-
చల్నేదొ గాడీ
సౌకర్యవంతమైన ఖరీదు గల కారుల్లో తిరిగే సెలబ్రిటీలు సడన్గా ఆటోలో ప్రత్యక్షమైతే వింతగానే ఉంటుంది. అలాంటి ఒక వింతను షేర్ చేసుకున్నారు నటి రవీనా టాండన్. తన మేనకోడలి మెహందీ ఫంక్షన్కి వెళ్లడానికి రెడీ అయ్యారామె. కారు సకాలంలో రాకపోవడంతో చల్నేదొ గాడీ అంటూ కూతురు రాషాతో కలసి ఆటోలో బయల్దేరారు. ‘‘ఆటోలో ప్రయాణం చాలా లవ్లీగా అనిపించింది’’ అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారామె. మరి.. ఆటో డ్రైవర్ గుర్తు పట్టలేదా? అని ఫాలోయర్స్ అడిగితే– ‘‘గుర్తుపట్టారు. ఆయన పేరు అర్షద్. నా అభిమాని అని చెప్పారు. ఆటో దిగే ముందు ఆయనతో కాసేపు మాట్లాడాను’’ అన్నారు రవీనా. -
ప్రమాదంతోప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!
గుంటూరు, పెదకాకాని: గ్రామాల్లో ఆటో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. డ్రైవర్ల అత్యాశ, ప్రయాణికుల అవసరం ప్రమాదాలకు కారణమవుతోంది. ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తోంది. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామం నుంచి వెనిగండ్ల మిరపకాయల కోతలు, పత్తి తీసేందుకు బయలుదేరారు. ఆరుగురు మాత్రమే ప్రయాణం చేసే అప్పీఆటోలో 18 మంది ఎక్కారు. వెనుక, ముందు, పక్కన వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ సోమవారం క్లిక్ మనిపించింది. -
అదుపు తప్పితే ఇక అంతే!
- పరిమితికి మించి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అమ్రాబాద్: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ప్రయాణం చేస్తున్నారు. మండలంలోని అమ్రాబాద్, తిర్మలాపూర్(బీకే), లఖ్మాపూర్(బీకే), మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి తదితర గ్రామాల నుంచి ఆటోలు జీపులు అధికంగా తిరుగుతాయి. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఆయాగ్రామాల్లో వాహనాలు బోల్తాపడి ప్రయాణికులు గాయాలపాలైన ఘటనలూ లేకపోలేదు. అప్పుడప్పుడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు వేస్తున్నా ప్రైవేట్వాహనదారుల్లో మార్పు రావడంలేదు. -
ఆటోలో...అలా.. అలా...!
‘చల్లో.. చల్లో.. హవా మే గాడీ చల్లో. హమారే సాత్ చల్లో..’ అంటూ ‘బెంగాల్ టైగర్’లో రవితేజ, రాశీఖన్నా కారు, బైక్.. ఇలా పలు వాహనాల్లో వెళుతూ పాట పాడుకున్నారు. ఇప్పుడు రియల్గా శ్రుతీహాసన్, ఆమె చెల్లెలు అక్షరా హాసన్ కూడా ఈ పాటలో ఉన్నట్లే చేశారు. కాకపోతే ఆ జంట కారు, బైక్లో వెళితే ఈ అక్కాచెల్లెళ్లు ఆటోలో జర్నీ చేశారు. చెన్నై సిటీ అంతా మూడు చక్రాల వాహనంలో ఆనందంగా చక్కర్లు కొట్టేశారు. ఈ ఆనందం వెనక కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గత వారం కమల్ కాలికి గాయమైనప్పుడు శ్రుతీహాసన్ నార్వేలో ఉన్నారు. నాగచైతన్య సరసన నటిస్తున్న ‘ప్రేమమ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు తండ్రికి ఎలా ఉందోనని ఫోన్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారట. నార్వేలో షూటింగ్ పూర్తయిన వెంటనే చెన్నైకి వచ్చిన శ్రుతి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లారు. హాస్పిటల్లో కమల్ను చూసిన తర్వాత గానీ శ్రుతి మనసు కుదుట పడలేదట. తండ్రి కోలుకోవడం చూసి రిలీఫ్ అయిపోయారు. ఆ తర్వాత చెల్లెలు అక్షరాహాసన్తో కలసి ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం శ్రుతీకి అలవాటు. ఈ ఏడాది మార్చిలో స్నేహితులతో అర్ధరాత్రి ఆటోలో చక్కర్లు కొట్టారు. -
ప్రాణం.. 'ఆటో' ఇటో!
వీళ్లూ మనుషులే. వీరివీ ప్రాణాలే. ఓ తల్లి బిడ్డలే. ప్రమాదం జరిగితే ఆ కన్నపేగు పడే బాధ తెలియనిది కాదు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నా.. స్వచ్ఛందంగా చదువుకునేందుకు ముందుకొచ్చే విద్యార్థుల బాగోగులను అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. తమ పిల్లలు బాగుంటే చాలు అనుకున్నారో.. ఏమో. రోజూ మృత్యువుపై సవారీ చేస్తున్న బడి పిల్లలను చూస్తే.. దారినపోయే వారెవరికైనా మనసులో ముల్లుగుచ్చుకోక మానదు. మరి అధికారులు ఏమి చేస్తున్నట్లు? గొల్లలదొడ్డి(సి.బెళగల్): మండల పరిధిలోని గొల్లలదొడ్డి విద్యార్థులు సి.బెళగల్లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కర్నూలు నుంచి గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసినా.. పాఠశాలల సమయానికి అందుబాటులో లేకపోవడం గమనార్హం. గతంలో 7.30 గంటలకే గ్రామానికి వచ్చే బస్సు.. ప్రస్తుతం 11.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తోంది. విద్యార్థులకు ఈ సర్వీసులు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. గ్రామంలో దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు సి.బెళగల్లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు, గూడూరులోని జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలలు, కాలేజీలు ఉదయం 9 గంటలకే తెరుస్తుండటంతో గ్రామం నుంచి విద్యార్థులు ఆటోల్లో వేళాడుతూ అతి కష్టం మీద చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గొల్లలదొడ్డి గ్రామస్తులదే కాదు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల అవస్థ ఇదే. విధిలేని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తుండగా.. వాళ్లకీ నాలుగు డబ్బులు వస్తుండటంతో ప్రమాదమని తెలిసీ సామర్థ్యానికి మించి విద్యార్థులను అందులో కుక్కేస్తున్నారు. బస్సుల్లోనూ టాపుపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేపట్టకపోవడం ఎందరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement