పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు

Published Thu, Aug 28 2014 6:22 PM

పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు - Sakshi

హైదరాబాద్: ప్రముఖ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. పూరీ జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 5 కోట్ల రూపాయల భూవివాదంలో వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాయి.  సొంతంగా వైష్టో అకాడమి స్థాపించి సినిమాలు కూడా నిర్మించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement