ఇది తొలి అడుగు మాత్రమే: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

ఇది తొలి అడుగు మాత్రమే: కేటీఆర్

Published Tue, May 26 2015 6:49 AM

ఇది తొలి అడుగు మాత్రమే: కేటీఆర్ - Sakshi

హైదరాబాద్: విదేశీ పర్యటనలు ముగించుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే తాను అమెరికా పర్యటనకు వెళ్లి రూ.మూడు వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు చెప్పారు. ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

దేశంలో అత్యద్భుత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు నూతన పారిశ్రామిక విధానం ద్వారా మేలు చేస్తామని చెప్పారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం చూసి అమెరికాలో సంస్థలు ఆశ్యర్యం వ్యక్తం చేశాయని, పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ నెల 5న కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement