-
సీట్లు 65 వేలు.. దరఖాస్తులు 20 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలిమెంటరీ టీచర్ శిక్షణ విద్యా కోర్సు (డీఎడ్)కు ఆదరణ తగ్గిపోతోందా? ఈ కోర్సు పట్ల విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోందా? అంటే.. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన డీసెట్–2019కి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఏప్రిల్ 22వ తేదీతో డీసెట్కు గడువు ముగియగా 17 వేల మందే దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, 891 ప్రయివేటు డీఎడ్ కాలేజీల్లో 65,350 సీట్లున్నాయి. తక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు డీసెట్ గడువును ఏప్రిల్ 28 వరకు పెంచినా వచ్చిన దరఖాస్తులు 18,544 మాత్రమే. దీంతో మళ్లీ మే ఐదో తేదీ వరకూ గడువు పొడిగించారు. ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాలేజీల్లో సీట్లు ఎలా భర్తీచేయాలో అధికారులకు, కాలేజీల యాజమాన్యాలకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఏటా డీఎస్సీ అని ప్రకటించి కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డీసెట్కు 56 వేల దరఖాస్తులొచ్చాయి. 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష డీసెట్ను ఆన్లైన్లో 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి దరఖాస్తులు తక్కువ రావడంతో ఆన్లైన్ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న సందిగ్ధంలో అధికారులున్నారు. మరోపక్క ఇంటర్ అడ్వాన్స్డ్సప్లిమెంటరీ పరీక్షలు, డీసెట్ ఒకేసారి జరుగుతుండటం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు 14 నుంచి 22 వరకూ జరగనున్నాయి. అయితే డీసెట్ జరిగే 15, 16 తేదీల్లో ఇంటర్ పరీక్షల్లేకుండా రెండు రోజులు వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ.. ఇంటర్ బోర్డుకు లేఖ రాసింది. షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు స్పష్టంచేశారు. అయితే డీసెట్ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున వాయిదా వేసే అవకాశం లేకుండాపోయిందని అధికారులంటున్నారు. మరోసారి ఇంటర్ బోర్డుకు లేఖ రాస్తామని కన్వీనర్ పార్వతి చెప్పారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు రోజులు వాయిదా పడితే దరఖాస్తులు పెరిగే అవకాశముంది. బీఈడీకి దరఖాస్తులు రెట్టింపు ఇదిలా ఉండగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 350 బీఈడీ కాలేజీలుండగా 45 వేల వరకు సీట్లున్నాయి. వీటికి గతంలో వచ్చిన దరఖాస్తులు ఎనిమిది వేలలోపే. పరీక్ష రాసి అర్హత సాధించాక కాలేజీల్లో చేరేవారి సంఖ్య ఐదు వేలకు మించేదికాదు. దీంతో రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల్లో దళారీలను నియమించుకుని అక్కడి విద్యార్థులను చేర్చుకుని సీట్లు భర్తీచేసుకునేవి. అయితే బీఈడీ అభ్యర్థులకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకూ అనుమతిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో బీఈడీ చేసిన వారికి అవకాశాలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఎడ్సెట్కు దరఖాస్తులు పెరిగాయి. ఎడ్సెట్–2019కి ఇప్పటివరకు 22 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీటిసంఖ్య మూడు రెట్లు అయినట్లు అధికారులు చెబుతున్నారు. -
నేటి నుంచి డీఈఈసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ రమణకుమార్ తెలిపారు. వచ్చే నెల 10 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల లింకు శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత ఏడాది పరీక్ష ఫీజు రూ. 350 ఉండగా, ఈసారి జీఎస్టీ కలుపుకొని రూ. 413గా కమిటీ నిర్ణయించింది. -
డీసెట్ గడువు పెంపు
అమరావతి : డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీసెట్) గడువు ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి డీసెట్ దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసిందని, కానీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీసెట్ పరీక్ష గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీసెట్కు అందిన దరఖాస్తులు 31,610. ఆన్లైన్లో ఈ నెల సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
8 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు డీఈఈసెట్-2015 పరీక్షకు హాజరై అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 8 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. మార్కుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఓసీ/బీసీ అభ్యర్థులైతే 100 మార్కులకు గాను 35 మార్కులు వస్తే అర్హులేనని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ లేవని, పరీక్షకు హాజరైతే వారిని అర్హులుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్/తత్సమాన, ఎస్ఎస్సీ/తత్సమాన, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ లేదా రెవెన్యూశాఖ జారీ చేసిన నివాస, కులం సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు tsdeecet.cgg.gov.in వెబ్సైట్ను పరిశీలించాలన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement