-
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గుట్టు విప్పుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై ఆధారాలు సమర్పిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కలిసి వచ్చి ప్రభుత్వ అవినీతి గుట్టు విప్పుతామని అన్నారు. బుధవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్రావు, అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, సుధీర్రెడ్డి, మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ అధ్యక్షుడు సంజయ్ చెబుతుంటే, రాష్ట్ర ప్రభు త్వంలోని పెద్దల అవినీతి వ్యవహారాలపై ఆధా రాలు దొరకలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ తదితర రంగాలకు సంబంధించి తెలంగాణలో జరిగిన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అన్ని ఆధారాలు అమిత్షాకు అందజేస్తామని పేర్కొన్నారు. తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్నారు రాష్ట్రం వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా యని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెట్టి తెలంగాణను తాగు బోతు రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు. గంజాయి మత్తులో తెలంగాణ యువత తూగుతోం దన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక సంఘట నలకు ఈ వ్యసనాలే కారణమవుతున్నాయని పేర్కొన్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్యకు కూడా ఈ వ్యసనమే కారణమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడిని గంటల్లోనే పట్టుకున్నారని పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్, తర్వాత తన ట్వీట్ను సవరించుకుని నిందితుడు దొరకలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంత సీరియస్ ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
అవినీతి ఆరోపణలు.. ఈడీ కేసులు
రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్ పవార్ సహా ఎన్సీపీ అధినేత శరద్పవార్పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు. ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. అజిత్ పవార్, ఇరిగేషన్ స్కాం... అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుని బట్టి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ ఆ తరువాత సమర్థించుకున్నారు. సెప్టెంబర్ 2012న అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తిరిగి నియామకం అయ్యారు. శరద్ పవార్, అజిత్ పవార్లపై ఈడీ కేసు... ఈ యేడాది సెప్టెంబర్లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ నేత శరద్పవార్, అజిత్పవార్లపై ఇతర మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసుని మోపారు. 2010 నవంబర్ 10 నుంచి 2014 సెప్టెంబర్ 26 వరకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్సీపీ, శివసేనల నేతలు దిలీప్రావ్ దేశ్ముఖ్, ఇషార్లాల్ జైన్, జయంతి పాటిల్, శివాజీ రావ్, ఆనంద్రావు. రాజేంద్ర షింఘేన్, మాధవ్ పాటిల్లపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంకుల చట్టాలను, ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని నాబార్డ్ ఆడిట్ రిపోర్టు వెల్లడించింది. చగన్ భుజ్బల్పై ఈడీ కేసు... మనీ ల్యాండరింగ్, నేరపూరిత దుష్ప్రవర్తన, కుట్ర, మోసపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎన్సీపీ నాయకుడూ, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్ భుజ్బల్ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా, కె.ఎస్.చమాంకర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని భుజ్బల్పై ఆరోపణలున్నాయి. -
ఐటీకి చిక్కిన ముడుపుల ముఖ్యడు!
-
టీడీపీ దోపిడీ
-
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.3 కోట్లు అడిగారు’
మెదక్ జోన్: కాంగ్రెస్ పార్టీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యే టికెట్ అడిగితే రూ.3 కోట్లు డిమాండ్ చేశారని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆరోపించారు. ఆదివారం మెదక్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 38 ఏళ్లపాటు పార్టీకి సేవ చేశానని, అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఓ రాష్ట్రస్థాయి నేత రూ.3 కోట్లు డిమాండ్ చేశారన్నారు. ఎవరు డబ్బులిస్తే వారికి అంగడి సరుకుల్లా టికెట్లు అమ్ముకోవడం బాధాకరమన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ధనవంతులకే పార్టీ టికెట్ దక్కిందన్నారు. ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పీవీ నర్సింహారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీకి పేరుండేదని, ప్రస్తుతం సరైన నాయకుడే లేకుండా పోయాడన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బంగా రు తెలంగాణలో తాము సైతం భాగస్వాములం కావాలన్న తపనతో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించార
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement