ఆనంద్‌కు మరో ‘డ్రా’ | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మరో ‘డ్రా’

Published Fri, Aug 28 2015 12:38 AM

One more draw to Viswanathan Anand

సెయింట్ లూయీస్ (అమెరికా) : సింక్విఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరో డ్రా నమోదు చేశాడు. ఫాబియాన్ కరునా (అమెరికా) జరిగిన నాలుగో గేమ్‌ను ఆనంద్ సమం చేశాడు. ఇందులో ఆనంద్ నల్ల పావులతో బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు గేమ్‌లో ఓడిన ఆనంద్‌కు ఇది వరుసగా రెండో డ్రా. 10 మంది అగ్రశ్రేణి  గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొపలోవ్, ఆరోనియన్ చెరో 3 పాయింట్లతో ముందంజలో ఉన్నారు.

Advertisement
Advertisement