-
గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమల ధరలు పెరగడంతో దరల్ని కట్టేడి చేసే దిశగా కేంద్రప్రభుత్వం మే 13 నుంచి గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఐతే ఆ నిషేధం ఇంకా అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొంది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమ సరుకులు మే13 లోపు రిజర్వ్ చేయబడి ఉంటే అటువంటి సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక ఈజిప్టు ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈజిప్టుకు వెళ్లే గోధుమ సరుకును కూడా కేంద్రం అనుమతించిందని తెలిపింది. దేశంలోని మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికే కాకుండా పోరుగు దేశాలకు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ ఎగుమతులను అనుమతిస్తున్నట్లు కూడా తెలిపింది. (చదవండి: మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల) -
నగలు, ఐఫోన్లంటూ మస్కా
ఫేస్బుక్ ద్వారా అమాయకులకు గాలం కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టిన ముఠా సైబర్ పోలీసులకు చిక్కిన పాత్రధారులు పరారీలో మరో ఇద్దరు: 30 బ్యాంకు ఖాతాల సీజ్ సాక్షి, సిటీబ్యూరో: కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో కోట్లాది రూపాయలను కాజేసిన ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఫేస్బుక్ ద్వారా మహిళలను బుట్టలో వేసుకుని బంగారు ఆభరణాలు, ఐఫోన్లు పంపిస్తామని నమ్మించి.. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం బ్యాంకులో డబ్బులు వేయించుకుని మోసగించడం వీరి నైజం. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వివరాలను ఆదివారం ఇన్చార్జి క్రైమ్ డీసీపీ జి.జానకీ షర్మిల వెల్లడించారు. ముఠా ఏర్పడిన తీరు ఇదీ.. బీహార్కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్ కూలీలు. వీరిని అదే రాష్ట్రానికి చెందిన సితారే మహ్మద్, మిట్టు గతేడాది హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మించి తీసుకువచ్చారు. చందానగర్లో ఒక గ దిలో ఆశ్రయం కల్పించారు. వారి పేర్ల తో మాదాపూర్, చందానగర్, గచ్చిబౌలిలోని ఐసీసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఎస్బీఐ, బీఓబీలతో పాటు ఇతర బ్యాంకుల్లో నకిలీ ఓటరు కార్డులు, పాన్కార్డులతో ఒకొక్కరితో పది బ్యాంకు ఖాతాలు తెరిపించారు. సితారే మహ్మద్ వీరితో పాటే ఉండేవాడు. మిట్టు మా త్రం ఢిల్లీలో మకాం వేసేవాడు. ఇలా మోసగిస్తారు... ఢిల్లీలో ఉన్న మిట్టు తన పేరును పీటర్గా మార్చుకుని ఫేస్బుక్ ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు. వారితో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆకర్షిస్తాడు. ఆ తరువాత తాను బంగారు నగలు, ఐఫోన్ ఉచితంగానే పంపిస్తానని నమ్మిస్తాడు. అయితే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం కొంత డబ్బును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో వేయాలని చెబుతాడు. అతడి మాటలు నమ్మి చాలామంది మహిళలు బ్యాంకులో డబ్బులు వేసి మోసపోయారు. ఈ క్రమంలోనే నాగోలుకు చెందిన ఓ మహిళను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఆభరణాలు, ఐ ఫోన్ పంపిస్తున్నానని మాదాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో రూ.34,000 వేయించుకున్నాడు. ఆపై యాంటీ టైస్టు ఫండ్ పేరుతో మరో రూ.1,76,000 తీసుకున్నాడు. అయితే, ఎంతకూ నగలు, ఐఫోన్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన సదరు మహిళ గతనెల సైబర్క్రైమ్ ఏసీపీ ప్రతాప్రెడ్డికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖరరెడ్డి మాదాపూర్, గచ్చిబౌలిలోని ఆయా బ్యాంకుల్లో ఖాతాలను పరిశీలించగా బీహార్కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్ల పేర్లు వెలుగు చూశాయి. ఆదివారం వారింటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. రూ.1,10,000 తో పాటు ఏటీఎం, పాన్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన సితారే మహ్మద్, మిట్టు కోసం గాలిస్తున్నారు. విచారణలో ఈ ముఠా రూ.కోట్లను కొల్లగొట్టినట్టు గుర్తించారు. పట్టుబడ్డ ముగ్గురికి ప్రధాన సూత్రధారులు నెలలకు రూ.8000 ఇచ్చేవారిని తేలింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement