-
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు ఊరట.. బెయిల్ మంజూరు
ఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇక.. గత ఏడాది అక్టోబర్లో ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. అమానతుల్లా ఖాన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా ఇప్పటి వరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్ఐఆర్లో నమోదు అయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కథువా కేసు : మీడియాపై హైకోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం పట్ల మీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన కేసులో బాధితురాలి వివరాలను వెల్లడించిన పలు మీడియా సంస్థలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, జస్టిస్ సీ హరిశంకర్లతో కూడిన హైకోర్టు బెంచ్ సుమోటోగా ఈ అంశాన్ని చేపట్టి ఆయా మీడియా సంస్థల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తమపై ఎందుకు చర్యలు చేపట్టరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీప గ్రామం రసానా నుంచి బకేర్వాల్ ముస్లిం వర్గానికి చెందిన బాలిక అదృశ్యమైంది. వారం రోజుల అనంతరం అక్కడికి దగ్గర్లోని అడవుల్లో శవమై తేలింది. ఆమెపై నిందితులు సామూహిక లైంగిక దాడికి తెగబడి, అనంతరం దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు నిందితులపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అభియోగాలు నమోదు చేసింది. -
‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ డుప్లెసిస్పై కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. -
ఆధార్ : లాయర్లకు దానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు లేనప్పటికీ రిటర్నులు దాఖలు చేసే అనుమతి న్యాయవాదులకు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు వివరాలు ఇవ్వన్నప్పటికీ అనుమతి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు ముకుల్ తల్వార్, వ్రిండా గ్రోవర్లు దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు డివిజిన్ బెంచ్ నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ మే 14న చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్తో పాన్ కార్డు లింక్ చేసుకునే తుది గడువు జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆధార్ చట్టాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంటూ వస్తోంది. ఇది ఒక సరసమైన, సహేతుకమైన చట్టంగా కేంద్రం అభివర్ణిస్తోంది. గోప్యతా హక్కు విషయంలో చారిత్రక తీర్పుకు ఇది కట్టుబడి ఉందని తెలిపింది. కాగ, గతేడాది ఆగస్టులో గోప్యత హక్కు, ప్రజల ప్రాథమిక హక్కు అని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ బెంచ్ చారిత్రక తీర్పు వెలువరించింది. మరోవైపు ఆధార్ స్కీమ్ వాలిడిటీపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్తో విచారిస్తోన్న సంగతి తెలిసిందే. -
జూలై వరకు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి గణితం పేపర్ లీకైన నేపథ్యంలో ఆ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సంస్థను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ లీకేజీ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ సోషల్ జ్యూరిస్ట్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. గణితం పేపర్ ఎక్కడెక్కడ లీకయిందో పరిశీలిస్తున్నామనీ, జూలైలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశముందని సీబీఎస్ఈ చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య విద్యార్థులను ముళ్లపై కూర్చోబెట్టడం లాంటిదేననీ, అసలు పరీక్ష నిర్వహణకు జూలైదాకా ఆగాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. గణితం పరీక్షను మళ్లీ నిర్వహించడంపై తమ అభిప్రాయాన్ని ఏప్రిల్ 16లోగా తెలియజేయాలని సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్క్రిప్టెడ్ విధానంలో సీబీఎస్ఈ పరీక్షలు పది, పన్నెండో తరగతి పరీక్ష పేపర్లు లీకైన నేపథ్యంలో సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా సరికొత్త విధానంలో సోమవారం పరీక్షల్ని నిర్వహించింది. పరీక్షకు కేవలం 15 నిమిషాల ముందు ఎన్క్రిప్టెడ్ ప్రశ్నపత్రాన్ని నిర్వాహకుల ఈ–మెయిల్కు సీబీఎస్ఈ పంపగా, వారు దాన్ని డౌన్లౌడ్ చేసుకున్నారు. కొన్నిచోట్ల బంద్ కారణంగా, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. -
ఆప్ ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు
-
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
అనర్హతపై ‘ఆప్’ విజయం
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హతను రద్దుచేస్తూ కేసును మళ్లీ విచారించాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం తీరును కోర్టు తప్పుబట్టింది. అనర్హతపై కేంద్రానికి ఈసీ చేసిన ప్రతిపాదనలను సహజ న్యాయాన్ని, ఎమ్మెల్యేల హక్కులను నీరుగార్చటంగా అభివర్ణించిన ధర్మాసనం.. వారిపై వేటువేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈసీపై కోర్టు మండిపాటు ‘ఎన్నికల కమిషన్ జనవరి 19న ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉద్దేశం చట్టాలను నీరుగార్చటమే. సహజన్యాయ చట్టాలను అమలు చేయటంలో ఎన్నికలసంఘం విఫలమైంది’ అని 79 పేజీల తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ‘అనర్హతపై ఆప్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని భారత ఎన్నికల సంఘం విని, క్షుణ్ణంగా విచారించాలి. ఆ తర్వాత ప్రభుత్వంలో లాభదాయక పదవులు అంటే ఏమిటనే ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటరీ సెక్రటరీలుగా పిటిషనర్లు (ఆప్ ఎమ్మెల్యేలు) అనుభవించిన లాభదాయక పదవులపై నిష్పాక్షికంగా పునఃసమీక్ష జరపాలి’ అని ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించింది. మేం వదలబోం: కాంగ్రెస్ ఆప్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎన్నికల సంఘం వద్ద తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. ‘లాభదాయక పదవులపై మా పోరాటం కొనసాగుతుంది. హైకోర్టు వీరు తప్పుచేయలేదని నిర్ధారించ లేదు. ఎమ్మెల్యేల వాదన వినలేదనే అంశంపై సామాజిక న్యాయం జరగలేదని మాత్రమే అభిప్రాయపడింది’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ అనుమతించారు. అసలు వివాదమేంటి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 2015 మార్చిలో 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. ఎమ్మెల్యేలుగా వేతనం తీసుకుంటూనే పార్లమెంటు సెక్రటరీలుగా లాభం పొందే పదవులను అనుభవించటంపై బీజేపీ, కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాయి. 2016లో వీరి నియామకాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలతో ఈ 20 మందిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సున్నితంగా తిరస్కరించింది. అయితే.. ఈ స్థానాల్లో తక్షణమే ఎన్నికలు నిర్వహించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీకి సూచించింది. -
కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు
-
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట!
-
ఆ 20మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పడ్డ అనర్హత వేటును హైకోర్టు పక్కన పెట్టింది. ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్ను శుక్రవారం పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కోర్టు తీర్పును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించే అవకాశం గతంలో ఇవ్వలేదు. అందుకే కోర్టు నేడు ఆ ఆప్ ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ ఆప్ ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి పరిశీలించనుందని ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు కారణమిదే.. 2015 జవనరిలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. బీజేపీని ఢీకొడుతూ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చిన కేజ్రీవాల్, మరో 20 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. 20 ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు పొందారాని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ 2017 సెప్టెంబర్ 28న మొదటి సారి, నవంబర్ 2న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘకం ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిన నిర్ణయానికి దోహదపడింది. నోటీసులకు ఓసారి సమాధానం ఇచ్చినా అందుకు ఈసీ సంతృప్తి చెందలేదు. ఆప్ నేతలు ఏకంగా ఈసీని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా! అంటూ ఈసీ గత జనవరిలో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ఏకే చావ్లా బెంచ్ ఆప్ ఎమ్మెల్యేల పిటిషన్ను విచారించిన అనంతరం వారికి ఊరట కల్పిస్తూ తీర్పిచ్చింది. ఆప్ ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోర్టు ఆదేశించింది. -
కార్తీ చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును తమకు సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక బెయిల్ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 16న కార్తి, సీబీఐ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, తదుపరి నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది. ప్రస్తుతం కార్తికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను కార్తి తారుమారు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ సీబీఐ వాదించింది. అయితే సాక్ష్యాధారాల టాపరింగ్ చేసిన ఆరోపణలను కార్తి లాయర్లు ఖండించారు. తుదపరి కస్టోడియన్ ఇంటరాగేషన్ను సీబీఐ కోరనప్పుడు, ఇంకెందుకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిందని ప్రశ్నించారు. కార్తీపై ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయలేదని వాదించారు. అంతేకాక ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో యూకే నుంచి వస్తున్న కార్తిని చెన్నై ఎయిర్పోర్టులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లగా పేర్కొంది. -
రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది. -
రాజా, కనిమొళికి నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్ఏ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. -
శరద్యాదవ్కు ఝలక్
న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, జేడీయూ బహిష్కృత నేత శరద్యాదవ్ అనర్హత కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ కేసులో తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రస్తుతం యాదవ్ అందుకుంటున్న వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి రావొచ్చని జస్టిస్ రాజీవ్ షక్ధర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొనడంతో శరద్యాదవ్, అన్వర్ అలీలను జేడీయూ సిఫార్సు మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 2017, డిసెంబర్ 4న అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ యాదవ్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ పూర్తయ్యేవరకూ ఎంపీలకు అందే అన్ని సౌకర్యాలను వీరిద్దరికీ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శరద్యాదవ్కు అందిస్తున్న సౌకర్యాలను తొలగించాలంటూ జేడీయూ రాజ్యసభ నేత రామ్చంద్ర ప్రసాద్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానందున ఆయనకు ఎలాంటి వేతనం, అలవెన్సులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ రాజీవ్ తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను సింగిల్ జడ్జీ లేదా డివిజన్ బెంచ్లలో ఎవరికి అప్పగించాలన్న దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న యాదవ్ పదవీకాలం 2022లో, అన్వర్ పదవీకాలం వచ్చేఏడాదితో ముగియనుంది. -
మళ్లీ పెళ్లి కోసం కోర్టుకు మాజీ సీఎం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహబంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందనీ.. కాబట్టి మరో వివాహం చేసుకునేందుకు వీలుగా భార్య పాయల్ నుంచి విడాకులు ఇప్పించాలని విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్ దీపా శర్మల ధర్మాసనం.. ఈ విషయమై ఏప్రిల్ 23లోగా స్పందనను తెలియజేయాలని పాయల్ను ఆదేశించింది. ఈ పిటిషన్ను త్వరితగతిన విచారించాలన్న ఒమర్ విజ్ఞప్తిపై కూడా పాయల్ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది. 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. తమ వివాహబంధం కోలుకోలేనంతగా దెబ్బతిందని నిరూపించడంలో ఒమర్ విఫలమయ్యారని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్, పాయల్లకు 1994, సెప్టెంబర్ 1న వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో ఒమర్–పాయల్ల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2009 నుంచి వీరు విడిగా ఉంటున్నారు. -
నీట్ అర్హత నిబంధనలపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 చివరితేదీ కాగా పరీక్ష మే 6న జరగనుంది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది n eligibility norms for NEET -
పూలన్ దేవి హత్య: పెళ్లిపీటలెక్కిన ప్రధాన నిందితుడు
సాక్షి, న్యూఢిల్లీ: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్దేవి హత్య కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణా(41) మరోసారి వార్తల్లో నిలిచాడు. షేర్ సింగ్ నిన్న (మంగళవారం) వివాహం చేసుకోవడంతో పూలన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. పూలన్దేవి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న షేర్ సింగ్ కొంతకాలం కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రతిమా సింగ్తో కలిసి షేర్ సింగ్ పెళ్లిపీటలెక్కాడు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో వైభవంగా ఈ వివాహం జరిగింది. ప్రతిమాసింగ్తో వివాహం అనంతరం షేర్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడాడు. 'అంతా దేవుడి మీద భారం వేశాను. కేసు నుంచి బయట పడేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని' షేర్ సింగ్ అన్నాడు. బందిపోటుగా జీవనం సాగించిన అనంతరం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న పూలన్దేవి సమాజ్వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఎస్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను షేర్ సింగ్ రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి ఆమెను కాల్చి చంపారు. 2014 ఆగస్టులో ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించగా.. రాణా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2016లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
సింగ్ బ్రదర్స్కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధ సంస్థ దైచీ శాంక్యో , సింగ్ బ్రదర్స్ వివాదంలో సింగ్ బ్రదర్స్కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో 3500 కోట్ల రూపాయల దావాను దైచీ శాంక్యో గెలిచింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జపనీస్ దిగ్గజం దైచీ శాంక్యో దాఖలు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో రాన్బాక్సీ మాజీ అధిపతులు సింగ్ బ్రదర్స్నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పును అమలు చేయాలంటూ మే, 2016 లో ఢిల్లీ హైకోర్టును దైచీ ఆశ్రయించింది. అయితే, ఈ అవార్డును అమలు చేయడానికి భారత మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం సబ్స్టాంటివ్ అభ్యంతరాలున్నాయంటూ సింగ్ బ్రదర్స్ దీన్ని సవాల్ చేశారు. దీనిపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఔషధ సంస్థ దైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పుడు నివేదికలు అందించిన కేసులో అప్పటి ర్యాన్బ్యాక్సీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ భారీ నష్టపరిహార కేసును ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో దైచీ శాంక్యో 2013లో సింగపూర్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించగా రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. -
డివిజన్ బెంచ్కు ఆప్ పిటిషన్
న్యూఢిల్లీ: తమపై అనర్హత వేటును రద్దు చేయాలని ఆప్ మాజీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్కు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఆ మేరకు జస్టిస్ విభు బఖ్రుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. కేసును విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న డివిజన్ బెంచ్కు బదిలీ చేయాలా? అన్నది మంగళవారం ప్రధాన న్యాయమూర్తి తేల్చనున్నారు. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు జారీచేయవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: అనర్హతకు గురైన ఆప్ ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఇక ఇక ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించగా, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇక మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. -
సమరానికి సమయం!
పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించారు. మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. అయితే మధ్యంతరంగా వస్తున్న ఈ ఎన్నికల్లో అన్ని పక్షాలూ తమకు ఉన్న ప్రజాదరణను పరీక్షించుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఎన్నికల్లోపార్లమెంటరీ సెక్రెటరీల నియామకం ఎప్పటి నుంచి మొదలైంది? ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం1953 నుంచి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఈ పదవుల్లో శాసనసభ్యులు కొనసాగుతున్నారు. అయితే, 2014 నుంచి తెలంగాణ, పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణాలో జరిగిన ఈ నియామకాలు హైకోర్టుల తీర్పుల ఫలితంగా రద్దయ్యాయి. 2004లో ఇలాంటి నియామకాలను అనుమతించే అస్సాం చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్లో పదవుల్లో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీలు రాజీనామా చేశారు. 2014లో తెలంగాణలో కె.చంద్రశేఖర్రావు సర్కారు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన ఆరుగురు శాసనసభ్యుల నియమకాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ఏ సందర్భంలోనూ ఈ పదవులు చేపట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రయత్నాలు జరగలేదు. అనర్హత వేటుకు ఆస్కారమిచ్చే లాభదాయక పదవి అంటే? సభ్యత్వం పోవడానికి దారితీసే లాభదాయక పదవి(ఆఫీస్ ఆప్ ప్రాఫిట్) అంటే రాజ్యాంగంలోగాని, ప్రజాప్రాతినిధ్యచట్టం(1951)లోగాని నిర్వచించలేదు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా లాభదాయకపదవులను నిర్ధారిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనం ఉంటే దాన్ని ఇలాంటి పదవిగా పరిగణిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవరించిన 164 (1ఏ) అధికరణ కారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో సభ్యులు ఆయా దిగువసభల సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు. కేంద్రపాలితప్రాంతమైన ఢిల్లీలో మంత్రులు పదిశాతం దాటకూడదు. అదీగాక చీఫ్, పార్లమెంటరీ కార్యదర్శులు ఒక వేళ ప్రభుత్వం అందించే జీతాలు, సౌకర్యాలు పొందకపోయినాగాని ఇప్పుడు వారిని సహాయ మంత్రులుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఆప్ ఎమ్మెల్యేలు ఈ పదవుల్లో ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అయితే, వారిని ఎన్నికల కమిషన్ మంత్రులుగా పరిగణించి వారిపై అనర్హత వేటు ప్రక్రియ ప్రారంభించి ఆదివారం పూర్తిచేసింది. ఢిల్లీ మంత్రులు అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పది శాతం లోపే ఉన్నప్పటికీ అదనంగా నియమించిన 20 మంది పార్లమెంటరీ కార్యదర్శులను సహాయ మంత్రులుగా లెక్కించారు. ఫలితంగా వారు ఈసీ చర్యతో సభ్యత్వం కోల్పోయారు. ఈ పరిణామాలు రెండు ప్రధాన రాజకీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్తోపాటు పాలకపక్షం ఆప్కు రాజధానిలో ప్రజల మద్దతు ఎంతుందో ఉప ఎన్నికలు తేలుస్తాయనడంలో సందేహం లేదు. హరియాణాలోనూ నలుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు పిటిషన్! గతంలో చీఫ్ పార్లమెంటరీ సెక్రెటరీలుగా హరియాణా ప్రభుత్వం నియమించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను కిందటేడాది హైకోర్టు రద్దచేసింది. రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి అనుమతించే ప్రత్యేక చట్టం ఉన్నందున ఎమ్మెల్యేలపై చర్యకు ఆస్కారం లేదని, దిల్లీ, హరియాణా పరిస్థితులకు పొంతన లేదని ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మారని ఆమె కథ!
న్యాయమూర్తి అయినా.. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించే అధికారి అయినా.. ప్రజాప్రతినిధి అయినా.. చివరికి ఓ ఆఫీసులో పనిచేసే క్లర్క్ అయినా.. ఇంట్లో పనిమనిషి అయినా.. ఎక్కడ చూసినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఆకాశంలో సగం అని కీర్తిస్తున్నా.. అణు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ఢిల్లీ ట్రాఫిక్ కోర్టు మహిళా న్యాయమూర్తి ఉదంతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా సీనియర్ న్యాయవాది, హక్కుల ఉద్యమవేత్త వృందా గ్రోవర్ను నియమించింది. మరోవైపు హాలీవుడ్ సినీ పరిశ్రమలో పెద్ద తలకాయ హార్వే వెయిన్స్టీన్ హీరోయిన్లు, మోడల్స్ను వేధించిన బాగోతాలు బయటపడడంతో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. - సాక్షి, తెలంగాణ డెస్క్ ఆమె ఢిల్లీలో ట్రాఫిక్ కోర్టు న్యాయమూర్తి.. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులపై విచారణ జరుపుతున్నారు.. ఓ ముద్దాయికి కాస్త తీవ్రమైన శిక్ష విధించారు.. దీంతో ఆ ముద్దాయి తరఫు సీనియర్ పురుష న్యాయవాది ఒక్కసారిగా రెచ్చిపోయాడు.. కనీస సంస్కారాన్ని మరిచి ‘అసలు నువ్వేంటి? నీ సాయేమిటి? నీ చెడ్డీ చింపి పడేస్తా.. (తెరీ ఔకాత్ క్యా హై.. తెరీ చెడ్డీ ఫాడ్కే రఖ్ దూంగా..)’ అంటూ బూతులు తిట్టాడు.. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చేశారు. పోలీసు కేసు పెట్టారు. కానీ రెండు నెలలు గడిచినా ఆ న్యాయవాదిపై చర్యల్లేవు. కేసులో చార్జిషీటు కూడా దాఖలు కాలేదు. ఇతర న్యాయమూర్తులు, న్యాయ వాదులు కూడా ‘విచారణ అవమానాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? రాజీ చేసుకోవడం మంచిదేమో..’ అన్నట్లుగా మాట్లాడారు. రెండేళ్లయినా ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకంగా న్యాయమూర్తికే ఇలాంటి దుస్థితి. ఆమె బాధ అర్థం చేసుకునేదెవరు? ఆమె 15 ఏళ్ల బాలిక.. తండ్రి చనిపోయాడు.. తనకన్నా ముగ్గురు చిన్నవాళ్లున్నారు.. తల్లి పాచిపని చేసి పోషిస్తోంది.. దీంతో చేదోడుగా ఉండేందుకు ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. ఆ ఇంటి యజమాని తండ్రి 60 ఏళ్ల ముసలివాడు. ఎప్పుడూ ఆ బాలిక వెనకే తిరుగుతూ ఉంటాడు. ఎలాగోలా తాకాలని చూడడం.. చేయి వేయడం.. రాత్రిళ్లు వెళ్లి గది తలుపుకొట్టడం. ఇంట్లో వాళ్లంతా ఎటైనా వెళుతున్నప్పుడు కావాలని ఒక్కడే ఉండిపోవడం.. ఆ బాలికను లొంగదీసుకోవాలని చూడడం.. వంటివి చేసేవాడు. ఈ విషయం అందరికీ చెబుతానంటే.. దొంగతనం చేశావంటూ పోలీసులకు పట్టిస్తానని బెదిరించేవాడు. విషయం తెలిస్తే పని మాన్పించేస్తుందని, ఇంట్లో కష్టమవుతుందని తల్లికి కూడా చెప్పుకోలేకపోయింది.. చివరికి వేధింపులు తట్టుకోలేక పనిమానేసింది. ఈ బాలికే కాదు.. వేలాది మంది నిరుపేద బాలికలు, మహిళలు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు. కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే మహిళా న్యాయమూర్తులకు తరచూ వేధింపులు ఎదురవుతుంటాయని ఓ మహిళా న్యాయమూర్తి వెల్లడించారు. ‘‘కొందరు న్యాయవాదులు మహిళా న్యాయమూర్తిని ఉద్దేశించి.. ‘నువ్వు.. నీకు’ అంటూ ఏకవచనంతో మాట్లాడుతుంటారు. నేరుగా అనకుండా.. మాకు వినిపించేలా మాట్లాడుతుంటారు. కానీ మాలో చాలా మంది అలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేద్దామనుకున్నా బార్ అసోసియేషన్లు, తోటి పురుష న్యాయమూర్తులు ‘రాజీ’ చేసుకొమ్మని.. క్షమించేయాలని ఒత్తిడి తెస్తుంటారు. ఎందుకంటే పురుష న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కదా. ఇక పై స్థాయి కోర్టుల్లోనూ ఏం జరుగుతుందనే దానిని పట్టించుకోరు. అసలు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి జడ్జీల కోసం ఫోరం ఉందా, లేదా అన్నదీ తెలియదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా న్యాయమూర్తుల విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మహిళా న్యాయవాదుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చని వృందా గ్రోవర్ పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా ఈ వృత్తిలో సీనియర్లు, అనుభవజ్ఞులైన లాయర్ల వద్ద పనిచేయాల్సిన స్థితి యువ మహిళా న్యాయవాదులకు మరింత ఇబ్బందికరం. ఎవరెవరికీ దూరంగా ఉండాలనేది వారికి చాలా త్వరగానే అర్థమైపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సమస్యను గుర్తించిన నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. న్యాయాధికారులు, లాయర్లు, కోర్టు సిబ్బందిలో మహిళల శాతాన్ని పెంచితే ఈ సమస్య తగ్గుతుందన్నారు. తాను న్యాయవాద వృత్తిలోకి వచ్చేనాటికి ఈ రంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారని.. తానూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. ఫిర్యాదు చేసేది చాలా తక్కువ దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల అంశంపై జాతీయ బార్ అసోసియేషన్ (ఐఎన్బీఏ) ఈ ఏడాది జనవరిలో విస్తృత సర్వే చేసింది. అన్ని రంగాలు, వృత్తుల్లోనూ.. అన్ని స్థాయిల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించింది. అసలు వేధింపులకు గురవుతున్నవారిలో 70 శాతం మహిళలు అసలు ఫిర్యాదే చేయడం లేదని తేల్చింది. ఇక జూన్లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చేసిన ఓ సర్వేలో.. ప్రైవేటు సంస్థల్లోని మహిళా మేనేజర్లలో 44 శాతం మంది తాము లైంగికపరమైన వేధింపులకు గురయ్యామని వెల్లడించినట్లుగా పేర్కొంది. తోటి పురుష ఉద్యోగులు, పైఅధికారులు తమ ప్రవర్తన, మాట తీరుతో వేధిస్తున్నారని.. కొందరు భౌతికంగా వేధింపులకు తెగబడుతున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఇలాగైతే ఎలా మరి? - పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. యాజమాన్యాలు కేవలం సదరు పురుష ఉద్యోగులను మరో విభాగానికో, మరో చోటికో బదిలీ చేయడంతో సరిపెడుతున్నాయి. - ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని కూడా సస్పెన్షన్లో ఉంచడం, ఉద్యోగం నుంచి తొలగించడం.. సదరు పురుష ఉద్యోగి తప్పు చేసినట్లు రుజువయ్యాకే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం వంటి చర్యలు చేపడుతున్నాయి. దీంతో మహిళలు వేధింపులకు గురైనా ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. - మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేసినప్పుడు.. అది వాస్తవమని ఎలా రుజువు చేయాలనేది ఇబ్బందికరంగా మారుతోంది. - పై అధికారులపై ఫిర్యాదు చేస్తే.. వేధింపులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో మరీ తీవ్రమైన ఘటనలు మాత్రమే బయటికి వస్తున్నాయి. - కనీసం పది మందికన్నా ఎక్కువమంది ఉద్యోగులు ఉండే సంస్థలు, పరిశ్రమలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలనే నిబంధన ఉంది. కనీసం నలుగురితో ఉండే ఆ కమిటీలో.. మహిళా హక్కుల కోసం పోరాడే స్వచ్చంద సంస్థ కార్యకర్త ఒకరు తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏదీ ఉండడం లేదు. వేధింపులపై లెక్కలేవీ? ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తున్నారు. ఐటీ రంగం నుంచి విమాన పైలట్లు, సైన్యం దాకా అన్నింటిలోనూ మహిళల శాతం క్రమంగా పెరుగుతోంది. కానీ ఇది కేవలం పైకి కనిపిస్తున్నదే. ఇప్పటిదాకా మహిళల శాతం అతి తక్కువగా ఉన్న రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతుండగా.. మొత్తంగా ఉద్యోగం చేసే మహిళల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఓ సర్వే ప్రకారం భారత్లో గత రెండు దశాబ్దాల్లో పనిలో మహిళా భాగస్వామ్యం 34.8 శాతం నుంచి 27 శాతానికి తగ్గిపోయింది. మహిళలను బయటికి పంపించకుండా.. ఇల్లు, పిల్లల బాధ్యతను చూసుకునేవారిగానే పరిగణిస్తున్నారు. అయితే ఇలా మహిళల భాగస్వామ్యం తగ్గిపోవడానికి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కూడా కారణమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ పని ప్రదేశాల్లో వేధింపులపై గణాంకాలు లేవు. తెలంగాణలో.. కలెక్టర్కూ తప్పలేదు.. జూలై 12న మహబూబాబాద్లో జరిగిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్నాయక్ అమర్యాదకరంగా ప్రవర్తించారు. కలెక్టర్ మీనా చేతులను ఆయన ఉద్దేశపూర్వకంగా తాకారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. శంకర్నాయక్ ప్రవర్తనతో కలత చెందిన కలెక్టర్ ప్రీతిమీనా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ శంకర్నాయక్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టింది. దాంతో కలెక్టర్కు శంకర్నాయక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చట్టం ఏం చెబుతోంది? పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై 2013లో కేంద్రం చట్టం చేసింది. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు సహా ఎక్కడైనా మహిళలకు వేధింపుల నుంచి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అవ్యవస్థీకృత రంగంలో.. ముఖ్యంగా ఇళ్లలో పని మనుషులుగా, వంటచేసేవారుగా, ఇతర పనుల్లో ఉన్న మహిళలపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఇళ్ల యజమానులతో పాటు అక్కడ పనిచేసే డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, తోటపని, ఇతర ఇంటి పనులు చేసే పురుష సిబ్బంది కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదులు దాదాపుగా ఉండవు. మహిళలు వేధింపులను భరించగలిగినంత కాలం భరించి.. చివరికి అక్కడ పని మానేస్తున్నారు. కానీ మరో చోట పనిలో చేరినా ఇదే తరహా పరిస్థితి ఉంటోంది. నోరు తెరిస్తే మరిన్ని వేధింపులు ఆమె ఓ వార్తా సంస్థలో మానవ వనరుల విభాగం (హెచ్ఆర్)లో పనిచేసేది.. భర్త కొన్నేళ్ల కింద మరణించాడు. ఆ సంస్థను ఓ విదేశీ సంస్థ టేకోవర్ చేశాక ఆమె ఉద్యోగాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పరిధిలోకి మార్చారు. అప్పటికే ఆ ఎండీ ప్రవర్తన బాగోదన్న ప్రచారమున్నా.. అవన్నీ ఉత్త గాసిప్స్ అనుకుంది. కానీ తర్వాత అతడి అసలు స్వరూపాన్ని గుర్తించింది. తరచూ క్యాబిన్లోకి పిలిచి కబుర్లు చెప్పడం, భర్త లేడు కాబట్టి తాను సంతోషంగా చూసుకుంటాననడం, తరచూ తాకడం వంటివి చేశాడు. కొద్దిరోజులు ఓపిక పట్టిన ఆమె చివరికి పై అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫీసులో మీటింగులకు పిలవకపోవడం.. కావాలని గంటలకు గంటలు ఎక్కువసేపు పనిచేయించుకోవడం.. సరిగా పనిచేయడం లేదంటూ నివేదికలు పంపడం వంటివాటితో వేధించారు. చివరికి రాజీనామా చేస్తే.. ఆఫీసు నుంచి వచ్చే గ్రాట్యుటీ కూడా తక్కువగా ఇచ్చారు. ఇలా ఎదుర్కోవచ్చు.. - కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థను ‘షిృబాక్స్’ పేరుతో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఏ రంగంలోనైనా పని ప్రదేశంలో మహిళలు వేధింపులకు గురైతే దానికి ఫిర్యాదు చేయవచ్చు. - కేంద్ర, రాష్ట్రాల మహిళా కమిషన్లను, మహిళల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించవచ్చు. ఆంధ్రప్రదేశ్లోనూ.. ముసునూరు తహసీల్దార్పై చింతమనేని దాడి నిజాయతీగా విధులు నిర్వర్తించిన కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ ద్రోణవల్లి వనజాక్షిపై ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. 2015 జూలై 8న తమ్మిలేరులో ఇసుక మాఫియా ట్రాక్టర్లను వనజాక్షి అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన చింతమనేని, ఆయన అనుచరులు ఆమెపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. అసలు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లావంటూ ఏపీ సీఎం చంద్రబాబు వనజాక్షినే తప్పుబట్టారు. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేయడంతో.. కంటితుడుపుగా ఓ ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ తూతూమంత్రంగా స్టేట్మెంట్లు రికార్డు చేసింది. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఆమెకు జరిగిన అవమానానికి న్యాయం మాత్రం జరగలేదు. అక్రమాలను అడ్డుకున్నందుకు.. 2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మ.. అక్కడి రంగన్నగారిగడ్డ గ్రామంలో చెరువు ఆక్రమణలను గుర్తించారు. దానిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో.. టీడీపీ మద్దతు ఉన్న సర్పంచ్ రమణారెడ్డి, తన అనుచరులతో కలసి ఆమెపై దాడి చేసి, దుర్భాషలాడారు. దీనిపై ఇప్పటికీ చర్యలు శూన్యం. ఐఏఎస్నే వేధించిన మంత్రి అచ్చెన్నాయుడు! ఓ మహిళా ఐఏఎస్ అధికారి పట్ల ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు కలకలం రేపింది. అసభ్యంగా మాట్లాడటంతో ఆవేదన చెందిన ఆ మహిళా అధికారి.. ఇక్కడి ఉన్నతాధికారులతోపాటు ఢిల్లీలోనూ ఫిర్యాదులు చేశారు. వివాదం బయటకు పొక్కితే రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందన్న భయంతో కీలక అధికారులను రంగంలోకి దించి రాజీ చేసినట్లు తెలిసింది. ఆ మహిళా అధికారి కొంతకాలం కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. మహిళా ప్రజాప్రతినిధులకూ తప్పని కష్టాలు.. - గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారిలపైన ఏడాది కింద టీడీపీ ప్రజాప్రతినిధులు వేధింపులకు దిగిన సంఘటనలు వివాదాస్పదమయ్యాయి. - మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవిని సైతం టీడీపీ నేతలు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఏ పనీ చేయకుండా అడ్డుపడి, పదవి నుంచి దిగిపోవాలని బెదిరించారు. ఈ ఒత్తిళ్లతో శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. అయినా శ్రీదేవితో బలవంతంగా రాజీనామా చేయించడంతో.. ఆమె బలన్మరణానికి పాల్పడింది. చివరికి వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. - బాపట్ల ఎంపీపీ విజేత సైతం అధికార పార్టీ ఎమ్మెల్సీ వేధింపులు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగిపోవాలన్న బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఆమెకు గుండెపోటు వచ్చింది. (ఇండియాస్పెండ్ వెబ్సైట్ సౌజన్యంతో..) ఫిర్యాదు చేసినా అన్యాయమే! పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిళ్లు. చివరికి కక్ష సాధింపు చర్యలు. లైంగిక వేధింపుల కేసులపై ఫిర్యాదులు చేసేవారిలో చాలా మందికి అన్యాయమే మిగులుతుందని సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ పేర్కొ న్నారు. దాంతో చాలా మంది ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని.. ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని చెప్పారు. - 2014లో మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా కోర్టు మహిళా న్యాయమూర్తి తనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే గంగూలీ లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘తగిన ఆధారాలు’ లేవంటూ పక్కన పెట్టేసింది. చివరికి 2015 ఏప్రిల్లో ఏకే గంగూలీని అభిశంసించాలని కోరుతూ 58 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. దాంతో అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ముగ్గురు న్యాయ నిపుణులతో కమిటీని వేశారు. ఆ కమిటీ తాజాగా ఈ ఏడాది అక్టోబర్లో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తన నివేదికను సమర్పించింది. అయితే ఆ మహిళా న్యాయమూర్తి 2014లోనే తన పదవికి రాజీనామా చేసేశారు. - కొద్దిరోజుల కింద ఓ టీవీ చానల్లో పనిచేసే న్యూస్ యాంకర్ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన చానల్ యాజమాన్యం మరే సంస్థలో ఆమెకు ఉద్యోగం దొరక్కుండా చేసింది. - ప్రతిష్టాత్మక ‘టెరి (ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)’ సంస్థలో తన పైఅధికారి ఆర్కే పచౌరీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి 2015 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ఆమెను తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. వేధింపులకు నిరసనగా ‘నేను సైతం’.. ప్రముఖుల లైంగిక వేధింపులపై అమెరికన్ మహిళల ఉద్యమం పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై అమెరికాలో ఉద్యమం మొదలైంది. వేధింపులకు గురైనవారంతా ‘నేను సైతం’ అంటూ బయటికి వచ్చి తాము అనుభవించిన దుష్కృత్యాలను బయటపెడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్స్టీన్ తమను వేధించారంటూ కొందరు మహిళలు ముందుకు రావడంతో మొదలైన ఈ ఉద్యమంతో... రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల లీలలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు నెలన్నర రోజుల్లో ఏకంగా 50 మంది ప్రముఖుల బాగోతాలు బయటపడ్డాయి. దీంతో వారిలో చాలా మంది తమ దుశ్చర్యల పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొందరు ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురికాగా.. మరికొందరు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కొందరిపై కోర్టుల్లో కేసులు కూడా దాఖలవుతున్నాయి. ఎందరో ప్రముఖులు తాజాగా డెమోక్రటిక్ పార్టీ మినెసోటా సెనేటర్ అల్ ఫ్రాంకెన్ 2006లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని మాజీ మోడెల్ లియాన్ ట్వీడెన్ ఆరోపించారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన రే మూర్ (70) 1970లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని, మరో ఇద్దరు టీనేజీ ఆడపిల్లల వెంటపడ్డారని గత వారం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ‘బాంబు’ పేల్చింది. ఆయన అలబామా రాష్ట్రం నుంచి సెనేటర్గా పోటీచేయడానికి సిద్ధమవుతుండగా ఈ విషయం బయటపడడంతో పోటీ ప్రశ్నార్థకంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ (సీనియర్), హాలీవుడ్ నటుడు డస్టిన్ హాఫ్మన్ (1985లో 17 ఏళ్ల అసిస్టెంట్ అనా గ్రహమ్పై లైంగిక వేధింపుల ఆరోపణ), 1990ల్లో అండర్ సీజ్ వంటి యాక్షన్ చిత్రాల హీరో స్టీవెన్ సీగల్, 1980ల్లో ఫస్ట్ బ్లడ్, రాకీ వంటి హాలీవుడ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కండల వీరుడు సిల్వస్టర్ స్టాలన్లు కూడా ఉన్నారు. -
హాఫ్ మారథాన్కు ఢిల్లీ హైకోర్టు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో విలవిలలాడుతున్న ఢిల్లీలో హాఫ్ మారథాన్కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోయిన క్రమంలో పరుగు నుంచి తప్పుకునే రన్నర్లకు తాము రిఫండ్ పాలసీని ప్రవేశపెట్టామని నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రమాదకరంగా కాలుష్యం పెరగడంతో ఢిల్లీ,ఎన్సీఆర్ పరిధిలో హెల్త్ ఎమర్జెనీని ప్రకటించారు. స్కూళ్లను కొద్దిరోజులు మూసివేసిన అనంతరం ఇటీవలే అవి తిరిగితెరుచుకున్నాయి. కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు మాస్క్లు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. -
‘మహిళలను అగౌరవపరిచిన వారికి శిక్ష పడాల్సిందే’
న్యూఢిల్లీ: మహిళల పట్ల గౌరవభావం లేని వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అమర్యాదకరంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలుంటాయని అటువంటి వారికి హెచ్చరికలు పంపాలని స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ తెలిపారు. ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై మెజిస్టీరియల్ కోర్టు విధించిన శిక్షను తొలగించటానికి ఆయన నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ 2015 మే 25న బల్మీకి బస్తీలోని ఎంసీడీ టాయిలెట్లోకి వెళ్లింది. అదే సమయంలో కుమార్ అనే వ్యక్తి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు అతని నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన మెజిస్టీరియల్ కోర్టు కుమార్కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీనిపై కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ గురువారం తీర్పు సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఒక వివాహితతో ఎలా మెలగాలో తెలియని వ్యక్తికి ఆ శిక్ష సబబేనని తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించటం ఐపీసీ ప్రకారం శిక్షార్హమైన తీవ్ర నేరాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని చెప్పారు. దీనిపై బాధితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు మహిళ తప్పుడు ఉద్దేశంతోనే, పథకం ప్రకారం కావాలనే ఈ కేసులో కుమార్ను ఇరికించిందని, విచారణ సందర్భంగా ఆమె భర్తను సరియైన రీతిలో విచారణ జరపలేదని పేర్కొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement