-
పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి
సాక్షి, నంద్యాల/సాక్షి, హైదరాబాద్: టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్లుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయితీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన్ని కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు. ఆయన్ని వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటికి వెళ్లకుండా ఆయన అనుచరులు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్లో ఉన్న సీసీఎస్ పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్లోని శివానందరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్్కరెడ్డిని, ప్రశాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్న శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలోను ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని సీసీఎస్ పోలీసులు బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా.. సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా పాల్పడిన నేరం బయటపడింది. రాజేంద్రనగర్ శివారులో ఉన్న ఈ ప్రాంతంలోని 282, 283, 284, 289 సర్వే నంబర్లలో 480 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో 1997లో అప్పటి ప్రభుత్వం ఈ భూముల్ని వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అక్కడున్న అసైనీలతోపాటు అప్పటికే ఆ స్థలాల్లో ఉంటున్న వారికీ న్యాయం చేయాలని ఆదేశాలొచ్చాయి. 2008లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ఒక్కో అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కుల్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అసైనీలు విక్రయహక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక్కో అసైనీకి 800 చదరపు గజాల చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాల చొప్పున 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. భాగస్వాముల విభేదాలతో.. ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం టి.జె.ప్రకాష్, కోనేరు గాంధీ, ఎస్.దశరథరామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నర్సింహులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018ల్లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నంబర్లు 282, 289ల్లో ఉన్న స్థలం నుంచి కొంతభాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్డ్ భూమి కావడంతో గరిష్టంగా ఆరునెలల్లో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికీ ఈ తంతు పూర్తిగాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్ 18న ప్రకాష్, గాం«దీ, దశరథ్లపై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటి దర్యాప్తులో ఆయన పాత్ర వెలుగులోకి.. ఈ నాలుగు కేసుల దర్యాప్తులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పాత్ర వెలుగులోకి వచి్చంది. 2015–16లో రంగంలోకి దిగిన శివానందరెడ్డి తాను బయటకు రాకుండా టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్.దశరథరామారావులను ముందుపెట్టి కథ నడిపారు. ఆ భూముల్ని తన కంపెనీ పేరుతో రాయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నారని వెలుగులోకి వచ్చింది. పట్టాలు కూడా అసైనీలకు ఇవ్వకుండా, లేఔట్ కూడా వేయకుండా వారిని భయపెట్టి రిజి్రస్టేషన్లు కూడా పూర్తిచేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. గజం కనిష్టంగా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంలో అప్పటి కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. జనవరిలో కోర్టు అనుమతితో సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డికి చెందిన వెస్సెల్లా గ్రూప్ కార్యాలయాల్లోను, ఆయన ఇంట్లోను సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మొత్తం 26 ఎకరాల అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్న శివానందరెడ్డి.. వెస్సెల్లా గ్రూప్ పేరిట 400 చదరపు గజాలు (5 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా), 800 చదరపు గజాల (10 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా) విస్తీర్ణంలో లగ్జరీ విల్లాలు నిర్మిస్తామని ప్రచారం చేయడమేగాక ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చదరపు అడుగుకి రూ.10 వేల చొప్పున అనేకమంది నుంచి అడ్వాన్సులు సైతం వసూలు చేశారని ఈ డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు. -
భూ వివాదంలో ఎస్సై అత్యుత్సాహం.. బలైన నిండు ప్రాణం!
చింతపల్లి: పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన భూ వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్య (56) హైదరాబాదులోని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తోడ మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. స్వగ్రామంలో సూర్యా తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా పంచుకుని సాగు చేసుకుంటున్నారు. కాగా, సూర్యా హైదరాబాద్లో ఉంటుండగా అతడి తమ్ముడు భీమా కొంత అన్న భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇదే విషయంపై సూర్యా అతడి తమ్ముడు భీమా మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అప్పుకు భూమికి లింక్ పెట్టి.. సూర్యా కుమారుడు కిరణ్ తరచూ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాబాయి బీమా వద్ద కిరణ్ అవసరాల నిమిత్తం రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని బీమా కోరడంతో తమ భూమిని కొంత పట్టా చేయించుకున్నావని, ఆ సమస్య పరిష్కారం అయితేనే అప్పు డబ్బులు చెల్లిస్తామని సూర్యా అతడి కుమారుడు కిరణ్ తేల్చిచెప్పారు. విషయం పెద్ద మనుషుల వద్దకు చేరడంతో రెండు నెలల క్రితం బీమా తన పేరిట అధికంగా ఉన్న పట్టా భూమిని సోదరుడు సూర్యాపై ఎక్కించాడు. డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు బీమా తన పేరిట అధికంగా ఉన్న భూమిని సూర్యా పేరిట పట్టా చేయించిన తిరిగి అప్పు చెల్లించలేదు. దీంతో విసిగిపోయిన బీమా శుక్రవారం చింతపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సతీష్రెడ్డి అప్పు తిరిగి ఇవ్వడంతో తాత్సారం చేస్తున్న సూర్య, అతడి కుమారుడిని పిలిపించాలని అదే రోజు సిబ్బందిని ఆదేశించాడు. దీంతో వారు సూర్యకు ఫోన్ చేసి ఠాణాకు రావాలని హుకుం జారీ చేశారు. రెండు రోజుల తర్వాత వచ్చారని.. సూర్య, అతడి కుమారుడు కిరణ్ ఆదివారం చింతపల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. సాయంత్రం తిరిగి విధులకు హాజరైన ఎస్ఐ స్టేషన్కు రావాలని ఫోన్ చేస్తే రెండు రోజుల తర్వాత వస్తారా అంటూ వారిపై కోపంతో చేయిచేసుకున్నాడు. దీంతో సూర్యా అస్వస్థతకు గురై వాంతి చేసుకున్నాడు. వెంటనే పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సూర్యను దేవరకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కుప్పకూలి మృతిచెందాడు. ఎస్ఐ చేయి చేసుకోవడంతోనే సూర్య మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు వాగ్వాదం జరిగింది. మృతదేహాన్ని చింతపల్లి పోలీస్స్టేషన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని దేవరకొండ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే, సూర్యకు బీపీ పెరగి గుండెపోటుతో మృతిచెందాడని దేవరకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. చింతపల్లి పోలీస్స్టేషన్ను నల్లగొండ ఎస్పీ అపూర్వరావు సందర్శించారు. ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి ఎస్ఐని వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. కేసు ఇదీ.. మచ్చబొల్లారంలో సర్వే నంబర్ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు. వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నందీశ్వరస్వామికి విశేషపూజలు
కేఎంసీలో పలువురు వైద్యుల బదిలీ
టీడీపీపై ప్రజల తిరుగుబాటు
నయవంచకుడు చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంతోనేల ఆరోగ్యం
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
చంద్రబాబు కేరాఫ్ కరువు
కర్నూలు టీడీపీలో ‘పోల్ మేనేజ్మెంట్’ కేటుగాళ్లు!
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement