జాతరలో ఘర్షణ: వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

జాతరలో ఘర్షణ: వ్యక్తి మృతి

Published Wed, May 17 2017 11:13 AM

1 killed, another injured in group clash

ఆత్మకూరు: జాతర సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం పాతర్లపాడులో బుధవారం వెలుగుచూసింది. గ్రామంలో ఘనంగా నిర్వహించే గంగదేవమ్మ జాతరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో.. సౌడయ్య అనే వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement