- ఐదు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం
- రాష్ర్ట వ్యవసాయ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వర్షాభావం కారణంగా రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 4.96 లక్షల ఎకరాల్లోని మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, వరి, పెసర, కంది, జొన్న పంటలు ఎండిపోతున్నాయంది.15 రోజులుగా వర్షాలు కనుమరుగు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో జిల్లా వ్యవసాయాధికారుల నేతృత్వంలో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, స్థానిక అధికారులతో కలసి సంయుక్త బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాలని సూచించింది. గడ్డు పరిస్థితుల్లో రైతులకు అవసరమైన సలహాలు ఇచ్చి పంటలను ఆదుకోవాలంది.
జూన్లో మురిపించి... ఆగస్టులో ఏడిపించి..
ఖరీఫ్ ప్రారంభమైన జూన్లో వర్షాలు మురిపించాయి. జూన్లో సాధారణ వర్షపాతం 127.6 మిల్లీమీటర్లు కాగా... 190.9 ఎంఎంలు కురిసింది. అయితే ఆగస్టులో ఇప్పటివరకు 171.4 ఎంఎంలు కురవాల్సి ఉండగా... కేవలం 58 మిల్లీమీటర్లే పడింది. మొత్తంగా ఈ మూడు నెలల కాలంలో మెదక్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో లోటు, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
52 శాతానికి మించని వరి నాట్లు...
రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో అన్ని రకాల పంటల సాగు జరిగింది. 1.07 కోట్ల ఎకరాల్లో సాధారణంగా పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 86.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 48.11 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 43.54 లక్షల ఎకరాల్లో (90%) సాగయ్యింది. అందులో వరి సాధారణ విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 12.62 లక్షల ఎకరాల్లో (52%) మాత్రమే నాట్లు పడ్డాయి. వర్షాలు లేకపోవడం.. భూగర్భ జలాలు పెరగకపోవడం, జలాశయాల్లోకి నీళ్లు రాకపోవడంతో నాట్లు పడడంలేదని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు మాత్రమే నాట్లకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్లో పప్పుధాన్యాలు, మొక్కజొన్న సహా కొన్ని పంటలు మాత్రమే సాధారణం కంటే అధికంగా సాగయ్యాయి.
5 లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
Published Thu, Aug 25 2016 1:26 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement