరుణ్, పల్నాడు, గుడిపాడుకు చెందిన పఠాన్ సూరజ్లు ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే, ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.847.22 కోట్లనూ పంపిణీ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 30న జారీచేసిన లేఖను సైతం రద్దుచేసి, తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ నిధులను పంపిణీ చేసేందుకు ఆదేశాలివ్వాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన యల్లక్కగారి నారాయణ, గాజుల శ్రీనివాసులు మరో వ్యాజ్యం దాఖలు చేశారు.అంతేకాక.. ‘చేయూత’ నిధులనూ పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ గుంటూరు, భారత్పేటకు చెందిన గృహిణి కె. శాంతకుమారి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మూడింటిపై అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో విచారణ జరపాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, న్యాయవాది వీఆర్ రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ను కోరారు. ఈ అభ్యర్థనను మన్నించిన న్యాయమూర్తి విచారణకు అంగీకరించారు. అనంతరం మ.3 గంటలకు విచారణ చేపట్టారు.ప్రభుత్వ వినతిని పరిశీలిస్తాం..ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్కు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం కింద నిధుల పంపిణీని ఎందుకు ఆపామో కారణాలను కూడా తెలియజేశామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధుల పంపిణీ విషయంలో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎందుకు ఆగలేరో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమకు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిశీలించి తగిన నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టుకు వివరించారు. అవసరమైతే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని తెలిపారు. ఇలా.. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, అవినాష్ చెప్పిన వివరాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమర్పించే వినతిపై తీసుకున్న నిర్ణయాన్ని తగిన ప్రొసీడింగ్స్ ద్వారా కోర్టు ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారం 9వ తేదీ ఉ.10.30కు వాయిదా వేస్తూ జస్టిస్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. విద్యాదీవెనకూ బ్రేక్.. విద్యార్థులు అప్పులబాటఇక ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఇస్తోందని సీవీ మోహన్రెడ్డి వివరించారు. యువతను విద్యాపరంగా ప్రోత్సహించి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలన్న ఉద్దేశంతో 2019లో ప్రభుత్వం ఈ విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీని కింద మార్చి 1 నాటికి రూ.708 కోట్లను విద్యార్థులు, వారి తల్లుల జాయింట్ అకౌంట్లలో జమచేయాల్సి ఉందన్నారు. అక్టోబర్, నవంబరు, డిసెంబరు నెలలకు ఈనిధులను చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో కేవలం 97.89 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని.. మిగిలిన 610.79 కోట్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించిందన్నారు. విద్యాదీవెన నిధులపై ఆధారపడి చదువుకునే విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని మోహన్రెడ్డి వివరించారు. సకాలంలో నిధులు అందకపోతే చదువును కొనసాగించేందుకు విద్యార్థులు అప్పులుచేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని నిలిపివేసిన నిధులను తక్షణమే పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. అలాగే.. వైఎస్సార్ చేయూత పథకం కింద నిధుల పంపిణీని కూడా ఈసీ నిలిపేసిన విషయాన్ని మరో న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోడ్ అమల్లోకి రావడానికి ముందునుంచే ఈ పథకం అమలవుతోందన్నారు. ఈసీ నిర్ణయంతో ఎందరో మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.కొత్త పథకాలకే కోడ్ వర్తిస్తుంది..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన కొత్త పథకాలు కావని, ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలుచేస్తున్నవేనన్నారు. కరువు మండలాల గుర్తింపు, లబ్ధిదారుల గుర్తింపు ఎప్పుడో జరిగిందన్నారు. మొత్తం 6.95 లక్షల మంది రైతులను గుర్తించామని, అందుకు అవసరమైన మొత్తాలను సైతం సిద్ధంచేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఈ పథకాల కింద లబ్ధిదారులకు నిధుల పంపిణీ ఎంత అవసరమో వివరిస్తూ ఈసీకి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. సాధారణంగా కొత్త పథకాలకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్ సరఫరాను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకుందని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఆ పథకం కొత్త పథకం కాదని, అప్పటికే కొనసాగుతున్న పథకమని హైకోర్టు గుర్తుచేసిందని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదుపిటిషనర్ల తరఫున మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రకృతి విపత్తుల కారణంగా పంట కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీవల్ల రైతులు కోలుకుని తిరిగి వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఆస్కారం కల్పిస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అందులో భాగంగానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తోందన్నారు. నిజానికి.. 2023 ఖరీఫ్లో కరువువల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.847.22 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్క్రీనింగ్ కమిటీ ఇన్పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ కోసం ఈసీ అనుమతి కోరిందన్నారు. కానీ, అందుకు ఈసీ అనుమతిని నిరాకరిస్తూ ఈనెల 30న లేఖ జారీచేసిందన్నారు. నిధుల పంపిణీని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపిందన్నారు. రానున్న సీజన్కు విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేసుకోవాల్సి ఉంటుందని.. అందువల్ల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో ఏదైనా జాప్యం జరిగితే అది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీవీ మోహన్రెడ్డి వివరించారు. వర్షాలకు ముందే పంట భూములను సిద్ధంచేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిని మధ్యలో ఇలా ఆపేయడంవల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఎన్నికల కమిషన్ ఆలోచించలేదన్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్న వారు తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
లోక్సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశారు.మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు. మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్సభ పోలింగ్కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్న్సీపీ (శరద్ పవార్) ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు. -
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
సాక్షి,హైదరాబాద్: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. -
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
సాక్షి, విజయవాడ: పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్రకు తెరలేపాడు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలైన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ను అడ్డుకుంటూ, లబ్దిదారులకు డబ్బులు చేరకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది.తాజాగా ఇప్పటి వరకు కొనసాగుతున్న డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్ధులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించనుంది. -
డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తా సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 1992వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ కలిగిన అధికారుల పేర్లను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ద్వారకా తిరుమలరావు, హరీష్కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను సీఎస్ పంపించగా.. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నిక సంఘం హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. కాగా, అనంతపురం డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే... జాంగీపూర్ (పశి్చమ బెంగాల్) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్కు టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్) ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్) ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.మాధేపుర (బిహార్) మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.అరారియా (బిహార్) బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.గువాహటి (అసోం) ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు. డుబ్రి (అసోం) ఈ లోక్సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. రాయ్గఢ్ (ఛత్తీస్గఢ్) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్గఢ్ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్కుమార్గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. -
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదివారం(మే5) బదిలీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీజీపిని ఆదేశించింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని సీఎస్ను ఈసీ కోరింది. సోమవారం(మే6) ఉదయం 11 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని కోరింది. -
IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
-
టీడీపీపై ఈసీ సీరియస్..
-
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం
సాక్షి, అమరావతి: అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం చంద్రబాబు మా ర్కు రాజకీయం అన్నది బహిరంగ రహస్యం. 40 ఏళ్లుగా అదే చేస్తున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మ రోసారి అదే కుట్రకు యత్నించి అభాసుపాలయ్యారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు చంద్రబాబు పన్నిన కుతంత్రానికి ఎన్నికల కమిషన్ గండికొట్టింది. గ్యారంటీ కాదు బురిడీ..ఇక సూపర్ సిక్స్ అంటూ ఎంతగా ఊదరగొడుతున్నా తనను ప్రజలు ఏమాత్రం నమ్మడంలేదన్నది చంద్రబాబు గుర్తించారు. దీంతో ప్రజల్ని మస్కా కొట్టేందుకు ఆయనో పన్నాగం పన్నారు. ఇంకా పోలింగ్ కూడా కాకముందే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసినట్లుగా ప్రజలకు భ్రమ కల్పించేందుకు ఎత్తుగడ వేశారు. జూన్ 4 తరువాత లబ్ధిదారులకు ఇవిగో ఈ పథకాలు వస్తాయి.ఇంతమేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేపట్టారు. ఏకంగా ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలను దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఈ కుతంత్రానికి తెగించింది. ఓటర్ల పేర్లతో కార్డులు ముద్రించి మరీ పంపిణీకి తెగించింది. అంతేకాక.. ఓటర్ల వ్యక్తిగత ఫోన్ నంబర్లకు ఫోన్లుచేస్తూ మరీ ప్రచారాన్ని ఊదరగొట్టింది. టీడీపీ నేతల వద్ద పేర్లు నమోదు చేసుకుంటే చాలు పథకాలిస్తామని ప్రలోభాలకు గురిచేసింది. ఆ ప్రచారానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధపడింది. బాబు కుట్రను తిప్పికొట్టిన ఈసీ..టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎన్నికల కమిషన్ తీ వ్రంగా స్పందించింది.ఇది పూర్తిగా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడమేనని మండిపడింది. ఒ క్కో ఓటరుకు భవిష్యత్తులో ఇంత లబ్ధిచేకూరుతుందని చెప్పడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన,ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంగానీ ఓటర్లకు కార్డులు పంపిణీ చేసినా నేరంగా పరిగణించి కేసులు నమోదుచేస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల కమిషన్ సత్వరం అప్రమత్తమై కొరఢా ఝళిపించడంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలన్న టీడీపీ కుతంత్రానికి తెరపడింది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడా
సాక్షి, అమరావతి: ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది -
అవ్వాతాతలకు వందనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు. -
అయ్యో.. అవ్వాతాతలు
సాక్షి, అమరావతి: ఇలా చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ప్రతి నెలా ఒకటినే తమ ఇళ్ల వద్దే వారు పింఛన్ అందుకునేవారు. అయితే చంద్రబాబు ముఠా కుతంత్రాలతో వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరగనీయకుండా అడ్డుకున్నారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్ సొమ్మును బ్యాంకుల్లో జమచేశారు. దీంతో అవ్వాతాతలు బ్యాంకుల్లో పడ్డ పింఛన్ సొమ్మును తెచ్చుకునేందుకు చాలా చోట్ల వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. వారినే బతిమలాడుకుని బ్యాంకులకు తీసుకువెళ్తున్నారు. అవ్వాతాతల కష్టాలతో చలించిపోతున్న వలంటీర్లతోపాటు ఇప్పటికే రాజీనామా చేసిన వలంటీర్లు కూడా వారికి మానవతాదృక్పథంతో సాయమందిస్తున్నారు. చంద్రబాబు ముఠా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోకపోయి ఉంటే ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందించేవారు. ఈపాటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తయి ఉండేది. కానీ, చంద్రబాబు కుతంత్రాలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల పింఛన్ నగదును బ్యాంకుల్లో జమ చేశారు. అయితే ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల చేతికి సొమ్ము అందలేదని తెలుస్తోంది. నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో లబ్ధిదారులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేవు. దీంతో కనీసం 5 కి.మీ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు అవ్వాతాతలు వెళ్లాల్సి వస్తోంది.సమాచారం కోసం వలంటీర్ల దగ్గరకే..ప్రతి నెలా పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు తమను చిరునవ్వుతో పలకరించే అవ్వాతాతలు ఇప్పుడు అదే పింఛన్ కోసం అవస్థలు పడుతుంటే చూడలేకపోతున్నామని గ్రామ, వార్డు వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలి కాళిదాస్ ‘సాక్షి’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలు సమాచారం కోసం తమ వద్దకే వచ్చి బ్యాంకు దాకా తోడు రమ్మని అడుగుతుంటే చాలాచోట్ల వలంటీర్లు కాదనలేక వెంట వెళ్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలో తన క్లస్టర్ పరిధిలో 35 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. అందరికీ పింఛన్ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా అందులో 13 మంది మాత్రమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు తన ఇంటికొచ్చి.. పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో పడిందో చెప్పాలని అడిగితే చెప్పానని వెల్లడించారు. బోరివంకకు బ్యాంక్ 5 కి.మీ దూరంలో ఉందని.. దీంతో ఎండల్లో అంతదూరం వెళ్లలేనివారు ఇంకా పింఛన్ తీసుకోలేదన్నారు. గతంలో తాము ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినప్పుడు 35 మందికి ఒకట్రెండు తేదీల్లోనే పింఛన్ సొమ్ము అందేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.57 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా, అందులో 93 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు అవ్వాతాతల కోరిక మేరకు వారికి సాయం చేస్తున్నా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.నిండిపోయిన బ్యాంకులుశనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు అవ్వాతాతలతో నిండిపోయాయి. కొన్నిచోట్ల పింఛను డబ్బులు తీసుకోవడానికి తమ ఊరి నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చారు. కొన్ని చోట్ల బ్యాంకులకు అనుసంధానంగా గ్రామాల్లో ఉండే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అవ్వాతాతలకు రూ.3,000 తీసి ఇచ్చేందుకు రూ.200 దాకా తీసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రంలోని వృద్ధుడి పేరు ఉల్చాల మద్దయ్య. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మజారా లక్షుంపల్లె నివాసి. మండల కేంద్రం వెల్దుర్తిలోని యూనియన్ బ్యాంకుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈయన ఊరు ఉంది. పింఛన్ కోసం బ్యాంకుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఇంకా అకౌంట్లో పడలేదని తెలుసుకుని శనివారం పడతాయేమోనని బ్యాంకు బయటే రాత్రి పడుకున్నాడు. తెల్లారి బ్యాంకు ఉద్యోగులు వచ్చి బయటపడుకున్న మద్దయ్యకు టిఫిన్ పెట్టించారు. అనంతరం అకౌంట్ చెక్ చేస్తే పింఛన్ సొమ్ము పడలేదు. అదే సమయంలో ఒక సచివాలయ ఉద్యోగి నరేశ్ బ్యాంకుకు వచ్చి విషయం తెలుసుకుని వృద్ధుడి వివరాలు తీసుకున్నారు. ఆయన పింఛన్ను ఇంటి వద్ద ఇచ్చేందుకు ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెళ్లగా వృద్ధుడు లేడని, ఎక్కడికెళ్లాడో తెలియక ఇవ్వలేకపోయినట్లు తెలుసుకున్నాడు. చివరకు వృద్ధుడికి ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెల్దుర్తి బ్యాంకు వద్దకే వచ్చి పింఛన్ అందించాడు. నాకీ కష్టం తెచ్చింది ఆ చంద్రబాబేనని, మట్టి కొట్టుకుపోతాడని తిడుతూ మద్దయ్య వెళ్లిపోయాడు.చంద్రబాబు కుట్రకు బదులు తీర్చుకుంటాంచంద్రబాబు దుర్మార్గం వల్ల రెండు నెలలుగా పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బాబుకు పేదల కష్టాలు ఎప్పటికీ తెలియవు. ఎంతో ఆశగా ఈనెల పింఛను తీసుకుందామని రెండు రోజుల నుంచి వాకాడు యూనియన్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాను. అయినా.. పింఛన్ అందుకోలేకపోయాను. వలంటీర్లు ఇంటికి పింఛన్ తెచ్చి ఇచ్చేటప్పుడు మాకు ఈ కష్టాలు తెలియలేదు. బాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం. – చేను వెంకటయ్య, వాకాడు, తిరుపతి జిల్లా చంద్రబాబు దుర్మార్గమే ఇదిమా ఊరి నుంచి మూడు రోజులుగా నరసాపురం బ్యాంకుకు వచ్చి పోతున్నాను. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజూ ఇలా తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు చేసిన రాజకీయ దుర్మార్గం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్, లక్ష్మణేశ్వరం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి మమ్మల్ని ఏడిపిస్తే ఏమొస్తుంది బాబూమాలాంటి ముసలోళ్లను ఏడిపిస్తే చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. నాలుగో తారీఖు వచ్చింది. అయినా పింఛన్ అందలేదు. అంతకుముందు ప్రతి నెలా మొదటి రోజున వలంటీర్ మా ఇంటికే వచ్చి తలుపు తట్టి చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. చంద్రబాబు పుణ్యమా అని మాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. – షేక్ మస్తాన్బీ సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందివలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి ఇచ్చే పింఛన్లను చంద్రబాబు రానివ్వకుండా చేశాడు. 75 ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేక మనవడితో పాటు మరో మహిళ సాయంతో సచివాలయానికి వెళ్లా. బ్యాంకు దగ్గరకు వెళ్లండని చెప్పారు. అక్కడ చూస్తే ఒకటే జనం. పింఛన్ డబ్బు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ప్రతినెలా హాయిగా ఇంటి వద్దే పింఛన్ తీసుకునేవాళ్లం. చంద్రబాబు చేసిన పని వల్ల రెండు నెలల నుంచి నరకం చూస్తున్నాం. చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది.– సిద్ధరామక్క, పళారం, గుడిబండ మండలం, శ్రీసత్యసాయి జిల్లాపేదోళ్లంటే బాబుకు కడుపుమంట80 ఏళ్ల వయసులో పింఛన్ కోసం బ్యాంక్కు తిరగలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన పనికి మా కడుపు మండుతోంది. గతంలోనూ ఆయన హయాంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాం. పింఛన్ తీసుకొనేందుకు రోజుల తరబడి పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మా కష్టాలు తీరాయి. పేదోళ్లంటే బాబుకు కడుపుమంట. మాపై కక్ష కట్టి మరీ సాధిస్తున్నాడు. ఇప్పటికీ నా పింఛన్ సొమ్ము చేతికి అందలేదు. – దేవళ్ల రమణమ్మ, కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల నైతిక వర్తన నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని తొలిసారి 1960లో రూపొందించారు. ఈ కోడ్ను ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం 1979 నుంచి ఆనవాయితీగా మారింది. 1991లో పార్టీలన్నింటి అనుమతితో దీన్ని మరింత బలపరిచారు. కానీ రాజకీయ వాతావరణం పదును తేలినకొద్దీ, ఉల్లంఘనలు పెరిగాయి.కోడ్కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునే మార్గాలను అన్వేషించేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. కాబట్టి, వీలైనంత పారదర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుంటాయో స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కోడ్ను మార్చాలి. ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.‘చాలాసార్లు ఎన్నికలు ఒక మనిషిలోని చెడ్డతనపు పార్శా్వన్ని బయటికి తెస్తాయి, అవి ప్రతిసారీ మంచి మనిషి విజయానికి దారితీయవనేది కూడా నిశ్చయం’ అన్నారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని ఈ పేరా ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అప్పటికి ఎన్నికల కమిషన్ లేదు... మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ– నైతిక వర్తన నియమావళి) కూడా లేదు.రాజకీయ నేతలు, వ్యవస్థలన్నింటి ప్రత్యేక సమ్మతితో ఏర్పడిందీ ఎంసీసీ. మార్పులు, చేర్పులతో కాలంతోపాటు ఎదుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎంసీసీపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పార్టీలతో సహా నేతలు, అభ్యర్థులు... ఎన్నికల కమిషన్ కు సవాళ్లు విసురుతూనే ఉంటారు. ఇదంతా కూడా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ కీలక డేగ కన్ను మధ్యలోనే జరుగుతూంటుంది.కేరళతో మొదలు...గతాన్ని కొంచెం తరచి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కొన్ని విధివిధానాలతో మొదలైందీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రచార సభలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డుల వంటివి ఎలా ఉండాలో ఈ విధి విధానాల్లో పొందుపరిచారు అప్పటి (1960) ఎన్నికల ప్రధాన అధికారి కేవీకే సుందరం. 1968లో ఎస్పీ సేన్ వర్మ ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. కేరళ ఎన్నికల సందర్భంగా రూపొందించిన విధి విధానాలను అందరికీ జారీ చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు (ఫ్రీ అండ్ ఫెయిర్) కనీస మర్యాదలను పాటించాలని కోరింది. తరువాతికాలంలో అంటే 1979 నుంచి ఈ కోడ్ను సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం ఆనవాయితీగా మార్చారు అప్పటి సీఈసీ ఎస్.ఎల్. శక్ధర్. అంతేకాకుండా, రాజకీయ పార్టీల సమ్మతితో ఈ కోడ్ను మరింత విశదంగా రూపొందించారు. అధికార పార్టీకి కొన్ని పరిమితులు విధించడం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు అమల్లోకి వచ్చింది అప్పుడే. 1991లో టీఎ¯Œ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీలన్నింటి అను మతితో ‘కోడ్’ను మరింత బలపరిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ వాతా వరణం మరింత పదును తేలింది. ఫలితంగా మోడల్ కోడ్ సామర్థ్యం మొద్దుబారింది. ఉల్లంఘనలు పెచ్చుమీరి పోయాయి. ఉల్లంఘనల పరిణామాలు స్పష్టం చేయాలి...ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న ప్రధాన లోపం కోడ్ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలను ఎదు ర్కోవాల్సి వస్తుందీ? అన్నది లేకపోవడం. అందుకే ఈ కోడ్... నిబంధనల ఉల్లంఘనలకు అడ్డు కావడం లేదు. కాబట్టి వీలైనంత పార దర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టం చేయాల్సి ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కుల మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం వంటి విషయాల్లో మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఓట్ల కోసం పెట్టే ప్రలోభాలు, ప్రత్యర్థి పార్టీలు, నేతల గురించి అసభ్యకరమైన సంభా షణలు, భారత సాయుధ దళాలను పొగుడుతూ లేదా విమర్శిస్తూ, చర్యలను ప్రశ్నిస్తూ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుఉంటాయో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.ఉదాహరణకు విద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటికి ప్రచారంపై నిర్దిష్ట కాలం నిషేధం విధించడం, మరింత తీవ్రమైన ఉల్లంఘనలకు నిషేధ సమయాన్ని పొడిగించడం, అప్పటికీ ఉల్లంఘనలు మానకపోతే మోడల్ కోడ్ అమల్లో ఉన్నంత కాలం నిషేధాన్ని కొనసాగించడం చేయవచ్చు. ఇది కేవలం ప్రచార సభలకు మాత్రమే పరిమితం కాకుండా... మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి వాటికీ వర్తించేలా నిబంధనలు రూపొందించాలి. ‘ఉల్లంఘనులు’ స్టార్ క్యాంపెయినర్లు అయితే తరువాతి ఎన్నికల్లో ఆ గుర్తింపు రద్దు చేయడం కూడా చేయవచ్చు. అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతారు. యుక్తులు పన్నుతారు కూడా. ఒకప్పుడు కండబలం ఉపయోగిస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ధన బలం ఆక్రమించింది. టెక్నాలజీ ఈ ఆయుధానికి మరింత పదును పెట్టింది. కోడ్కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నేతలు మరింత ఎక్కువ ఇష్టపడుతూంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీసీని రీమోడల్ చేయాల్సిన అవసరముంది. అది కూడా వివక్షకు తావులేని విధంగా అమలు చేసేలా ఉండాలి. ప్రజాజీవితంలో కొద్దోగొప్పో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం. పార్టీలకు నోటీసులు... కొత్త పంథా!ఎన్నికల కమిషన్ (ఈసీ) ఈ మధ్యకాలంలో ఓ కొత్త పంథాను ఎంచుకుంది. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తులకు కాకుండా... ఆ వ్యక్తుల పార్టీలకు నోటీసులు పంపుతోంది. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు డ్రైవరే బాధ్యుడైనట్లు కోడ్ ఉల్లంఘనల బాధ్యత కూడా పార్టీది కాదన్నది గుర్తించాలి. పైగా ఈసీ నోటీసు ప్రాథమికంగా ఉల్లంఘనపై సంతృప్తి చెందిన తరువాతే వెళుతుందన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు కోడ్ను ఉల్లంఘిస్తే ఈసీ ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరాదు. ఈ చర్యలు జరిమానా కావచ్చు లేదా పార్టీ గుర్తులకు సంబంధించినదైనా కావచ్చు. అవసరమైతే ఈ రెండు రకాల చర్యలు కూడా తీసుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఉల్లంఘనలు జరిగిన 72 గంటల్లోపే చర్యలు తీసు కోవడం కూడా అవసరం. వీటికి సంబంధించి స్పష్టమైన పద్ధతి ఒకదాన్ని సిద్ధం చేయాలి. ఆలస్యంగా తీసుకునే తూతూ మంత్రపు చర్యల వల్ల ప్రజల్లో ఈసీపై నమ్మకం సడలుతుంది. కోడ్ ఉల్లంఘనలు ఎన్ని జరిగాయో ఒక జాబితా సిద్ధం చేసి వాటిల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి? వంటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలి.కోడ్ ఉల్లంఘనలను నేరుగా ఇతర చట్టాలకు అనుసంధానించడం జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడుతుంది. అయితే, ఈ చర్యలన్నీ రాజ కీయ పార్టీలు కోడ్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించేలా చేస్తాయా? ఇది మన రాజకీయ నేతల క్యారెక్టర్పై ఆధారపడిఉంటుంది. అయితే ఈ వ్యవహారాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే వారి విచక్షణాధికారాలకు పరిమితి విధిస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా ఎన్నికల ప్రధానాధికారిపై వివక్ష, ఏకపక్ష ధోరణివంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు నిర్దిష్ట కాలావధిలోగా పూర్తవుతాయన్న భరోసా ఎన్నికల కమిషన్ ప్రజలకు కల్పించడం కూడా అవసరమే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. నాయకత్వం వహిస్తున్న వారు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఎలాంటి మోడల్ కోడ్లూ అవసరం ఉండదు.- వ్యాసకర్త ఎన్నికల మాజీ ప్రధాన అధికారి-అశోక్ లవాసా -
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్ను సూపర్సీఎంగా పిలుస్తాయి. -
ఈసీ షాక్..కుదేలైన కూటమి..
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement