అల్లమో.. బెల్లమో పండించి మొక్కులు తీర్చుకో | Sakshi
Sakshi News home page

అల్లమో.. బెల్లమో పండించి మొక్కులు తీర్చుకో

Published Wed, Feb 15 2017 1:37 AM

అల్లమో.. బెల్లమో పండించి మొక్కులు తీర్చుకో - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

వైరా: ‘దేవుళ్ల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నావు.. అల్లం పండి స్తావో.. బెల్లం పండి స్తావో ఆ డబ్బులతో మొక్కులు చెల్లించు కో.. కానీ, దేవుడి పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే రాజ్యాంగం ప్రకారం కేసు అవుతుంది.. జైలుకు పోవడం ఖాయం’అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా వైరాకు చేరుకుంది.

ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ రూ.50 కోట్లు వెచ్చించి 150 గదులతో ఇల్లు నిర్మించుకోవడం కేసీఆర్‌ దొరతనానికి దర్పణం అని విమర్శించారు.  మంత్రులు సైతం తనకు ఫోన్‌ చేసి పాదయాత్ర విజయవంతంగా సాగుతోం దని అంటున్నారని చెప్పారు.

Advertisement
Advertisement