అగ్నిమాపక సిబ్బందికి స్వల్పగాయాలు | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక సిబ్బందికి స్వల్పగాయాలు

Published Sat, Sep 5 2015 11:46 AM

Six firemen injured battling blaze on truck

ఢిల్లీ: రసాయనాలను తీసుకవెళుతున్న ఓ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. హర్యానా నుంచి దక్షిణ ఢిల్లీలోని అలిపూర్ ప్రాంతంలో ట్రక్కు వెళుతుండగా శుక్రవారం రాత్రి  ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ట్రక్కులో రసాయనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ట్రక్కు డ్రైవర్ చెప్పాడు.

మంటలను అదుపు చేసేందుకు తాను ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించినట్టు చెప్పాడు. దాంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది స్వల్ప గాయాలపాలయ్యారంటూ అగ్నిమాపక అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement
Advertisement