-
దిలీప్ కుమార్ ఇంటిని దక్కించుకునేందుకు పాక్ ప్లాన్!
బాలీవుడ్ దివంగత నటుడు దిలీప్ కుమార్ పాత ఇంటిని తక్కువ ధరకు కొట్టేద్దామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్లు వేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పక్తున్క్వా ప్రాంతంలో దాదాపు రూ.25 కోట్లు పలికే ఆయన ఇంటిని రూ.80.56 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనిపై దిలీప్ కుమార్ భవనాన్ని గతంలో కొనుగోలు చేసిన యజమాని హజీ లాల్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఇంత దారుణంగా తక్కువ ధరకు ఎలా కోట్ చేస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తానన్న ధర అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి భవనానిన అమ్మే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్ కట్టడంగా ప్రకటించారు. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇక చర్చల దశలో ఉన్న ఈ భవనం అమ్మకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. -
దిలీప్ కుమార్ ఇంటిని కొనబోమన్న పాక్
కరాచి: పెషావర్లోని బాలివుడ్ పాతతరానికి చెందిన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పూర్వికుల ఇల్లుపై పాకిస్తాన్ కోర్టులో కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. మొన్నటిదాకా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెబుతూ వచ్చిన పాక్ హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ ప్రతిపాదనను తాము విరమించుకున్నామని పెషావర్ హైకోర్టుకు బుధవారం తేల్చి చెప్పింది. అయితే ‘పరిరక్షక పురాతన సంపద’గా ప్రకటించింది. ఇలా ప్రకటించడం వల్ల ఆ ఇంటి ప్రస్తుత యజమాని ఆ ఇంటిని యధాతథంగా ఉంచాలి. ఎలాంటి మరమ్మతులు చేయరాదు. కొత్త నిర్మాణాలు చేపట్టరాదు. దీనిపై ఆ ఇంటి యజమాని హాజీ లాల్ మొహమ్మద్ ఖాన్ లబోదిబోమంటున్నారు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉందని, దాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణం చేపట్టరాదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దిలీప్ కుమార్ బాల్యమంతా ఆ పెషావర్ ఇంట్లోనే గడిచిందనడంపై భిన్న కథనాలు ఉన్నాయి. దిలీప్ కుమార్ 1922లో పుట్టారని, ఆ ఇంటిని ఆయన తండ్రి 1943లో కొన్నారని, అలాంటప్పుడు దిలీప్ కుమార్ బాల్యంలో అక్కడ ఎలా ఉంటారని ఖాన్ కోర్టులో సవాల్ చేశారు. పైగా దలీప్ తండ్రి ఆ ఇంటిని కొన్న మూడు రోజుల్లో మళ్లీ అమ్మేశారని చెప్పారు. అందుకు సాక్ష్యాలుగా ఇంటికి సంబంధించిన దస్తావేజులు చూపించారు. ఇంతకు ఆ ఇంటిని కొంటున్నారా, లేదా ? అంటూ వాదనల సందర్భంగా పెషావర్ హైకోర్టు స్థానిక ప్రభుత్వాన్ని నిలదీసింది. కొనడం లేదని, బేరం కుదరలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2012లోనే ఆ ఇంటిని కొనాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 30లక్షల పాకిస్తాన్ రూపాయలను చెల్లిస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మాటమార్చి కేవలం 11 లక్షల రూపాయలకే అమ్మాలని షరతు పెట్టింది. అందుకు ఇంటి ప్రస్తుత యజమాని ఖాన్ ససేమిరా అంగీకరించకపోవడంతో ఆ మొత్తాన్ని 14 లక్షల రూపాయలకు పెంచింది. ఆందుకూ ఖాన్ ఒప్పుకోలేదు. చివరకు కొనము పొమ్మంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement