హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా న్యాయ పోరాటం ప్రారంభించారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారన్నారు.
అసెంబ్లీ బిజనెస్ రూల్స్కు విరుద్ధంగా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఆయన అనుసరించిన విధానం రాజ్యాంగ విరుద్ధమని, తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం వల్ల తాను మార్చి 1 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు.
నా వాదన విన్పించే అవకాశమే ఇవ్వలేదు
‘గత ఏడాది డిసెంబర్ 17 నుంచి జరిగిన అసెంబ్లీ సెషన్లో జరిగిన అనేక చర్చలతో పాటు కాల్ మనీ సెక్స్ కుంభకోణంపై కూడా చర్చ జరిగింది. ఈ కేసులో నిందితులకు, అధికార పార్టీకి మధ్య ఉన్న అనుబంధంపై నేను పలు ప్రశ్నలు సంధించా. అయితే అధికార పార్టీ సభ్యులు నాపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే నా సస్పెన్షన్కు తీర్మానం చేయాలని వారికి సూచించారు.
వారు తీర్మానం ప్రవేశపెట్టడం, దానిని స్పీకర్ ఆమోదించి నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ సస్పెన్షన్ కాపీని నాకు ఇవ్వలేదు. అసలు సస్పెన్షన్కు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు..’ అని రోజా వివరించారు. ‘నేను అసభ్య పదజాలం వాడానని, తద్వారా శాసనసభ గౌరవాన్ని దిగజార్చానని సస్పెన్షన్పై చర్చ సందర్భంగా చెప్పారు. నా వాదన వినిపించే అవకాశం మాత్రం ఇవ్వలేదు.
అసెంబ్లీలో నా ప్రవర్తనపై అభ్యంతరం ఉంటే ఆ ఒక్క సెషన్కే సస్పెండ్ చేయాలి తప్ప, ఏడాది పాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధం..’ అని రోజా తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు న్యాయసమీక్ష లోబడి ఉంటాయని తెలియజేస్తూ.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిన తన సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.
సస్పెన్షన్పై న్యాయపోరాటం
Published Fri, Feb 12 2016 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement