
వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర ప్రారంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తన బస్సు యాత్రను బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాదద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు.
ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.