భానుకు పెళ్లయ్యింది | Sakshi
Sakshi News home page

భానుకు పెళ్లయ్యింది

Published Mon, Aug 31 2015 2:52 AM

భానుకు పెళ్లయ్యింది

 తమిళసినిమా: నటి భానుకు పెళ్లయ్యింది.తామరభనణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథాయికగా పరిచయం అయిన కేరళా కుట్టి భాను.ఈ అసలు పేరు ముక్తా. తమిళంలో రసిగర్ మండ్రం,అళగర్‌మలై,పొన్నర్ శంకర్ చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన వాసువుమ్ శరవణన్ ఒన్నా పడిచ్చవంగ చిత్రం ఇటీవలే విడుదలైంది. భానుకు ప్రముఖ మలయాళ గాయని నిమీ టోమి సోదరుడు రింగూ టోమికి వివాహం నిశ్చయం అయ్యింది. వీరి వివాహ నిశ్చతార్థం ఇటీవల కేరళాలోని కొచ్చిలో జరిగింది.  భాను వివాహం ఆదివారం కొచ్చిలోని సెయింట్ జార్జ్ చర్చ్‌లో ఉదయం 12.15 గంటల ప్రాంతంలో క్రిస్టియన్ సంప్రదాయబద్ధంగా జరిగింది.ఈ వివాహానికి కుటుంబ సభ్యులు,స్నేహితులు,పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
 

Advertisement
Advertisement