మిర్యాలగూడ : పంచాయతీలలో పన్నుల వసూళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. రెండు మాసాలుగా జిల్లాలోని 1176 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిలతోపాటు జిల్లా వ్యాప్తంగా మొత్తం 20.09 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ రెండు మాసాల కాలంలో కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా రెండు, మూడు గ్రామాలకు ఒక్కే ఇన్చార్జ్గా వ్యవహరించడం వల్ల కూడా పన్నులు వసూలు కావడం లేవు. పన్నుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
13వ ఫైనాన్స్ నిధులు రూ.88 కోట్లు మంజూరు
గ్రామాలలో ఆస్తి పన్నులు వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలకు గాను 13వ ఫైనాన్స్ నిధులు 88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోపాటు పన్నుల రూపంలో వసూలైన వాటిని కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించనుంది.
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి గాను చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ భూమి ఉన్నచోట అదే భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలు, రోడ్లు చెత్త లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ నెల 31లోగా 80 శాతం పన్ను వసూళ్లకు ఆదేశాలు
ఈ నెల 31వ తేదీ లోగా గ్రామ పంచాయతీలలో 80 శాతం ఆస్తి పన్ను వసూళ్లకు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఒక్కొక్క మండలంలో కనీసం ఐదు గ్రామాల చొప్పున 300 గ్రామాల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు గాను డివిజన్ స్థాయిలలో పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
నత్తనడకన పన్నుల వసూళ్లు
Published Wed, Mar 4 2015 3:50 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement